ETV Bharat / state

చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణపతకాలు - రూ.25 లక్షల నజరానా ప్రకటించిన సీఎం రేవంత్ - Chess Olympiad Winners Met CM

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

Telangana Government Nazrana chess Olympiads Winner : భారతదేశం తరపున తొలిసారి స్వర్ణపతకాలు సాధించిన క్రీడాకారులు అర్జున్, ద్రోణవల్లి హారిక జూబ్లీహిల్స్​లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అర్జున్, హారికను అభినందించిన సీఎం రూ. 25 లక్షల రూపాయల చొప్పున ప్రోత్సాహకాలను ప్రకటించారు.

Chess Olympiads Winner Met CM Revanth Reddy
Telangana Government NaJarana chess Olympiads Winner (ETV Bharat)

Chess Olympiads Winner Met CM Revanth Reddy : చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణపతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.25 లక్షల చొప్పున పోత్సాహకాలను ప్రకటించారు. భారతదేశం తరపున తొలిసారి స్వర్ణపతకాలు సాధించిన క్రీడాకారులు అర్జున్, ద్రోణవల్లి హారిక జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని అభినందించిన సీఎం రూ.25 లక్షల చొప్పున నజరానా ప్రకటించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి తదితరులు చదరంగ విజేతలను అభినందించారు.

Chess Olympiad 2024 : హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో ప్రతిష్ఠాత్మక 45వ చెస్‌ ఒలింపియాడ్‌ జరిగిన సంగతి తెలిసిందే. టైటిల్​ కోసం 190కి పైగా దేశాలు పోటీ బరిలోకి దిగాయి. దేశ విదేశాల తరపున ప్రపంచ అగ్రశ్రేణి ప్లేయర్లు తలపడ్డారు. అయితే ఈ చెస్‌ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు తొలిసారి స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించాయి.

భారత్ గతంలో 2014, 2022 రెండు ఎడిషన్​ చెస్ ఒలింపియాడ్​లోనూ కాంస్యం నెగ్గింది. కరోనా కారణంగా 2020, 2021లో పోటీలను వర్చువల్‌గా నిర్వహించారు. 2020లో రష్యాతో కలిసి సంయుక్తంగా భారత్‌ స్వర్ణం గెలిచింది. ఇక 2021 పోటీల్లో భారత్ కాంస్యం సాధించింది. అయితే వర్చువల్‌గా జరిగిన టోర్నీల ఫలితాలను అధికారికంగా రికార్డుల్లో చేర్చలేదు. ఈసారి స్వర్ణం గెలవడం వల్ల భారత్​కు అధికారికంగా ఇదే తొలి గోల్డ్ అయ్యింది.

భారత పురుషుల జట్టు : హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగిన 45వ ఫిడే (FIDE) పోటీల్లో భారత పురుషుల జట్టు స్వర్ణం దక్కించుకుంది. పురుషుల జట్టు స్లొవేనియాతో జరిగిన 11వ రౌండ్‌లో డి. గుకేశ్‌, అర్జున్ ఇరిగేశీ, ప్రజ్ఞానంద తమ తమ గేమ్‌లను గెలుపొందారు. వ్లాదిమిర్ ఫెదోసీవ్‌ను గుకేశ్‌ ఓడించగా, జాన్ సుబెల్జ్‌పై ఇరిగేశీ, అంటన్ డెమ్చెంకోపై ప్రజ్ఞానంద విజయం సాధించారు.

భారత మహిళల జట్టు : మరోవైపు ఈ పోటీల్లో భారత మహిళల జట్టు కూడా తొలిసారి స్వర్ణంతో రికార్డు సృష్టించింది. 11వ రౌండ్‌లో 3.5-0.5 తో అజర్‌బైజాన్‌పై విజయం సాధించింది. డి. హారిక - దివ్య దేశ్‌ముఖ్‌ తమ తమ గేమ్‌లలో విజయం సాధించగా, ఆర్‌. వైశాలి గేమ్​ను డ్రాగా ముగించింది. అనంతరం వంతిక అగర్వాల్‌ మరో అద్భుతమైన విజయాన్ని సాధించడం వల్ల మహిళల జట్టు విజయం ఖరారు చేసుకుంది. దీంతో భారత్‌ ఖాతాలో ఒకేసారి రెండు స్వర్ణాలు చేరాయి.

