ETV Bharat / state

జగన్ అక్రమాస్తుల కేసు- ఆగస్టు రెండో వారానికి వాయిదా వేసిన సుప్రీం - SC ON Jagan Illegal Assets Case

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 10, 2024, 7:21 PM IST

Supreme Court on Jagan Illegal Assets Case: జగన్ అక్రమాస్తుల కేసులపై ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసు 5, 10 నిమిషాల్లో విని నిర్ణయం తీసుకునేది కాదన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఆగస్టు రెండో వారానికి వాయిదా వేసింది.

Supreme_Court_on_Jagan_Illegal_Assets_Case
Supreme_Court_on_Jagan_Illegal_Assets_Case (ETV Bharat)

Supreme Court on Jagan Illegal Assets Case: జగన్ అక్రమాస్తుల కేసులను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు రెండో వారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై విచారణను ఆగస్టు ఐదున మొదలయ్యే వారంలో చేపడతామని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం తెలిపింది.

జగన్‌ అక్రమాస్తుల కేసు బదిలీ చేయాలని రఘురామ పిటిషన్‌ - సాక్షులకు ఇబ్బందని సుప్రీంలో సీబీఐ అఫిడవిట్‌ - AP CM Jagan Illegal Assets Case

రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై విచారణలో సీబీఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసినట్లు పిటిషనర్‌ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. డిశ్చార్జ్ పిటిషన్లపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని, ఆ మేరకు సీబీఐ కోర్టు కొత్త జడ్జికి తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు. ఈ దశలో స్పందించిన కోర్టు ఈ కేసులో చాలా అంశాలు ఉన్నాయని ఐదు, పది నిమిషాల్లో నిర్ణయం తీసుకునేది కాదని వ్యాఖ్యానిస్తూ ఆగస్టుకు వాయిదా వేసింది. డిశ్చార్జి పిటిషన్లపై ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినందున వాటిని ట్రయల్‌కోర్టు జడ్జి దృష్టికి తీసుకువెళ్లాలని సూచించింది.

జగన్ అక్రమాస్తుల కేసు- న్యాయమూర్తి బదిలీ! మళ్లీ మొదటికొచ్చిన డిశ్చార్జి పిటిషన్ల విచారణ - Jagan Disproportionate Assets Case

Supreme Court on Jagan Illegal Assets Case: జగన్ అక్రమాస్తుల కేసులను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు రెండో వారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై విచారణను ఆగస్టు ఐదున మొదలయ్యే వారంలో చేపడతామని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం తెలిపింది.

జగన్‌ అక్రమాస్తుల కేసు బదిలీ చేయాలని రఘురామ పిటిషన్‌ - సాక్షులకు ఇబ్బందని సుప్రీంలో సీబీఐ అఫిడవిట్‌ - AP CM Jagan Illegal Assets Case

రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై విచారణలో సీబీఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసినట్లు పిటిషనర్‌ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. డిశ్చార్జ్ పిటిషన్లపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని, ఆ మేరకు సీబీఐ కోర్టు కొత్త జడ్జికి తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు. ఈ దశలో స్పందించిన కోర్టు ఈ కేసులో చాలా అంశాలు ఉన్నాయని ఐదు, పది నిమిషాల్లో నిర్ణయం తీసుకునేది కాదని వ్యాఖ్యానిస్తూ ఆగస్టుకు వాయిదా వేసింది. డిశ్చార్జి పిటిషన్లపై ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినందున వాటిని ట్రయల్‌కోర్టు జడ్జి దృష్టికి తీసుకువెళ్లాలని సూచించింది.

జగన్ అక్రమాస్తుల కేసు- న్యాయమూర్తి బదిలీ! మళ్లీ మొదటికొచ్చిన డిశ్చార్జి పిటిషన్ల విచారణ - Jagan Disproportionate Assets Case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.