ETV Bharat / state

'చీటీ డబ్బులు అడిగితే చంపేస్తామంటున్నారు - వైఎస్సార్సీపీ నేతల నుంచి ప్రాణహాని ఉంది' - YSRCP Victim at CM House

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 13, 2024, 3:34 PM IST

Updated : Sep 13, 2024, 3:56 PM IST

YSRCP Victim at CM House: వైఎస్సార్సీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ వెంకటలక్ష్మి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. వైఎస్సార్సీపీ నేత లోలద రమణ వద్ద 2021 నుంచి రూ.15 లక్షలు చీటీ కడుతున్నామని, కట్టిన డబ్బులు చెల్లించకపోగా అడిగితే చంపేస్తానని బెదిరించినట్లు ఆరోపించారు. భీమిలి నుంచి సీఎం చంద్రబాబు నివాసానికి వచ్చిన బాధితురాలికి మంత్రి నారా లోకేశ్ ధైర్యం చెప్పి, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

YSRCP Victim at CM House
YSRCP Victim at CM House (ETV Bharat)

YSRCP Victim at CM Chandrababu House: వైఎస్సార్సీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ భీమిలి నుంచి బాధితురాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వచ్చారు. బాధితురాలికి న్యాయం చేస్తానని మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. లోలద రమణ అనే వైఎస్సార్సీపీ నేత వద్ద 2021 నుంచి 15 లక్షల రూపాయల చీటీ కడుతూ వచ్చానని బాధితురాలు జి. వెంకటలక్ష్మి తెలిపారు. చీటీ డబ్బులు తిరిగి చెల్లించకపోగా చంపేస్తానని బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. పలువురితో తాను చీటీ కట్టించినందున వారంతా తనను కట్టమని ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రమణ మాత్రం డబ్బులు తిరిగి చెల్లించకపోగా గంజాయ్ బ్యాచ్​తో తన కుమార్తెలను చంపిస్తానని బెదిరించటంతో పారిపోయి వచ్చాననన్నారు. గత 2 వారాల నుంచి ఎక్కడెక్కడో తల దాచుకుంటూ, చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వచ్చానని తెలిపారు.

తాను 300 మంది నుంచి చీటీలు కట్టించుకున్నానని, మొత్తంగా నెలకు 75 వేల రూపాయల చొప్పున 15 లక్షల రూపాయలు కట్టామని తెలిపారు. ఇప్పుడు అందరూ తన ఇంటిమీదకి వస్తున్నారని, పెద్ద మనుషులను కూడా తీసుకొని వెళ్లినా, వాళ్లని కూడా ఆ వైఎస్సార్సీపీ నేత కొట్టించడానికి మనుషులను తీసుకునివచ్చారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.

తనని వైఎస్సార్సీపీ నేతలు బెదిరిస్తున్నారని, గంజాయి బ్యాచ్​ని తీసుకుని వచ్చి, పిల్లన్ని ఏమైనా చేస్తామని అంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ఊరి నుంచి తాము పారిపోయామని అందరూ అంటున్నారని వాపోయారు. తాము ఎక్కడకీ పారిపోలేదని, తమ చీటీ డబ్బుల కోసం వచ్చామన్నారు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి లోకేశ్ వెంకటలక్ష్మికి ధైర్యం చెప్పి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

"నేను 300 మంది నుంచి చీటీలు కట్టించుకున్నాను. నెలకు 75 వేల రూపాయల చొప్పున కట్టాము. ఇప్పుడు అందరూ మా ఇంటిమీదకి వస్తున్నారు. పెద్ద మనుషులను కూడా తీసుకొని వెళ్లాను. వాళ్లని కూడా కొట్టించడానికి మనుషులను తీసుకునివచ్చారు. వైఎస్సార్సీపీ నేతలు బెదిరిస్తున్నారు. గంజాయి బ్యాచ్​ని తీసుకుని వచ్చి, పిల్లన్ని ఏమైనా చేస్తామని అంటున్నారు. మేము నెలకు 75 వేల రూపాయల చొప్పున 15 లక్షల రూపాయలు కట్టాము. ఊర్లో మేము పారిపోయాము అని అందరూ అంటున్నారు. మేము ఎక్కడకీ పారిపోలేదు. మా చీటీ డబ్బుల కోసం ఇక్కడకి వచ్చాము. ఆ వైఎస్సార్సీపీ నేత వలన మేము అప్పులపాలయ్యాము. ఆయన పేరు లోలద రమణ". - బాధితురాలు

