ETV Bharat / state

దేవినేని అవినాష్‌కు చుక్కెదురు - దుబాయ్ వెళ్లకుండా శంషాబాద్​లో అడ్డగింత - Police Stop to Devineni Avinash

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 16, 2024, 12:19 PM IST

Updated : Aug 16, 2024, 1:02 PM IST

Airport Authorities Stop to Devineni Avinash: వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో చుక్కెదురైంది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు యత్నించగా మంగళగిరి పోలీసులకు ఎయిర్​పోర్టు అధికారులు సమాచారమిచ్చారు. అవినాష్‌పై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయన ఎయిర్​పోర్టు నుంచి వెనుదిరిగారు.

Airport Authorities Stop to Devineni Avinash
Airport Authorities Stop to Devineni Avinash (ETV Bharat)

Airport Police Stop to YSRCP Leader Devineni Avinash: విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్‌కు చుక్కెదురైంది. గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ఆయన యత్నించగా మంగళగిరి పోలీసులకు శంషాబాద్ విమానాశ్రయం అధికారులు సమాచారమిచ్చారు. అవినాష్‌పై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని మంగళగిరి పోలీసులు వారికి తేల్చి చెప్పారు. దీంతో అధికారులు అవినాష్‌కు అడ్డు చెప్పడంతో శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఆయన వెనక్కి వెళ్లిపోయారు. టీడీపీ కార్యాలయ దాడిలో పాల్గొన్న వారిపై లుకౌట్‌ నోటీసులు జారీ చేస్తూ విమానాశ్రయాలకు సమాచారం ఇచ్చారు.

కేసు నుంచి తప్పించుకునేందుకు యత్నం: గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్​లో దేవినేని అవినాష్ సహా పలువురు వైఎస్సార్సీపీ నేతల పేర్లు ఉన్నాయి. దాడి కేసులోని వైఎస్సార్సీపీ నేతలు విదేశాలకు వెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ కేసులో అవినాష్​ను ముందస్తు అరెస్టు చేయకుండా ఉండేందుకు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించిన వాదనలు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో దుబాయ్​కి పారి పోయేందుకు ఆయన యత్నించారు.

'దాడిని ఏ విధంగా చూడాలో మీరే చెప్పండి' - వైఎస్సార్సీపీ నేతలను ప్రశ్నించిన హైకోర్టు - Mangalagiri TDP Office Attack Case

దీంతో శంషాబాద్ ఎయిర్​పోర్టుకు చేరుకున్న అవినాష్​ను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. వెంటనే విమానాశ్రయ అధికారులు మంగళగిరి గ్రామీణ పోలీసులకు సమాచారం అందించారు. దేవినేని అవినాష్​పై ఎఫ్ఐఆర్ ఉందని అతనిని అడ్డుకోవాలని మంగళగిరి పోలీసులు విమానాశ్రయ అధికారులకు చెప్పడంతో దుబాయ్ వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇంక చేసేదేమీ లేక అవినాష్​ అక్కడి నుంచి వెను తిరిగారు. ఈ దాడిలో అవినాష్‌తోపాటు పలువురు కీలక పాత్ర పోషించారని సీనియర్‌ బుధవారం హైకోర్టులో న్యాయవాది సిద్ధార్థ లూథ్రా అన్నారు.

ఎవరి ప్రోద్భలంతో టీడీపీ కార్యాలయంపై దాడి చేశారనే విషయాన్ని తేల్చాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఈ కేసులో 117 మందిని నిందితులుగా చేర్చామన్నారు. ఈ దాడి ఘటన కేసులో దర్యాప్తును ఉద్దేశపూర్వంగా నీరుగార్చిన ముగ్గురు అధికారులను సస్పెండ్‌ చేశామన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందస్తు బెయిలు పిటిషన్లను కొట్టేయాలని కోరారు. పోలీసుల తరఫు వాదనలు ముగియడంతో పిటిషనర్ల తరఫున కొందరు న్యాయవాదులు ప్రతి వాదనలు వినిపించడం కోసం విచారణ ఈనెల 21కి వాయిదా వేశారు.

