'అప్పన్నే రక్షించాడా!' సింహాచలంలో పెచ్చులూడిన కేశఖండనశాల- భక్తులకు తప్పిన ప్రమాదం - సింహాచలంలో పెచ్చులూడిన స్లాబ్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 1, 2024, 6:53 PM IST
Building Slab Damaged in Simhachalam: సింహాద్రి అప్పన్న స్వామి ఆలయం కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఎంతో ప్రఖ్యాతమైనది. పలు ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. అంతటి ముఖ్యమైన ఆలయంలోని కేశఖండనశాలలో ఓ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
సింహాద్రి అప్పన్న కేశఖండనశాల స్లాబ్ పెచ్చులు ఊడి కింద పడ్డిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. విశాఖపట్నం జిల్లా సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో స్వామివారి కేశఖండనశాలలో స్లాబ్ పెచ్చులు కింద పడ్డాయి. ప్రమాదం జరిగిన సమయంలో భక్తులు లేకపోవడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదం అనంతరం ముందు జాగ్రత్తగా స్లాబ్ పెచ్చులూడిన ప్రదేశాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో భక్తులు ఉండి ఉంటే తీవ్ర ప్రమాదానికి గురై ఉండేవారు. భక్తుల సంఖ్య ఈ రోజు తక్కువగా ఉండటంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు.