thumbnail

LIVE : తెలుగుదేశం సభ్యత నమోదు కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు - ప్రత్యక్ష ప్రసారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Updated : 8 minutes ago

CM Chandrababu Launching TDP Membership Registration Program In Amravati NTR Bhavan : అమరావతి పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో  ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం సభ్యత నమోదు కార్యక్రమం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమయ్యింది. రూ.లక్ష కట్టిన వారికి శాశ్వత సభ్యత్వం. రూ.100 సభ్యత్వంతో తెదేపా కార్యకర్తలకు రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా, వారి కుటుంబ సభ్యులకు విద్య, వైద్యం, ఉపాధి కోసం సాయం అందించనున్నారు. సభ్యత్వ కార్డు ఉన్న వ్యక్తి చనిపోయిన రోజే అంత్యక్రియలకు రూ.పది వేలు, కార్యకర్తల కుటుంబాలకు విద్య, వైద్యం, ఉపాధి కోసం సాయం అందించనున్నట్లు తెలిపారు. సభ్యత్వ నమోదును ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నేతలు, కార్యకర్తలు రికార్డు స్థాయిలో నిర్వహించాలని నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. చంద్రబాబు ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించి తన సభ్యత్వాన్ని పునరుద్దరించుకున్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యులుగా నమోదు చేసుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఎమ్మెల్యేలు తెలుపారు. ఆన్లైన్​ కూడా నమోదు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్​ భవన్​లో సభ్యత్వ నమోదు కార్యక్రమం మీకోసం ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : 8 minutes ago

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.