thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 5, 2024, 4:34 PM IST

ETV Bharat / Videos

₹54 లక్షల ఫిక్స్​డ్​ డిపాజిట్​పై కన్ను - ఎలా కొట్టేశారంటే ? - 54 lakhs Fraud With fake id

Forgery Case Filed in Machilipatnam :  వయసు పైబడి పలు ఆరోగ్య సమస్యలతో గత డిసెంబర్​లో ఓ వృద్దురాలు మరణించింది. మృతురాలు వేమురి లక్ష్మితులసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గొడుగుపేట బ్రాంచ్​లో రూ. 54 లక్షలు ఫిక్స్​డ్​ డిపాజిట్ చేసింది. ఆమె బ్యాంక్​ ఖాతాలో రూ. 54 లక్షలు ఉన్నాయని తెలిసిన బంధువు కాత్యాయనీ వాటిని ఎలాగైనా కాజేయాలనుకుంది. అయితే ఆ డబ్బులకు మృతురాలి సోదరి ఆస్ట్రేలియాలో నివసిస్తున్న రామ సుందరి నామినీగా ఉంది. 

ఈ ఫిక్స్​డ్ డిపాజిట్​పై కన్నేసిన మృతురాలి సోదరి కుమార్తె కాత్యాయనీ, సదరు ఫిక్స్​డ్ డిపాజిట్​కు తానే నామినీ అని పేర్కొంటూ, రామసుందరి గుర్తింపు కార్డులు సృష్టించి, సంతకాలు ఫోర్జరీ చేసి ఎఫ్‌డీలోని 54 లక్షల రూపాయలు డ్రా చేసేసుకుంది. ఇది ఇలా ఉండగా గత నెలలో అసలు నామినీ రమాసుందరి బ్యాంక్​కు వెళ్లి సొమ్ము డ్రా చేసేందుకు చూడగా అసలు విషయం బయట పడింది. ఈ విషయాన్ని బ్యాంక్​ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఎస్​బీఐ చీఫ్ మేనేజర్ స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దర్యాఫ్తులో కాత్యాయనీ ఫోర్జరీ వ్యవహారం బయటపడింది. ఆమెకు సహకరించిన కుమారుడు ఫణింద్ర సహా పలువురుపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.