'చెస్​లో AI ప్రభావమెంత? మీ బర్త్ డే శనివారం కదా?'- ఛాంపియన్లతో మోదీ ఇంటరాక్షన్ - Modi Meet Chess Champions

చెస్ ఒలింపియాడ్​ గోల్డ్ మెడలిస్ట్​లకు ఘన స్వాగతం - ప్రజ్ఞానంద ఏమంటున్నాడంటే? - Chess Olympiad 2024

Chess Olympiads Winner Met CM Revanth Reddy : చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణపతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.25 లక్షల చొప్పున పోత్సాహకాలను ప్రకటించారు. భారతదేశం తరపున తొలిసారి స్వర్ణపతకాలు సాధించిన క్రీడాకారులు అర్జున్, ద్రోణవల్లి హారిక జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని అభినందించిన సీఎం రూ.25 లక్షల చొప్పున నజరానా ప్రకటించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి తదితరులు చదరంగ విజేతలను అభినందించారు.

Chess Olympiad 2024 : హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో ప్రతిష్ఠాత్మక 45వ చెస్‌ ఒలింపియాడ్‌ జరిగిన సంగతి తెలిసిందే. టైటిల్​ కోసం 190కి పైగా దేశాలు పోటీ బరిలోకి దిగాయి. దేశ విదేశాల తరపున ప్రపంచ అగ్రశ్రేణి ప్లేయర్లు తలపడ్డారు. అయితే ఈ చెస్‌ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు తొలిసారి స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించాయి.

భారత్ గతంలో 2014, 2022 రెండు ఎడిషన్​ చెస్ ఒలింపియాడ్​లోనూ కాంస్యం నెగ్గింది. కరోనా కారణంగా 2020, 2021లో పోటీలను వర్చువల్‌గా నిర్వహించారు. 2020లో రష్యాతో కలిసి సంయుక్తంగా భారత్‌ స్వర్ణం గెలిచింది. ఇక 2021 పోటీల్లో భారత్ కాంస్యం సాధించింది. అయితే వర్చువల్‌గా జరిగిన టోర్నీల ఫలితాలను అధికారికంగా రికార్డుల్లో చేర్చలేదు. ఈసారి స్వర్ణం గెలవడం వల్ల భారత్​కు అధికారికంగా ఇదే తొలి గోల్డ్ అయ్యింది.

భారత పురుషుల జట్టు : హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగిన 45వ ఫిడే (FIDE) పోటీల్లో భారత పురుషుల జట్టు స్వర్ణం దక్కించుకుంది. పురుషుల జట్టు స్లొవేనియాతో జరిగిన 11వ రౌండ్‌లో డి. గుకేశ్‌, అర్జున్ ఇరిగేశీ, ప్రజ్ఞానంద తమ తమ గేమ్‌లను గెలుపొందారు. వ్లాదిమిర్ ఫెదోసీవ్‌ను గుకేశ్‌ ఓడించగా, జాన్ సుబెల్జ్‌పై ఇరిగేశీ, అంటన్ డెమ్చెంకోపై ప్రజ్ఞానంద విజయం సాధించారు.

భారత మహిళల జట్టు : మరోవైపు ఈ పోటీల్లో భారత మహిళల జట్టు కూడా తొలిసారి స్వర్ణంతో రికార్డు సృష్టించింది. 11వ రౌండ్‌లో 3.5-0.5 తో అజర్‌బైజాన్‌పై విజయం సాధించింది. డి. హారిక - దివ్య దేశ్‌ముఖ్‌ తమ తమ గేమ్‌లలో విజయం సాధించగా, ఆర్‌. వైశాలి గేమ్​ను డ్రాగా ముగించింది. అనంతరం వంతిక అగర్వాల్‌ మరో అద్భుతమైన విజయాన్ని సాధించడం వల్ల మహిళల జట్టు విజయం ఖరారు చేసుకుంది. దీంతో భారత్‌ ఖాతాలో ఒకేసారి రెండు స్వర్ణాలు చేరాయి.

'చెస్​లో AI ప్రభావమెంత? మీ బర్త్ డే శనివారం కదా?'- ఛాంపియన్లతో మోదీ ఇంటరాక్షన్ - Modi Meet Chess Champions

చెస్ ఒలింపియాడ్​ గోల్డ్ మెడలిస్ట్​లకు ఘన స్వాగతం - ప్రజ్ఞానంద ఏమంటున్నాడంటే? - Chess Olympiad 2024

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.