LIVE: పలాసలో చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ- ప్రత్యక్షప్రసారం - Palasa Prajagalam Live - PALASA PRAJAGALAM LIVE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-04-2024/640-480-21231435-thumbnail-16x9-chandrababu-naidu-palasa-prajagalam-live.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 15, 2024, 6:54 PM IST
|Updated : Apr 15, 2024, 8:06 PM IST
Chandrababu Naidu Palasa Prajagalam Live: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజాగళం సభలు జోరుగా సాగుతున్నాయి. ఈరోజు విజయనగరం జిల్లా రాజాం 'ప్రజాగళం' సభలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి పనేంటని చంద్రబాబు ప్రశ్నించారు. సీఎం జగన్కు విశాఖలోని ఆస్తులపైనే ఎక్కువ ప్రేమ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాఖను గంజాయి, డ్రగ్స్కు రాజధాని చేసిందని రాజాం ప్రజాగళం సభలో చంద్రబాబు ధ్వజమెత్తారు. నిన్న పాయకరావుపేట ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు "పేదోడినని చెప్పుకొనే ఈ ముఖ్యమంత్రి తొమ్మిదిసార్లు విద్యుత్ ఛార్జీలు, 3 సార్లు బస్సు ఛార్జీలు పెంచారు. జగన్ తెచ్చిన ప్రతి పథకం వెనుక పెద్ద కుంభకోణం ఉంది. కుంభకోణాలకు పాల్పడిన వారిని ఉక్కు పాదంతో తొక్కాలి. ఆకాశమే హద్దుగా ఏపీని అభివృద్ధి చేసే మేనిఫెస్టో తెచ్చాం. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఖాతాల్లో వేస్తాం. తల్లికి వందనం కార్యక్రమం కింద ఏడాదికి రూ.15వేల చొప్పున, ఏప్రిల్ నుంచి వృద్ధాప్య, వితంతు పింఛన్లు రూ.4వేలు చొప్పున ఇస్తాం. కూటమి అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యతమీదని, యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాదని చంద్రబాబు పేర్కొన్నారు". శ్రీకాకుళం జిల్లా పలాస 'ప్రజాగళం' సభలో చంద్రబాబు ప్రసంగిస్తున్న ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Apr 15, 2024, 8:06 PM IST