thumbnail

పాత కక్షలతో దారికాచి వ్యక్తిని చితగొట్టిన ప్రత్యర్ధులు - Attacked on man

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 7, 2024, 7:56 PM IST

A Person was Attacked in Bapatla District due to Old Factions : పాత కక్షల నేపథ్యంలో దారికాచి ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటన బాపట్ల జిల్లా రేపల్లెలో జరిగింది. ఊలుపాలెం గ్రామానికి చెందిన ఖైతేపల్లి నాగరాజుకు అదే గ్రామానికి చెందిన చిరంజీవికి చెందిన వర్గీయులకు పాత గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ అయిన నాగరాజు ప్రయాణికులను ఎక్కించుకు రేపల్లె వెళ్తున్నాడు. అరవపల్లి గ్రామ శివారులో రాగానే నాగరాజుపై దాడి చేయడానికి అప్పటికే అక్కడ దారికాచి 10 మంది ప్రత్యర్థులు ఉన్నారు. 

నాగరాజు అక్కడికి చేరుకోగానే ఆటోలో నుంచి బయటికి లాగి కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేసారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు హుటాహుటిన రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వైద్యులు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాధితుడు నాగరాజు గతంలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని సమాచారం.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.