వారికి ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దు - వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టి దాడికి ఉసిగొల్పారు: లూథ్రా - MANGALAGIRI TDP OFFICE ATTACK CASE

Airport Police Stop to YSRCP Leader Devineni Avinash: విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్‌కు చుక్కెదురైంది. గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ఆయన యత్నించగా మంగళగిరి పోలీసులకు శంషాబాద్ విమానాశ్రయం అధికారులు సమాచారమిచ్చారు. అవినాష్‌పై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని మంగళగిరి పోలీసులు వారికి తేల్చి చెప్పారు. దీంతో అధికారులు అవినాష్‌కు అడ్డు చెప్పడంతో శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఆయన వెనక్కి వెళ్లిపోయారు. టీడీపీ కార్యాలయ దాడిలో పాల్గొన్న వారిపై లుకౌట్‌ నోటీసులు జారీ చేస్తూ విమానాశ్రయాలకు సమాచారం ఇచ్చారు.

కేసు నుంచి తప్పించుకునేందుకు యత్నం: గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్​లో దేవినేని అవినాష్ సహా పలువురు వైఎస్సార్సీపీ నేతల పేర్లు ఉన్నాయి. దాడి కేసులోని వైఎస్సార్సీపీ నేతలు విదేశాలకు వెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ కేసులో అవినాష్​ను ముందస్తు అరెస్టు చేయకుండా ఉండేందుకు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించిన వాదనలు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో దుబాయ్​కి పారి పోయేందుకు ఆయన యత్నించారు.

'దాడిని ఏ విధంగా చూడాలో మీరే చెప్పండి' - వైఎస్సార్సీపీ నేతలను ప్రశ్నించిన హైకోర్టు - Mangalagiri TDP Office Attack Case

దీంతో శంషాబాద్ ఎయిర్​పోర్టుకు చేరుకున్న అవినాష్​ను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. వెంటనే విమానాశ్రయ అధికారులు మంగళగిరి గ్రామీణ పోలీసులకు సమాచారం అందించారు. దేవినేని అవినాష్​పై ఎఫ్ఐఆర్ ఉందని అతనిని అడ్డుకోవాలని మంగళగిరి పోలీసులు విమానాశ్రయ అధికారులకు చెప్పడంతో దుబాయ్ వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇంక చేసేదేమీ లేక అవినాష్​ అక్కడి నుంచి వెను తిరిగారు. ఈ దాడిలో అవినాష్‌తోపాటు పలువురు కీలక పాత్ర పోషించారని సీనియర్‌ బుధవారం హైకోర్టులో న్యాయవాది సిద్ధార్థ లూథ్రా అన్నారు.

ఎవరి ప్రోద్భలంతో టీడీపీ కార్యాలయంపై దాడి చేశారనే విషయాన్ని తేల్చాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఈ కేసులో 117 మందిని నిందితులుగా చేర్చామన్నారు. ఈ దాడి ఘటన కేసులో దర్యాప్తును ఉద్దేశపూర్వంగా నీరుగార్చిన ముగ్గురు అధికారులను సస్పెండ్‌ చేశామన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందస్తు బెయిలు పిటిషన్లను కొట్టేయాలని కోరారు. పోలీసుల తరఫు వాదనలు ముగియడంతో పిటిషనర్ల తరఫున కొందరు న్యాయవాదులు ప్రతి వాదనలు వినిపించడం కోసం విచారణ ఈనెల 21కి వాయిదా వేశారు.

వారికి ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దు - వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టి దాడికి ఉసిగొల్పారు: లూథ్రా - MANGALAGIRI TDP OFFICE ATTACK CASE

Last Updated : Aug 16, 2024, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.