ETV Bharat / state

విజయవాడ సింగ్ నగర్​లో తగ్గుతున్న వరద - సహాయక చర్యలు వేగవంతం - Relief Work in Flood Affected Areas

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 7, 2024, 2:17 PM IST

Relief Works in Vijayawada Flood Affected Areas: విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలో వరద క్రమంగా తగ్గుతోంది. ముంపునకు గురైన ప్రాంతాలు ఇప్పుడిపుడే తేరుకుంటున్నాయి. ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ పనుల్లో వేగం పెంచింది. వరద ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆహారం, పాలు, మంచినీళ్లు వంటివి తమకు అందించిందని ప్రజలు చెబుతున్నారు.

Relief Works in Vijayawada Flood Affected Areas
Relief Works in Vijayawada Flood Affected Areas (ETV Bharat)

Relief Works in Vijayawada Flood Affected Areas : విజయవాడలోని వరద ముంపు ప్రాంతాలు సాధారణస్థితికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వరద నీరు తొలగింది. మరికొన్ని కాలనీలు నీటిలో ఉన్నా పరిస్థితి కొంత మెరుగు పడింది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ పనుల్లో ప్రభుత్వం వేగం పెంచింది. కాలువల్లో పేరుకున్న చెత్తని పారిశుధ్య కార్మికులు తొలగిస్తున్నారు. వరద ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆహారం, పాలు, మంచినీళ్లు వంటివి తమకు అందించిందని ప్రజలు చెబుతున్నారు. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా వైద్యులు తక్షణమే స్పందించి కావాల్సిన మందులు అందించడం పట్ల సింగ్ నగర్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ట్రాక్టర్ల ద్వారా ఆహార పదార్థాలు అందిస్తున్నారు.

ముంపు ప్రాంతాల్లో వెలుగులు : గడిచిన ఆరు రోజులుగా చీకట్లో మగ్గిన కొన్ని ప్రాంతాలకు విద్యుత్ శాఖ కరెంటు పునరుద్ధరించింది. కొద్దిపాటి నీళ్లు మాత్రమే ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించటంతో ముంపు ప్రాంతాల్లో వెలుగులు కనిపిస్తున్నాయి.

చీకట్లను చీల్చుకుంటూ బయట పడుతున్న విజయవాడ - చురుగ్గా సాగుతున్న సహాయక చర్యలు - Relief Work in Flood Affected Areas

సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనపై ఆశలు : విజయవాడలో వరద బీభత్సానికి పెద్ద సంఖ్యలో కార్లు దెబ్బతిన్నాయి. ఇంటి సెల్లార్లోనే కాకుండా రోడ్డుపక్క పార్కు చేసిన కార్లు సైతం వరద ఉద్ధృతికి తలకిందులయ్యాయి. వరదతగ్గడంతో దెబ్బతిన్నకార్లను అతికష్టంమీద షోరూమ్‌లకు తరలించిన యజమానులు వాటికి మరమ్మతు చేయించేందుకు తంటాలు పడుతున్నారు. ఒక్కో కారుకు కనిష్టంగా 70 వేల నుంచి లక్షల రూపాయలకు మించే ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. విజయవాడ శివారు ప్రాంతాల్లోని కార్ల షో రూమ్ 4 రోజులు నీటిలోనే నానిపోయింది. శివారుల్లో టాటా, హుందాయ్ ఇతర కార్ల కంపెనీల గోడౌన్లు, షోరూమ్‌ల్లోకి నీరు చేరింది. వాహనాలకు బీమా కల్పిస్తామంటూ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనపై వారు ఒకింత ఆశలు పెంచుకున్నారు.

ఏపీలో వరద సృష్టించిన బీభత్సం - కర్షకుల కష్టం 'కృష్ణా'ర్పణం - AP FLOODS EFFECT 2024

వందకుపైగా ఫైరింజన్లతో ఇళ్లు, వీధులు శుభ్రం చేసే ప్రక్రియ కొనసాగుతుండగా వీధుల్లో పెరుకుపోయిన వ్యర్థాలను వేగంగా తొలిగిస్తున్నారు. వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ లిక్విడ్‌ని వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా చల్లారు.

కేంద్రం రూ.3,300 కోట్లు సాయం ప్రకటిందన్న ప్రచారం అవాస్తవం - నేడు తొలి నివేదిక పంపుతాం: సీఎం చంద్రబాబు - Change in Vijayawada After Floods

Relief Works in Vijayawada Flood Affected Areas : విజయవాడలోని వరద ముంపు ప్రాంతాలు సాధారణస్థితికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వరద నీరు తొలగింది. మరికొన్ని కాలనీలు నీటిలో ఉన్నా పరిస్థితి కొంత మెరుగు పడింది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ పనుల్లో ప్రభుత్వం వేగం పెంచింది. కాలువల్లో పేరుకున్న చెత్తని పారిశుధ్య కార్మికులు తొలగిస్తున్నారు. వరద ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆహారం, పాలు, మంచినీళ్లు వంటివి తమకు అందించిందని ప్రజలు చెబుతున్నారు. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా వైద్యులు తక్షణమే స్పందించి కావాల్సిన మందులు అందించడం పట్ల సింగ్ నగర్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ట్రాక్టర్ల ద్వారా ఆహార పదార్థాలు అందిస్తున్నారు.

ముంపు ప్రాంతాల్లో వెలుగులు : గడిచిన ఆరు రోజులుగా చీకట్లో మగ్గిన కొన్ని ప్రాంతాలకు విద్యుత్ శాఖ కరెంటు పునరుద్ధరించింది. కొద్దిపాటి నీళ్లు మాత్రమే ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించటంతో ముంపు ప్రాంతాల్లో వెలుగులు కనిపిస్తున్నాయి.

చీకట్లను చీల్చుకుంటూ బయట పడుతున్న విజయవాడ - చురుగ్గా సాగుతున్న సహాయక చర్యలు - Relief Work in Flood Affected Areas

సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనపై ఆశలు : విజయవాడలో వరద బీభత్సానికి పెద్ద సంఖ్యలో కార్లు దెబ్బతిన్నాయి. ఇంటి సెల్లార్లోనే కాకుండా రోడ్డుపక్క పార్కు చేసిన కార్లు సైతం వరద ఉద్ధృతికి తలకిందులయ్యాయి. వరదతగ్గడంతో దెబ్బతిన్నకార్లను అతికష్టంమీద షోరూమ్‌లకు తరలించిన యజమానులు వాటికి మరమ్మతు చేయించేందుకు తంటాలు పడుతున్నారు. ఒక్కో కారుకు కనిష్టంగా 70 వేల నుంచి లక్షల రూపాయలకు మించే ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. విజయవాడ శివారు ప్రాంతాల్లోని కార్ల షో రూమ్ 4 రోజులు నీటిలోనే నానిపోయింది. శివారుల్లో టాటా, హుందాయ్ ఇతర కార్ల కంపెనీల గోడౌన్లు, షోరూమ్‌ల్లోకి నీరు చేరింది. వాహనాలకు బీమా కల్పిస్తామంటూ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనపై వారు ఒకింత ఆశలు పెంచుకున్నారు.

ఏపీలో వరద సృష్టించిన బీభత్సం - కర్షకుల కష్టం 'కృష్ణా'ర్పణం - AP FLOODS EFFECT 2024

వందకుపైగా ఫైరింజన్లతో ఇళ్లు, వీధులు శుభ్రం చేసే ప్రక్రియ కొనసాగుతుండగా వీధుల్లో పెరుకుపోయిన వ్యర్థాలను వేగంగా తొలిగిస్తున్నారు. వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ లిక్విడ్‌ని వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా చల్లారు.

కేంద్రం రూ.3,300 కోట్లు సాయం ప్రకటిందన్న ప్రచారం అవాస్తవం - నేడు తొలి నివేదిక పంపుతాం: సీఎం చంద్రబాబు - Change in Vijayawada After Floods

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.