LIVE : నీటివినియోగదారుల సంఘం ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం - ప్రత్యక్షప్రసారం - CHANDRABABU SRISAILAM TOUR

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 1, 2024, 1:26 PM IST

Updated : Aug 1, 2024, 1:58 PM IST

thumbnail
Chandrababu Srisailam Tour Live : శ్రీశైలం మల్లికార్జున స్వామిని సీఎం చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ఆయన ప్రదక్షిణ చేశారు. అనంతరం భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లకు చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. దర్శన అనంతరం ముఖ్యమంత్రికి పండితులు తీర్థప్రసాదాలు ఇచ్చి వేదాశీర్వచనాలు అందించారు.  దేవాలయం వెలుపల చంద్రబాబును కలిసేందుకు నేతలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో కాసేపు ఆలయ ప్రాంగణం అంతా సందడి వాతావరణం నెలకొంది. అంతకుమందు ఉదయం సున్నిపెంటకు హెలికాప్టర్‌లో సీఎం చంద్రబాబు చేరుకున్నారు. ఆయనకు మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, గొట్టిపాటి రవికుమార్, నంద్యాల ఎంపీ  బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.అనంతరం శ్రీశైలం ప్రాజెక్టుకు చంద్రబాబు చేరుకున్నారు. ఈ క్రమంలోనే సీఎం జలహారతి ఇచ్చారు. అనంతరం జలవిద్యుత్‌ కేంద్రాన్ని పరిశీలించి, నీటివినియోగదారుల సంఘం ప్రతినిధులతో ఆయన సమావేశం కానున్నారు.  
Last Updated : Aug 1, 2024, 1:58 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.