ETV Bharat / state

విజయనగర వాసుల మొగ్గు ఎవరి వైపు? - Vizianagaram political review

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 27, 2024, 8:16 PM IST

Vizianagaram political review : సాంస్కృతిక, సాహిత్య, కళా రంగాలకు వేదికగా బాసిల్లిన విజయనగరం ఈ సారి ఎవరి వైపు మొగ్గు చూపుతుందనది ఆసక్తిగా మారింది. సార్వత్రిక ఎన్నికల వేళ విజయనగరం పార్లమెంట్‌ స్థానంలో ప్రముఖ పార్టీల నుంచి బరిలో నిలుస్తున్న అభ్యర్థులు వారి ప్రచారాల తీరు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు స్థానికంగా చర్ఛనీయాంశంగా మారింది.

political_review
political_review

Vizianagaram political review : విజయనగరం పార్లమెంట్ పరిధిలో విజయనగరం, నెల్లిమర్ల, గజపతినగరం, బొబ్బిలి, రాజాం, చీపురుపల్లి, ఎచ్చెర్ల నియోజకవర్గాలున్నాయి. జిల్లాలో ఓటర్ల సంఖ్య 13 లక్షల 57 వేల 492. పురుష ఓటర్లు 7 లక్షల 50 వేల 120మంది కాగా మహిళా ఓటర్లు 7 లక్షల 58 వేల 388 మంది. ట్రాన్స్ జెండర్స్ 59 మంది. మొత్తం ఓటర్లలో యువతే అధికం.

ఎన్డీఏ కూటమి తరఫున కలిశెట్టి అప్పలనాయుడు ఎంపీ బరిలో నిలిచారు. శ్రీకాకుళం జిల్లా వరహనరసింహపురానికి చెందిన ఈయన తెలుగుదేశంలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ప్రజాదరణ పొందారు. వైఎస్సార్సీపీ నుంచి బెల్లాన చంద్రశేఖర్ తలపడుతున్నారు. 2019లో వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్ధి అశోక్ గజపతిరాజుపై బెల్లాన విజయం సాధించారు. వైఎస్సార్సీపీ అధిష్ఠానం మరోసారి ఈయనకే ఎంపీ టిక్కెట్ కట్టబెట్టింది. కాంగ్రెస్ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీను అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

తిరుపతి లోక్​సభ స్థానంపై కన్నేసిన బీజేపీ- వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఎవరికో! - Tirupati LOK SABHA ELECTIONS


Vizianagaram Constituency : విజయనగరం పార్లమెంటు పరిధిలో జిల్లా కేంద్రం విజయనగరం ఎంతో కీలకం. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరఫున కేంద్ర మాజీమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి విజయలక్ష్మి గజపతిరాజు బరిలో నిలిచారు. 2019లో ఓటమి పాలైనా, తాజా ఎన్నికల్లో మరోసారి గత ప్రత్యర్థి కోలగట్ల వీరభద్రస్వామితోనే తలపడుతున్నారు. కోలగట్లకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. 2019లో వైఎస్సార్సీపీ తరఫున గెలిచి ఉప సభాపతిగా కొనసాగుతున్నారు. విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్ధిగా కాంగ్రెస్ తరపున సుంకర సతీష్ పోటీలో ఉన్నారు.

Bobbili Constituency : బొబ్బిలి నియోజకవర్గ కూటమి అభ్యర్ధి బేబినాయనది వెలమ సామాజిక వర్గం. 2014 లో వైఎస్సార్సీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి., అశోక్ గజపతిరాజు చేతిలో ఓటమి పాలయ్యారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2016లో తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. ప్రస్తుతం కూటమి తరఫున బరిలోకి దిగారు. వైఎస్సార్సీపీ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మళ్లీ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున మరిపి వినయ్ కుమార్ తలపడుతున్నారు.

చిరుధాన్యాల కోట అనంతపురం - రసవత్తరంగా రాజకీయం - Anantapur LOK SABHA ELECTIONS

Gajapatinagar Constituency : గజపతినగరం నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్ బరిలో నిలిచారు. దివంగత ఎంపీ కొండపల్లి పైడితల్లి నాయుడు మనువడు. ఆ కుటుంబం నుంచి మూడో తరం నేతగా శ్రీనివాస్ రాజకీయ అరగ్రేటం చేశారు. ఈ స్థానానికి వైఎస్సార్సీపీ సిటింగ్ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య బరిలోకి దిగారు. నాలుగోసారి ఈ స్థానం నుంచే టికెట్ దక్కించుకున్నారు. ఏపీసీసీ శిక్షణ సెల్ డైరెక్టర్ గా పని చేసిన డోలా శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు.


