thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 17, 2024, 3:52 PM IST

ETV Bharat / Videos

స్థలం కోసం రెండు గ్రామాల గొడవ - రాళ్లు, కర్రలతో దాడి - Fight For Land in YSR District

Fight For Land in YSR District : వైఎస్సార్​ జిల్లా గోపవరం మండలం సిద్ధమ్మ పేరంటాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ స్థలం విషయంలో బద్వేలు, శ్రీనివాసపురం గ్రామస్థులు ఘర్షణకు దిగారు. తమ స్థలంలో అక్రమంగా గుడిసెలు వేశారంటూ ఒకరిపై మరొకరు నిందలు మోపుతూ పరస్పరం దాడులకు దిగారు. స్థలం తమదేనంటూ బద్వేలు, శ్రీనివాసపురం గ్రామస్థుల పరస్పర దాడులకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గొడవకు దిగినవారిపై లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. అప్పటికే కర్రలు, రాళ్లతో దాడి చేసుకుంటున్న వారితో ఉద్రిక్తత నెలకొంది. వారిని కట్టడి చేసిన పోలీసులు దాడికి పాల్పడ్డ వారిలో కొందర్ని అదుపులోకి తీసుకుని పోలీస్ వారిని స్టేషన్‌కు తరలించారు.

గత ప్రభుత్వం హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా భూ దోపిడీలు కోకొల్లలుగా జరిగిన విషయం విదితమే. ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములని తేడా లేకుండా అక్రమ రిజిస్ట్రేషన్లు, దోపిడీలతో వైఎస్సార్సీపీ నేతలు పబ్బం గడిపారు. ఈ ఉదంతాలు ఒక్కొటిగా వెలుగు చూస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.