ETV Bharat / state

'రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నాం - ప్రజాప్రతినిధులు నిత్యం జనహితంగా పని చేయాలి' - Ministers on Sarpanch MPP Tenure

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 5, 2024, 12:15 PM IST

Updated : Jul 5, 2024, 12:20 PM IST

Ministers on Sarpanch and ZP's Tenure in Telangana : రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నామని మంత్రులు స్పష్టం చేశారు. సర్పంచ్‌, ఎంపీపీ, జడ్పీటీసీల కాల గడువు ముగిసినందున క్షేత్రస్థాయి అధికారులు బాధ్యతతో పని చేయాలని సూచించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఏ ప్రజా సమస్యనైనా తమ దృష్టికి తేవాలని అమాత్యులు సూచించారు. పదవీ కాలం ముగిసిన ప్రజాప్రతినిధులు, నిత్యం జనహితంగా పని చేయాలని మంత్రులు ఉద్బోధించారు.

Ministers on Officers Responsibilities in Telangana
Etv BharatMinisters on Sarpanch and ZPs Tenure in Telangana (ETV Bharat)

Ministers on Officers Responsibilities in Telangana : ప్రజలకు అవసరమైన మందులు ఎందుకు అందుబాటులో లేవో సమాధానం చెప్పాలని సంగారెడ్డి జిల్లా వైద్యాధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నిలదీశారు. సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్న వేళ ముందస్తుగా ఔషధాలు ఎందుకు సమకూర్చుకోలేదో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా జిల్లా పరిషత్‌ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దామోదర వద్ద నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మందుల కొరత అంశాన్ని లేవనెత్తారు. దీనిపై స్పందించిన రాజనర్సింహ జిల్లా వైద్య విధానానికి సంబంధించిన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రజారోగ్యమే ముఖ్యమని, అందుబాటులో లేని మందులను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు.

'ప్రజలకు అవసరమైన మందులు ఎందుకు అందుబాటులో లేవు. ఎందుకు జ్యాపం జరిగింది? ఎందుకు కొరత వచ్చింది? అన్ని వ్యాధులకు సరైన మందులు అందుబాటులో ఉండాలి' - రాజనర్సింహ, ఆరోగ్య శాఖ మంత్రి

మిషన్ భగీరథ పనుల కోసం రూ.200 కోట్ల నిధులు : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి స్పష్టం చేశారు. యాదగిరిగుట్ట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి హాజరయ్యారు. ఐదేళ్లుగా ప్రజలకు స్థానిక ప్రజాప్రతినిధులు అద్భుతుంగా పని చేశారని వారి సేవల్ని మంత్రి కోమటిరెడ్డి కొనియాడారు. యాదగిరిగుట్ట అభివృద్ధి పనులపై సీఎంను ఆహ్వానించి సమీక్ష చేస్తామని హామీ ఇచ్చారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో మిషన్ భగీరథను పూర్తి చేయడానికి అవసరమైన రూ.200 కోట్ల నిధులను అందిస్తామని భరోసా ఇచ్చారు.

రాజకీయాలకు రిటైర్మెంట్ ఉండదు - నిత్యం ప్రజా సేవలోనే : ప్రజల సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హామీ ఇచ్చారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో మండల ప్రజా పరిషత్ సభ్యులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవుల్లో రాణించాలని పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. రాజకీయాలకు రిటైర్మెంట్ ఉండదని, నిత్యం ప్రజాసేవలోనే ఉండాలని సూచించారు. త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రులు స్పష్టం చేశారు.

'మీరు పడిన కష్టానికి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునేలా అవకాశాలు రావాలి. రాజకీయ జీవితంలో పదవీ విరమణ ఉండదు. పొలిటికల్​ కెరియర్​లో నిత్యం ప్రజా సేవలోనే ఉండాలి. ప్రజా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి' - పొన్నం ప్రభాకర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి

కష్టపడిన వారందరికీ రాజకీయంగా మళ్లీ అవకాశాలు వస్తాయి : మంత్రి పొన్నం - Minister Ponnam Prabhakar Comments

Ministers on Officers Responsibilities in Telangana : ప్రజలకు అవసరమైన మందులు ఎందుకు అందుబాటులో లేవో సమాధానం చెప్పాలని సంగారెడ్డి జిల్లా వైద్యాధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నిలదీశారు. సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్న వేళ ముందస్తుగా ఔషధాలు ఎందుకు సమకూర్చుకోలేదో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా జిల్లా పరిషత్‌ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దామోదర వద్ద నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మందుల కొరత అంశాన్ని లేవనెత్తారు. దీనిపై స్పందించిన రాజనర్సింహ జిల్లా వైద్య విధానానికి సంబంధించిన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రజారోగ్యమే ముఖ్యమని, అందుబాటులో లేని మందులను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు.

'ప్రజలకు అవసరమైన మందులు ఎందుకు అందుబాటులో లేవు. ఎందుకు జ్యాపం జరిగింది? ఎందుకు కొరత వచ్చింది? అన్ని వ్యాధులకు సరైన మందులు అందుబాటులో ఉండాలి' - రాజనర్సింహ, ఆరోగ్య శాఖ మంత్రి

మిషన్ భగీరథ పనుల కోసం రూ.200 కోట్ల నిధులు : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి స్పష్టం చేశారు. యాదగిరిగుట్ట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి హాజరయ్యారు. ఐదేళ్లుగా ప్రజలకు స్థానిక ప్రజాప్రతినిధులు అద్భుతుంగా పని చేశారని వారి సేవల్ని మంత్రి కోమటిరెడ్డి కొనియాడారు. యాదగిరిగుట్ట అభివృద్ధి పనులపై సీఎంను ఆహ్వానించి సమీక్ష చేస్తామని హామీ ఇచ్చారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో మిషన్ భగీరథను పూర్తి చేయడానికి అవసరమైన రూ.200 కోట్ల నిధులను అందిస్తామని భరోసా ఇచ్చారు.

రాజకీయాలకు రిటైర్మెంట్ ఉండదు - నిత్యం ప్రజా సేవలోనే : ప్రజల సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హామీ ఇచ్చారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో మండల ప్రజా పరిషత్ సభ్యులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవుల్లో రాణించాలని పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. రాజకీయాలకు రిటైర్మెంట్ ఉండదని, నిత్యం ప్రజాసేవలోనే ఉండాలని సూచించారు. త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రులు స్పష్టం చేశారు.

'మీరు పడిన కష్టానికి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునేలా అవకాశాలు రావాలి. రాజకీయ జీవితంలో పదవీ విరమణ ఉండదు. పొలిటికల్​ కెరియర్​లో నిత్యం ప్రజా సేవలోనే ఉండాలి. ప్రజా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి' - పొన్నం ప్రభాకర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి

కష్టపడిన వారందరికీ రాజకీయంగా మళ్లీ అవకాశాలు వస్తాయి : మంత్రి పొన్నం - Minister Ponnam Prabhakar Comments

Last Updated : Jul 5, 2024, 12:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.