విద్యాసాగర్‌కు వైఎస్సార్సీపీ నేతలు ఎందుకు మద్దతు ఇస్తున్నారు: నటి కాదంబరీ - Bollywood Actress kadambari Issue

YSRCP Victim at CM Chandrababu House: వైఎస్సార్సీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ భీమిలి నుంచి బాధితురాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వచ్చారు. బాధితురాలికి న్యాయం చేస్తానని మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. లోలద రమణ అనే వైఎస్సార్సీపీ నేత వద్ద 2021 నుంచి 15 లక్షల రూపాయల చీటీ కడుతూ వచ్చానని బాధితురాలు జి. వెంకటలక్ష్మి తెలిపారు. చీటీ డబ్బులు తిరిగి చెల్లించకపోగా చంపేస్తానని బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. పలువురితో తాను చీటీ కట్టించినందున వారంతా తనను కట్టమని ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రమణ మాత్రం డబ్బులు తిరిగి చెల్లించకపోగా గంజాయ్ బ్యాచ్​తో తన కుమార్తెలను చంపిస్తానని బెదిరించటంతో పారిపోయి వచ్చాననన్నారు. గత 2 వారాల నుంచి ఎక్కడెక్కడో తల దాచుకుంటూ, చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వచ్చానని తెలిపారు.

తాను 300 మంది నుంచి చీటీలు కట్టించుకున్నానని, మొత్తంగా నెలకు 75 వేల రూపాయల చొప్పున 15 లక్షల రూపాయలు కట్టామని తెలిపారు. ఇప్పుడు అందరూ తన ఇంటిమీదకి వస్తున్నారని, పెద్ద మనుషులను కూడా తీసుకొని వెళ్లినా, వాళ్లని కూడా ఆ వైఎస్సార్సీపీ నేత కొట్టించడానికి మనుషులను తీసుకునివచ్చారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.

తనని వైఎస్సార్సీపీ నేతలు బెదిరిస్తున్నారని, గంజాయి బ్యాచ్​ని తీసుకుని వచ్చి, పిల్లన్ని ఏమైనా చేస్తామని అంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ఊరి నుంచి తాము పారిపోయామని అందరూ అంటున్నారని వాపోయారు. తాము ఎక్కడకీ పారిపోలేదని, తమ చీటీ డబ్బుల కోసం వచ్చామన్నారు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి లోకేశ్ వెంకటలక్ష్మికి ధైర్యం చెప్పి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

"నేను 300 మంది నుంచి చీటీలు కట్టించుకున్నాను. నెలకు 75 వేల రూపాయల చొప్పున కట్టాము. ఇప్పుడు అందరూ మా ఇంటిమీదకి వస్తున్నారు. పెద్ద మనుషులను కూడా తీసుకొని వెళ్లాను. వాళ్లని కూడా కొట్టించడానికి మనుషులను తీసుకునివచ్చారు. వైఎస్సార్సీపీ నేతలు బెదిరిస్తున్నారు. గంజాయి బ్యాచ్​ని తీసుకుని వచ్చి, పిల్లన్ని ఏమైనా చేస్తామని అంటున్నారు. మేము నెలకు 75 వేల రూపాయల చొప్పున 15 లక్షల రూపాయలు కట్టాము. ఊర్లో మేము పారిపోయాము అని అందరూ అంటున్నారు. మేము ఎక్కడకీ పారిపోలేదు. మా చీటీ డబ్బుల కోసం ఇక్కడకి వచ్చాము. ఆ వైఎస్సార్సీపీ నేత వలన మేము అప్పులపాలయ్యాము. ఆయన పేరు లోలద రమణ". - బాధితురాలు

విద్యాసాగర్‌కు వైఎస్సార్సీపీ నేతలు ఎందుకు మద్దతు ఇస్తున్నారు: నటి కాదంబరీ - Bollywood Actress kadambari Issue

Last Updated : Sep 13, 2024, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.