ETV Bharat / state

వైఎస్సార్సీపీ అక్రమ నిర్మాణాలు - కూల్చివేసిన సీఆర్డీఏ అధికారులు - YSRCP Office Demolished

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 22, 2024, 8:09 AM IST

Updated : Jun 22, 2024, 9:22 AM IST

YSRCP Office Demolished in Tadepalli: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో వైఎస్సార్సీపీ కార్యాలయం కోసం అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. ఈ అక్రమ నిర్మాణంపై వైఎస్సార్సీపీకి సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది.

YSRCP Office Demolished in Tadepalli
YSRCP Office Demolished in Tadepalli (ETV Bharat)

YSRCP Office Demolished in Tadepalli : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం వద్ద జలవనరులశాఖకు చెందిన స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని (YSRCP Office Illegal Construction) సీఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. గత ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా బోటు యార్డులోని జలవనరుల శాఖకు చెందిన 2 ఎకరాల స్థలాన్ని అతి తక్కువ ధరకే లీజుకు కట్టబెట్టారు. ఏటా 2 వేల రూపాయలు చెల్లించేలా జీవో తెచ్చారు. ఈ స్థలంలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మించేందుకు అప్పటి అధికారులు చకచకా అనుమతులు ఇచ్చేశారు. జీ ప్లస్‌ టు లో కార్యాలయం నిర్మించేందుకు వైఎస్సార్సీపీ నేతలు నిర్మాణాలు ప్రారంభించారు.

'నేనింతే - నా తీరింతే - అసెంబ్లీకి రానంతే' - Jagan on Speaker Election Process

5 బుల్డోజర్లతో 2 గంటల్లోనే కార్యాలయం కూల్చివేత : ప్రభుత్వం మారిన నేపథ్యంలో జలవనరులశాఖ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్నారంటూ సీఆర్డీఏ అధికారులు 4 రోజుల క్రితం వైఎస్సార్సీపీకు నోటీసులు జారీ చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా చట్ట నిబంధనల మేరకు నడుచుకోవాలని సీఆర్డీఏకు కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఉదయం 5 బుల్డోజర్లతో వైఎస్సార్సీపీ నిర్మిస్తున్న అక్రమ కట్టడాన్ని అధికారులు కూల్చివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం 2 గంటల్లోనే కూల్చివేతను అధికారులు పూర్తి చేశారు.

YSRCP Office in 200 Crore Worth Place: కార్మికశాఖ స్థలంలో వైసీపీ కార్యాలయం.. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల ఆగ్రహం

శుక్రవారం హైకోర్టులో వాదనలు : గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మిస్తున్న వైఎస్సార్సీపీ కార్యాలయం కూల్చివేత విషయంలో చట్ట నిబంధనలను పాటించాలని సీఆర్‌డీఏకు హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. తమ కార్యాలయం కూల్చివేతకు సీఆర్డీఏ యత్నిస్తోందంటూ వైఎస్సార్సీపీ హైకోర్టులో శుక్రవారం అత్యవసరంగా పిటిషన్‌ వేసింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. తుది ఉత్తర్వులివ్వకుండా కూల్చివేతకు చర్యలు చేపడుతున్నారని అన్నారు. ఈ వ్యాజ్యంపై విచారించిన న్యాయమూర్తి చట్ట నిబంధనల మేరకు నడుచుకోవాలని సీఆర్‌డీఏకు స్పష్టం చేస్తూ వ్యాజ్యాన్ని పరిష్కరించారు.

రాష్ట్రం రెండు కళ్లనూ పొడిచేశారు!- విలువల విధ్వంసానికి ప్రతీకగా ప్రజావేదిక - symbol of destruction

YSRCP Office Demolished in Tadepalli : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం వద్ద జలవనరులశాఖకు చెందిన స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని (YSRCP Office Illegal Construction) సీఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. గత ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా బోటు యార్డులోని జలవనరుల శాఖకు చెందిన 2 ఎకరాల స్థలాన్ని అతి తక్కువ ధరకే లీజుకు కట్టబెట్టారు. ఏటా 2 వేల రూపాయలు చెల్లించేలా జీవో తెచ్చారు. ఈ స్థలంలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మించేందుకు అప్పటి అధికారులు చకచకా అనుమతులు ఇచ్చేశారు. జీ ప్లస్‌ టు లో కార్యాలయం నిర్మించేందుకు వైఎస్సార్సీపీ నేతలు నిర్మాణాలు ప్రారంభించారు.

'నేనింతే - నా తీరింతే - అసెంబ్లీకి రానంతే' - Jagan on Speaker Election Process

5 బుల్డోజర్లతో 2 గంటల్లోనే కార్యాలయం కూల్చివేత : ప్రభుత్వం మారిన నేపథ్యంలో జలవనరులశాఖ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్నారంటూ సీఆర్డీఏ అధికారులు 4 రోజుల క్రితం వైఎస్సార్సీపీకు నోటీసులు జారీ చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా చట్ట నిబంధనల మేరకు నడుచుకోవాలని సీఆర్డీఏకు కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఉదయం 5 బుల్డోజర్లతో వైఎస్సార్సీపీ నిర్మిస్తున్న అక్రమ కట్టడాన్ని అధికారులు కూల్చివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం 2 గంటల్లోనే కూల్చివేతను అధికారులు పూర్తి చేశారు.

YSRCP Office in 200 Crore Worth Place: కార్మికశాఖ స్థలంలో వైసీపీ కార్యాలయం.. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల ఆగ్రహం

శుక్రవారం హైకోర్టులో వాదనలు : గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మిస్తున్న వైఎస్సార్సీపీ కార్యాలయం కూల్చివేత విషయంలో చట్ట నిబంధనలను పాటించాలని సీఆర్‌డీఏకు హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. తమ కార్యాలయం కూల్చివేతకు సీఆర్డీఏ యత్నిస్తోందంటూ వైఎస్సార్సీపీ హైకోర్టులో శుక్రవారం అత్యవసరంగా పిటిషన్‌ వేసింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. తుది ఉత్తర్వులివ్వకుండా కూల్చివేతకు చర్యలు చేపడుతున్నారని అన్నారు. ఈ వ్యాజ్యంపై విచారించిన న్యాయమూర్తి చట్ట నిబంధనల మేరకు నడుచుకోవాలని సీఆర్‌డీఏకు స్పష్టం చేస్తూ వ్యాజ్యాన్ని పరిష్కరించారు.

రాష్ట్రం రెండు కళ్లనూ పొడిచేశారు!- విలువల విధ్వంసానికి ప్రతీకగా ప్రజావేదిక - symbol of destruction

Last Updated : Jun 22, 2024, 9:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.