Private Travels Bus Hits Petrol Pump at Nellore District : నెల్లూరు జిల్లా కోవూరు జాతీయ రహదారిపై ఉన్న ఓ పెట్రోల్ బంకులోకి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు మంటలు చెలరేగకపోవడంతో ఘోర ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి బెంగళూరుకు 27 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు రహదారి పక్కనే ఉన్న బంకులోకి దూసుకెళ్లి పెట్రోల్ పంపును ఢీకొట్టింది. ప్రమాదంలో పెట్రోల్ పంపు ధ్వంసమైంది.
ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడం, ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ట్రాలీ ఢీ - 17మందికి తీవ్ర గాయాలు