ETV Bharat / state

భాగ్యనగరంలో మొదలైన రక్షాబంధన్ సందడి - మహిళలతో రాఖీ దుకాణాలు కిటకిట - Raksha Bandhan 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 18, 2024, 8:03 AM IST

Raksha Bandhan 2024 : సోదరీమణులు ఎంతగానో వెయింట్​ చేసే పండగ రక్షాబంధన్​. ఎందుకంటే ఆరోజు తన సోదరులకు రాఖీ కట్టి తమ ప్రేమను వ్యక్తం చేస్తారు. అయితే ఈసారి రాఖీ పండగ మాత్రం చాలా వైభవంగా జరగనుందనే చెప్పాలి. ఎందుకంటే మార్కెట్​లు అన్నీ కిక్కిరిసిపోయాయి. ఎక్కడ చూసిన మహిళలతో కిటకిటలాడుతున్నాయి. ఈసారి మాత్రం వ్యాపారం సూపర్​గా సాగుతోందని దుకాణ యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Rakhi Shops are Crowded is Raksha Bandhan 2024
Rakhi Shops are Crowded is Raksha Bandhan 2024 (ETV Bharat)

Rakhi Shops are Crowded is Raksha Bandhan 2024 : సోదరసోదరీమణుల అనురాగం, అప్యాయతలకు ప్రతీకగా జరుపుకునే రాఖీ పౌర్ణమి సందర్భంగా మార్కెట్లన్నీ రంగు రంగుల భిన్నమైన రాఖీలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. స్థాయికి తగినట్లు రూ.3 నుంచి రూ.3వేల దాకా వివిధ ధరల్లో రాఖీలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. కాలానుగుణంగా, అభిరుచికి తగినట్లు వీటిలోనూ ప్రత్యేకతలు వచ్చేశాయి. తమ ప్రియమైన సోదరుల కోసం రాఖీలు కొనేందుకు మహిళలంతా దుకాణాలకు వరుసకట్టారు. ప్రేమను పంచి బంధాన్ని పెంచుకోవడానికి రక్షా బంధన్ కోసం సిద్ధమవుతున్నారు.

మన ఆచారాలు, సంప్రదాయాల్లో దాదాపు ప్రతీ దాని వెనక ఏదో ఒక పరమార్థం ఉండే ఉంటుంది. అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి పుట్టుకొచ్చినవే ఆచారాలు. సహజంగా పెళ్లైన తర్వాత ఆడపిల్లలు మెట్టినింట్లో తీరిక లేకుండా ఉండిపోతారు. ఎప్పుడో పండగలకు వచ్చిపోతారు. అది కూడా కొందరికి వీలు కాదు. రక్షా బంధన్​కు మాత్రం తమ సోదరులకు రాఖీ కట్టేందుకు వారికి ఆశీర్వచనాలు ఇచ్చి వారిచ్చే చిరు కానుకలు పొందేందుకు ఎంతో ఉత్సాహంగా సుదూర ప్రాంతాల నుంచి తరలి వెళ్తారు. సోదరుల మణికట్టుకు కట్టే రాఖీ ద్వారా తోబుట్టువులతో తమ బంధం పదిలంగా ఉండాలని కోరుకుంటారు.

మొదట రాఖీలు కేవలం కొన్ని నూలు లేదా సిల్కు దారాలతో తయారు చేసేవారు. వాటికి సహజ రంగులద్ది వాటిని సోదరులకు కట్టి, బొట్టు పెట్టి, మిఠాయిలు పంచి ఆశీర్వదించి వారిచ్చే కానుకలు స్వీకరించేవారు. అయితే రానురాను ప్రజల అభిరుచి, ఆలోచనల్లో మార్పులు వచ్చాయి. ప్రతీది అందంగా, అకర్షణీయంగా ఉండాలని కోరుకుంటున్నారు. నారికి తగినట్లే తయారీదారులు కూడా రంగురంగుల రాఖీలకు వన్నెలద్ది, చెమ్కీలతో మెరుపుల మెరుగులు పెట్టి భిన్నంగా చేస్తున్నారు. పండుగకు కొన్ని గంటలే సమయం ఉండటంతో మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.

కిక్కిరిసిన బేగంబజార్​ మార్కెట్ : రాఖీ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు బేగంబజార్​ మార్కెట్​కు ప్రతి ఏటా రాఖీలు కొనుగోలు చేసేందుకు వస్తుంటామని మహిళామణులు చెబుతున్నారు. అలాగే అన్న, తమ్ముళ్లు తమకు రక్షణగా ఉంటారని రాఖీలు కడతామని వారు చెప్పారు. ఎక్కడ చూసిన అన్ని దుకాణాలు మహిళలతో నిండిపోతున్నాయి. గత ఏడాది కంటే రాఖీ దుకాణాలు అధికం అయినప్పటికీ ఈ ఏడాది మాత్రం వ్యాపారం బాగుందని వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పండగ సందర్భంగా రాఖీలతో పాటు, మిఠాయిలు, దుస్తుల కొనుగోళ్లతో వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది.

పండుగ షాపింగ్ చేస్తున్నారా - ఈ మార్కెట్లో తక్కువ ధరకే బెస్ట్ రాఖీలు - Rakhi Festival 2024

రాఖీ శుభ ముహూర్తం అప్పుడే! - ఈ సమయంలో రాఖీ కడితే కష్టాలు - ఈ సమయంలో కడితే విష్ణుమూర్తి అనుగ్రహం! - Rakhi Festival Date and Timings

Rakhi Shops are Crowded is Raksha Bandhan 2024 : సోదరసోదరీమణుల అనురాగం, అప్యాయతలకు ప్రతీకగా జరుపుకునే రాఖీ పౌర్ణమి సందర్భంగా మార్కెట్లన్నీ రంగు రంగుల భిన్నమైన రాఖీలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. స్థాయికి తగినట్లు రూ.3 నుంచి రూ.3వేల దాకా వివిధ ధరల్లో రాఖీలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. కాలానుగుణంగా, అభిరుచికి తగినట్లు వీటిలోనూ ప్రత్యేకతలు వచ్చేశాయి. తమ ప్రియమైన సోదరుల కోసం రాఖీలు కొనేందుకు మహిళలంతా దుకాణాలకు వరుసకట్టారు. ప్రేమను పంచి బంధాన్ని పెంచుకోవడానికి రక్షా బంధన్ కోసం సిద్ధమవుతున్నారు.

మన ఆచారాలు, సంప్రదాయాల్లో దాదాపు ప్రతీ దాని వెనక ఏదో ఒక పరమార్థం ఉండే ఉంటుంది. అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి పుట్టుకొచ్చినవే ఆచారాలు. సహజంగా పెళ్లైన తర్వాత ఆడపిల్లలు మెట్టినింట్లో తీరిక లేకుండా ఉండిపోతారు. ఎప్పుడో పండగలకు వచ్చిపోతారు. అది కూడా కొందరికి వీలు కాదు. రక్షా బంధన్​కు మాత్రం తమ సోదరులకు రాఖీ కట్టేందుకు వారికి ఆశీర్వచనాలు ఇచ్చి వారిచ్చే చిరు కానుకలు పొందేందుకు ఎంతో ఉత్సాహంగా సుదూర ప్రాంతాల నుంచి తరలి వెళ్తారు. సోదరుల మణికట్టుకు కట్టే రాఖీ ద్వారా తోబుట్టువులతో తమ బంధం పదిలంగా ఉండాలని కోరుకుంటారు.

మొదట రాఖీలు కేవలం కొన్ని నూలు లేదా సిల్కు దారాలతో తయారు చేసేవారు. వాటికి సహజ రంగులద్ది వాటిని సోదరులకు కట్టి, బొట్టు పెట్టి, మిఠాయిలు పంచి ఆశీర్వదించి వారిచ్చే కానుకలు స్వీకరించేవారు. అయితే రానురాను ప్రజల అభిరుచి, ఆలోచనల్లో మార్పులు వచ్చాయి. ప్రతీది అందంగా, అకర్షణీయంగా ఉండాలని కోరుకుంటున్నారు. నారికి తగినట్లే తయారీదారులు కూడా రంగురంగుల రాఖీలకు వన్నెలద్ది, చెమ్కీలతో మెరుపుల మెరుగులు పెట్టి భిన్నంగా చేస్తున్నారు. పండుగకు కొన్ని గంటలే సమయం ఉండటంతో మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.

కిక్కిరిసిన బేగంబజార్​ మార్కెట్ : రాఖీ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు బేగంబజార్​ మార్కెట్​కు ప్రతి ఏటా రాఖీలు కొనుగోలు చేసేందుకు వస్తుంటామని మహిళామణులు చెబుతున్నారు. అలాగే అన్న, తమ్ముళ్లు తమకు రక్షణగా ఉంటారని రాఖీలు కడతామని వారు చెప్పారు. ఎక్కడ చూసిన అన్ని దుకాణాలు మహిళలతో నిండిపోతున్నాయి. గత ఏడాది కంటే రాఖీ దుకాణాలు అధికం అయినప్పటికీ ఈ ఏడాది మాత్రం వ్యాపారం బాగుందని వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పండగ సందర్భంగా రాఖీలతో పాటు, మిఠాయిలు, దుస్తుల కొనుగోళ్లతో వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది.

పండుగ షాపింగ్ చేస్తున్నారా - ఈ మార్కెట్లో తక్కువ ధరకే బెస్ట్ రాఖీలు - Rakhi Festival 2024

రాఖీ శుభ ముహూర్తం అప్పుడే! - ఈ సమయంలో రాఖీ కడితే కష్టాలు - ఈ సమయంలో కడితే విష్ణుమూర్తి అనుగ్రహం! - Rakhi Festival Date and Timings

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.