Rajam Constituency : రాజాం నియోజకవర్గ కూటమి అభ్యర్ధి కోండ్రు మురళీమోహన్. 2014, 2019లో ఇదే స్థానం నుంచి తెలుగుదేశం తరఫున పోటీ చేసి, వైఎస్సార్సీపీ అభ్యర్ధి కంబాల జోగుల చేతిలో ఓటమి పాలయ్యారు. రాజాం నుంచే మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్ధిగా బరిలో నిలిచారు. మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య కుమారుడు డాక్టర్ తలే రాజేష్ కు వైఎస్సార్సీపీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ తరఫున కంబాల రాజవర్థన్ పోటీలో ఉన్నారు. ఈయన 2019 నుంచి పార్టీలో అనేక పదవులు నిర్వహించారు.

సాంస్కృతిక రాజధాని రాజమండ్రి - కాంగ్రెస్​ కంచుకోటకు టీడీపీ బీటలు - Rajahmundry LOK SABHA ELECTIONS

Nellimarla Constituency : నెల్లిమర్ల నియోజకవర్గ కూటమి అభ్యర్ధిగా జనసేనకు చెందిన లోకం నాగ మాధవి బరిలో నిలిచారు. మిరాకిల్ గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్ వీళ్లదే. 2014లో జనసేన తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా వెనక్కి తగ్గకుండా రెండో సారీ ఇదే స్థానం నుంచి బరిలో నిలుస్తున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా సిటింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మరోసారి బరిలోకి దిగారు. కాంగ్రెస్ తరఫున సరగడ రమేష్ కుమార్ తలపడుతున్నారు.

Chipurupally Constituency : చీపురుపల్లి నియోజకవర్గం ఎంతో ముఖ్యమైనది. చీపురుపల్లి నుంచి కూటమి అభ్యర్ధిగా కిమిడి కళా వెంకటరావు బరిలో నిలిచారు. ఈయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పురపాలకశాఖ, హోమంత్రిగానూ సేవలందించారు. ఈయనకు పోటీగా బొత్స సత్యనారాయణ బరిలో ఉన్నారు. వైఎస్​ఆర్​, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గాల్లో, 2019 నుంచి జగన్ మోహన్ రెడ్డి కేబినేట్ లో మంత్రిగా పనిచేశారు. పీసీసీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న జమ్ము ఆదినారాయణ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు.

'రాజు'లు ఏలిన నరసాపురం - ఆసక్తికరంగా రాజకీయ సమరం - Narasapuram LOK SABHA ELECTIONS

Etcherla Constituency : ఎచ్చెర్ల నియోజకవర్గం కూటమి అభ్యర్ధిగా, బీజేపీకి చెందిన నడికుడి ఈశ్వరరావు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గతంలో కొంతకాలం తెలుగుదేశంలో ఉన్నారు. అనంతరం బీజేపీలో చేరారు. సిటింగ్ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్‌కు వైఎస్సార్సీపీ అధిష్ఠానం మూడోసారి అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ తరపున మల్లేశ్వరరావు బరిలో నిలిచారు.

కూటమి అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. 3 పార్టీల కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ వైఎస్సార్సీపీ అరాచకాలు, అవినీతి అక్రమాలను ఎండగడుతూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తూ ఓటర్ల మద్దతు కూడగడుతున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ వరుస పర్యటనలు పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపుతున్నాయి.

'రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కూటమితోనే సాధ్యం'- గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ప్రచారం - Alliance Leaders

వైఎస్సార్సీపీ హయాంలో ఏ ఒక్క అభివృద్ధీ జరగలేదనేది ప్రజల అభిప్రాయం. ఐదేళ్ల పాటు బెల్లాన ఎంపీగా కొనసాగినా సమస్యలను పరిష్కరించలేదు. చీపురుపల్లి వైఎస్సార్సీపీ అభ్యర్ధి బొత్స సత్యనారాయణ రాజకీయంగా తలపండిన వ్యక్తే అయినప్పటికీ కూటమి అభ్యర్ధి కిమిడి కళా వెంకటరావు సమఉజ్జీగా నిలుస్తున్నారు. బొబ్బిలి, నెల్లిమర్ల , గజపతినగరం వైఎస్సార్సీపీ అభ్యర్ధులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. విజయనగరం వైఎస్సార్సీపీ అభ్యర్ధి కోలగట్ల వీరభద్రస్వామి రూటే సెపరేటు. భూ దందాలతో పాటు రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో ఆరితేరిపోయారు. ఎచ్చెర్ల నియోజకవర్గం అభ్యర్ధి గొర్లె కిరణ్ కుమార్ అక్రమాలతోపాటు హత్యా రాజకీయాల్లోనూ ఆరితేరారు. ఇవన్నీ కలగలిపి వైఎస్సార్సీపీ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది.

విజయనగర వాసుల మొగ్గు ఎవరి వైపు?

Vizianagaram political review : విజయనగరం పార్లమెంట్ పరిధిలో విజయనగరం, నెల్లిమర్ల, గజపతినగరం, బొబ్బిలి, రాజాం, చీపురుపల్లి, ఎచ్చెర్ల నియోజకవర్గాలున్నాయి. జిల్లాలో ఓటర్ల సంఖ్య 13 లక్షల 57 వేల 492. పురుష ఓటర్లు 7 లక్షల 50 వేల 120మంది కాగా మహిళా ఓటర్లు 7 లక్షల 58 వేల 388 మంది. ట్రాన్స్ జెండర్స్ 59 మంది. మొత్తం ఓటర్లలో యువతే అధికం.

ఎన్డీఏ కూటమి తరఫున కలిశెట్టి అప్పలనాయుడు ఎంపీ బరిలో నిలిచారు. శ్రీకాకుళం జిల్లా వరహనరసింహపురానికి చెందిన ఈయన తెలుగుదేశంలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ప్రజాదరణ పొందారు. వైఎస్సార్సీపీ నుంచి బెల్లాన చంద్రశేఖర్ తలపడుతున్నారు. 2019లో వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్ధి అశోక్ గజపతిరాజుపై బెల్లాన విజయం సాధించారు. వైఎస్సార్సీపీ అధిష్ఠానం మరోసారి ఈయనకే ఎంపీ టిక్కెట్ కట్టబెట్టింది. కాంగ్రెస్ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీను అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

తిరుపతి లోక్​సభ స్థానంపై కన్నేసిన బీజేపీ- వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఎవరికో! - Tirupati LOK SABHA ELECTIONS


Vizianagaram Constituency : విజయనగరం పార్లమెంటు పరిధిలో జిల్లా కేంద్రం విజయనగరం ఎంతో కీలకం. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరఫున కేంద్ర మాజీమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి విజయలక్ష్మి గజపతిరాజు బరిలో నిలిచారు. 2019లో ఓటమి పాలైనా, తాజా ఎన్నికల్లో మరోసారి గత ప్రత్యర్థి కోలగట్ల వీరభద్రస్వామితోనే తలపడుతున్నారు. కోలగట్లకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. 2019లో వైఎస్సార్సీపీ తరఫున గెలిచి ఉప సభాపతిగా కొనసాగుతున్నారు. విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్ధిగా కాంగ్రెస్ తరపున సుంకర సతీష్ పోటీలో ఉన్నారు.

Bobbili Constituency : బొబ్బిలి నియోజకవర్గ కూటమి అభ్యర్ధి బేబినాయనది వెలమ సామాజిక వర్గం. 2014 లో వైఎస్సార్సీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి., అశోక్ గజపతిరాజు చేతిలో ఓటమి పాలయ్యారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2016లో తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. ప్రస్తుతం కూటమి తరఫున బరిలోకి దిగారు. వైఎస్సార్సీపీ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మళ్లీ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున మరిపి వినయ్ కుమార్ తలపడుతున్నారు.

చిరుధాన్యాల కోట అనంతపురం - రసవత్తరంగా రాజకీయం - Anantapur LOK SABHA ELECTIONS

Gajapatinagar Constituency : గజపతినగరం నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్ బరిలో నిలిచారు. దివంగత ఎంపీ కొండపల్లి పైడితల్లి నాయుడు మనువడు. ఆ కుటుంబం నుంచి మూడో తరం నేతగా శ్రీనివాస్ రాజకీయ అరగ్రేటం చేశారు. ఈ స్థానానికి వైఎస్సార్సీపీ సిటింగ్ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య బరిలోకి దిగారు. నాలుగోసారి ఈ స్థానం నుంచే టికెట్ దక్కించుకున్నారు. ఏపీసీసీ శిక్షణ సెల్ డైరెక్టర్ గా పని చేసిన డోలా శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు.


Rajam Constituency : రాజాం నియోజకవర్గ కూటమి అభ్యర్ధి కోండ్రు మురళీమోహన్. 2014, 2019లో ఇదే స్థానం నుంచి తెలుగుదేశం తరఫున పోటీ చేసి, వైఎస్సార్సీపీ అభ్యర్ధి కంబాల జోగుల చేతిలో ఓటమి పాలయ్యారు. రాజాం నుంచే మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్ధిగా బరిలో నిలిచారు. మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య కుమారుడు డాక్టర్ తలే రాజేష్ కు వైఎస్సార్సీపీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ తరఫున కంబాల రాజవర్థన్ పోటీలో ఉన్నారు. ఈయన 2019 నుంచి పార్టీలో అనేక పదవులు నిర్వహించారు.

సాంస్కృతిక రాజధాని రాజమండ్రి - కాంగ్రెస్​ కంచుకోటకు టీడీపీ బీటలు - Rajahmundry LOK SABHA ELECTIONS

Nellimarla Constituency : నెల్లిమర్ల నియోజకవర్గ కూటమి అభ్యర్ధిగా జనసేనకు చెందిన లోకం నాగ మాధవి బరిలో నిలిచారు. మిరాకిల్ గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్ వీళ్లదే. 2014లో జనసేన తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా వెనక్కి తగ్గకుండా రెండో సారీ ఇదే స్థానం నుంచి బరిలో నిలుస్తున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా సిటింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మరోసారి బరిలోకి దిగారు. కాంగ్రెస్ తరఫున సరగడ రమేష్ కుమార్ తలపడుతున్నారు.

Chipurupally Constituency : చీపురుపల్లి నియోజకవర్గం ఎంతో ముఖ్యమైనది. చీపురుపల్లి నుంచి కూటమి అభ్యర్ధిగా కిమిడి కళా వెంకటరావు బరిలో నిలిచారు. ఈయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పురపాలకశాఖ, హోమంత్రిగానూ సేవలందించారు. ఈయనకు పోటీగా బొత్స సత్యనారాయణ బరిలో ఉన్నారు. వైఎస్​ఆర్​, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గాల్లో, 2019 నుంచి జగన్ మోహన్ రెడ్డి కేబినేట్ లో మంత్రిగా పనిచేశారు. పీసీసీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న జమ్ము ఆదినారాయణ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు.

'రాజు'లు ఏలిన నరసాపురం - ఆసక్తికరంగా రాజకీయ సమరం - Narasapuram LOK SABHA ELECTIONS

Etcherla Constituency : ఎచ్చెర్ల నియోజకవర్గం కూటమి అభ్యర్ధిగా, బీజేపీకి చెందిన నడికుడి ఈశ్వరరావు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గతంలో కొంతకాలం తెలుగుదేశంలో ఉన్నారు. అనంతరం బీజేపీలో చేరారు. సిటింగ్ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్‌కు వైఎస్సార్సీపీ అధిష్ఠానం మూడోసారి అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ తరపున మల్లేశ్వరరావు బరిలో నిలిచారు.

కూటమి అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. 3 పార్టీల కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ వైఎస్సార్సీపీ అరాచకాలు, అవినీతి అక్రమాలను ఎండగడుతూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తూ ఓటర్ల మద్దతు కూడగడుతున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ వరుస పర్యటనలు పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపుతున్నాయి.

'రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కూటమితోనే సాధ్యం'- గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ప్రచారం - Alliance Leaders

వైఎస్సార్సీపీ హయాంలో ఏ ఒక్క అభివృద్ధీ జరగలేదనేది ప్రజల అభిప్రాయం. ఐదేళ్ల పాటు బెల్లాన ఎంపీగా కొనసాగినా సమస్యలను పరిష్కరించలేదు. చీపురుపల్లి వైఎస్సార్సీపీ అభ్యర్ధి బొత్స సత్యనారాయణ రాజకీయంగా తలపండిన వ్యక్తే అయినప్పటికీ కూటమి అభ్యర్ధి కిమిడి కళా వెంకటరావు సమఉజ్జీగా నిలుస్తున్నారు. బొబ్బిలి, నెల్లిమర్ల , గజపతినగరం వైఎస్సార్సీపీ అభ్యర్ధులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. విజయనగరం వైఎస్సార్సీపీ అభ్యర్ధి కోలగట్ల వీరభద్రస్వామి రూటే సెపరేటు. భూ దందాలతో పాటు రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో ఆరితేరిపోయారు. ఎచ్చెర్ల నియోజకవర్గం అభ్యర్ధి గొర్లె కిరణ్ కుమార్ అక్రమాలతోపాటు హత్యా రాజకీయాల్లోనూ ఆరితేరారు. ఇవన్నీ కలగలిపి వైఎస్సార్సీపీ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది.

విజయనగర వాసుల మొగ్గు ఎవరి వైపు?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.