Pratidhwani Debate on Irrigation Projects in AP: ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ నదుల అనుసంధానాన్ని అటకెక్కించింది. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులనూ నట్టేట ముంచింది. వేలాది టీఎంసీల జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. కరవు రాష్ట్రంలో తాండవిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టనట్లు నదుల అనుసంధాన ప్రక్రియను మూలన పడేసింది. సాగునీటి సమస్యకు, కరువు కష్టాలకు పరిష్కారం ఏంటి? గత ప్రభుత్వం ఏం చేసింది? ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇదే అంశంపై ప్రతిధ్వని కార్యక్రమం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రాష్ట్రంలో ఏటా వేలాది టీఎంసీల నదీజలాలు వృధాగా సముద్రంలోకి పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధపెట్టి వాటిలో కొంత వాడుకున్నా కరవును సమర్థంగా ఎదుర్కోవచ్చు. కర్షకుల కన్నీళ్లు తుడవచ్చు. వలసలు ఆపవచ్చు. సీఎం జగన్కు కానీ, జలవనరుల మంత్రి అంబటి రాంబాబుకు కానీ ఆ రంగంపై కనీస అవగాహన లేకపోవడం రాష్ట్రం చేసుకున్న దురదృష్టం. గత ప్రభుత్వం కేవలం ఐదేళ్లలోనే 70 శాతం పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసింది. జగన్ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో మిగిలిన 30శాతం పూర్తిచేసి ఉంటే ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణగా మారేది. సాగునీటి సమస్యకు, కరువు కష్టాలకు పరిష్కారం ఏంటి? గత ప్రభుత్వం ఏం చేసింది? ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది?