ETV Bharat / state

ప్రకాశం బ్యారేజ్ గేట్ల మరమ్మతులు- ట్రయల్ రన్ సక్సెస్ - Prakasam Barrage Gates Works

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 9, 2024, 9:03 AM IST

Updated : Sep 9, 2024, 4:48 PM IST

Prakasam Barrage Works Updates : ప్రకాశం బ్యారేజ్ గేట్లను పడవలు ఢీకొని దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లను ఇంజినీర్లు విజయవంతంగా అమర్చారు. నిపుణుడు కన్నయ్యనాయుడు ఆధ్వర్యంలో ఇంజినీర్లు రేయింబవళ్లు కష్టపడి కేవలం నాలుగు రోజుల్లోనే మరమ్మతులు పూర్తి చేశారు. ట్రయల్ రన్ చేసి గేట్లు ఆపరేట్ చేశారు.

Prakasam Barrage Gates Works
Prakasam Barrage Gates Works (ETV Bharat)

Gates Repair Works in Prakasam Barrage : ప్రకాశం బ్యారేజ్ గేట్లను పడవలు ఢీకొని దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లను ఇంజినీర్లు విజయవంతంగా అమర్చారు. నిపుణుడు కన్నయ్యనాయుడు ఆధ్వర్యంలో ఇంజినీర్లు రేయింబవళ్లు కష్టపడి కేవలం నాలుగు రోజుల్లోనే మరమ్మతులు పూర్తి చేశారు. కింద నుంచి ఉద్ధృతంగా నీరు ప్రవహిస్తున్నా తాడు, క్లేన్ల సాయంతో సాహసోపేతంగా మరమ్మతులు పూర్తి చేశారు. ట్రయల్ రన్ చేసి గేట్లు ఆపరేట్ చేశారు. ప్రకాశం బ్యారేజ్‌కి ఎలాంటి ముప్పు లేదని రైతులకు ఎలాంటి నష్టం ఉండదని కన్నయ్యనాయుడు ప్రకటించారు. రికార్డు సమయంలోనే బ్యారేజ్ వద్ద మరమ్మతులు చేసినందుకు కన్నయ్యనాయుడుతోపాటు ఇంజినీర్లు, అధికారులను సన్మానించారు. బీజేపీనేత పాతూరి నాగభూషణం సహా కూటమి నేతలు కన్నయ్యనాయుడును శాలువాతో సత్కరించి అభినందించారు. ప్రస్తుతం కౌంటర్‌ వెయిట్లను కాంక్రీట్‌తో నింపే పనిని వేగవంతం చేశారు. ఈరోజుతో గేట్ల మరమ్మతు పనులు పూర్తి కానున్నాయి.

నిరంతరాయంగా శ్రమిస్తూ17 టన్నుల బరువున్న కౌంటర్‌ వెయిట్‌ను 3 భాగాలుగా కత్తిరిస్తున్నారు. అదే సమయంలో ఇప్పటికే 67, 69 గేట్లకు ఏర్పాటుచేసిన కౌంటర్‌ వెయిట్లను కాంక్రీట్‌తో నింపే పనిని వేగవంతం చేశారు. 4.5 టన్నులున్న వాటి బరువును 17 టన్నులకు పెంచే ప్రక్రియ చేపట్టారు. ఇవాళ 3 కౌంటర్‌ వెయిట్లలోనూ కాంక్రీట్‌తో నిర్ణీత బరువు నింపడం సహా యథాతథంగా గేట్లు నిర్వహించేలా చేయనున్నారు.

బ్యారేజీ పటిష్ఠత పెంచేలా మరిన్ని చర్యలు : ఆదివారం సాయంత్రం బ్యారేజీపైకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు గేట్ల మరమ్మతు పనులను పరిశీలించారు. వేగంగా పనులు చేస్తుండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బ్యారేజీ పటిష్ఠత పెంచేలా మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు గేట్ల నిపుణుడు, జలవనరులశాఖ సలహాదారు కన్నయ్యనాయుడుని సీఎం ఆదేశించారు.

"ప్రకాశం బ్యారేజ్‌కి ఎలాంటి ముప్పు లేదు. ఇక రైతులకు ఎలాంటి నష్టం ఉండదు. కౌంటర్ వెయిట్లను అమర్చిన తరువాత ట్రయల్ రన్ చేసి గేట్లు ఆపరేట్ చేశాం. ప్రస్తుతం గేట్లు దెబ్బతినకుండా పడవలను తీయాలని చూస్తున్నాం. పనులు చురుగ్గా సాగుతున్నాయి. కొత్తగా తెచ్చిన 3 కౌంటర్‌ వెయిట్లలోనూ కాంక్రీట్‌తో నిర్ణీత బరువు నింపడం సహా యథాతథంగా గేట్లు నిర్వహించేలా పనులు చేస్తున్నాం." - కన్నయ్యనాయుడు, జలవనరులశాఖ సలహాదారు

Prakasam Barrage Boat Incident Updates : ప్రకాశం బ్యారేజీకి వరద మళ్లీ పెరుగుతోంది. 4 లక్షల క్యూసెక్కులకుపైగా నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం లక్ష క్యూసెక్కులకు తగ్గాక 67, 68, 69 గేట్లు మూసేసి అక్కడ చిక్కుకున్న భారీ పడవలను తొలగించే పనులు ప్రారంభిస్తారు. పడవలను తొలగిస్తే ఆపరేషన్‌ విజయవంతమైనట్లే.

యుద్ధప్రాతిపదికన ప్రకాశం బ్యారేజ్​ గేట్ల పనులు- రికార్డు టైమ్‌లో కౌంటర్ వెయిట్ల బిగింపు - PRAKASAM BARRAGE GATES WORKS

'ఆ రోజు రాత్రి ఏం జరిగింది?, ఆ పడవలు ఎవరివి?'- కుట్ర కోణంపై పోలీసుల దర్యాప్తు - Prakasam Barrage Boat Incident

Gates Repair Works in Prakasam Barrage : ప్రకాశం బ్యారేజ్ గేట్లను పడవలు ఢీకొని దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లను ఇంజినీర్లు విజయవంతంగా అమర్చారు. నిపుణుడు కన్నయ్యనాయుడు ఆధ్వర్యంలో ఇంజినీర్లు రేయింబవళ్లు కష్టపడి కేవలం నాలుగు రోజుల్లోనే మరమ్మతులు పూర్తి చేశారు. కింద నుంచి ఉద్ధృతంగా నీరు ప్రవహిస్తున్నా తాడు, క్లేన్ల సాయంతో సాహసోపేతంగా మరమ్మతులు పూర్తి చేశారు. ట్రయల్ రన్ చేసి గేట్లు ఆపరేట్ చేశారు. ప్రకాశం బ్యారేజ్‌కి ఎలాంటి ముప్పు లేదని రైతులకు ఎలాంటి నష్టం ఉండదని కన్నయ్యనాయుడు ప్రకటించారు. రికార్డు సమయంలోనే బ్యారేజ్ వద్ద మరమ్మతులు చేసినందుకు కన్నయ్యనాయుడుతోపాటు ఇంజినీర్లు, అధికారులను సన్మానించారు. బీజేపీనేత పాతూరి నాగభూషణం సహా కూటమి నేతలు కన్నయ్యనాయుడును శాలువాతో సత్కరించి అభినందించారు. ప్రస్తుతం కౌంటర్‌ వెయిట్లను కాంక్రీట్‌తో నింపే పనిని వేగవంతం చేశారు. ఈరోజుతో గేట్ల మరమ్మతు పనులు పూర్తి కానున్నాయి.

నిరంతరాయంగా శ్రమిస్తూ17 టన్నుల బరువున్న కౌంటర్‌ వెయిట్‌ను 3 భాగాలుగా కత్తిరిస్తున్నారు. అదే సమయంలో ఇప్పటికే 67, 69 గేట్లకు ఏర్పాటుచేసిన కౌంటర్‌ వెయిట్లను కాంక్రీట్‌తో నింపే పనిని వేగవంతం చేశారు. 4.5 టన్నులున్న వాటి బరువును 17 టన్నులకు పెంచే ప్రక్రియ చేపట్టారు. ఇవాళ 3 కౌంటర్‌ వెయిట్లలోనూ కాంక్రీట్‌తో నిర్ణీత బరువు నింపడం సహా యథాతథంగా గేట్లు నిర్వహించేలా చేయనున్నారు.

బ్యారేజీ పటిష్ఠత పెంచేలా మరిన్ని చర్యలు : ఆదివారం సాయంత్రం బ్యారేజీపైకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు గేట్ల మరమ్మతు పనులను పరిశీలించారు. వేగంగా పనులు చేస్తుండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బ్యారేజీ పటిష్ఠత పెంచేలా మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు గేట్ల నిపుణుడు, జలవనరులశాఖ సలహాదారు కన్నయ్యనాయుడుని సీఎం ఆదేశించారు.

"ప్రకాశం బ్యారేజ్‌కి ఎలాంటి ముప్పు లేదు. ఇక రైతులకు ఎలాంటి నష్టం ఉండదు. కౌంటర్ వెయిట్లను అమర్చిన తరువాత ట్రయల్ రన్ చేసి గేట్లు ఆపరేట్ చేశాం. ప్రస్తుతం గేట్లు దెబ్బతినకుండా పడవలను తీయాలని చూస్తున్నాం. పనులు చురుగ్గా సాగుతున్నాయి. కొత్తగా తెచ్చిన 3 కౌంటర్‌ వెయిట్లలోనూ కాంక్రీట్‌తో నిర్ణీత బరువు నింపడం సహా యథాతథంగా గేట్లు నిర్వహించేలా పనులు చేస్తున్నాం." - కన్నయ్యనాయుడు, జలవనరులశాఖ సలహాదారు

Prakasam Barrage Boat Incident Updates : ప్రకాశం బ్యారేజీకి వరద మళ్లీ పెరుగుతోంది. 4 లక్షల క్యూసెక్కులకుపైగా నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం లక్ష క్యూసెక్కులకు తగ్గాక 67, 68, 69 గేట్లు మూసేసి అక్కడ చిక్కుకున్న భారీ పడవలను తొలగించే పనులు ప్రారంభిస్తారు. పడవలను తొలగిస్తే ఆపరేషన్‌ విజయవంతమైనట్లే.

యుద్ధప్రాతిపదికన ప్రకాశం బ్యారేజ్​ గేట్ల పనులు- రికార్డు టైమ్‌లో కౌంటర్ వెయిట్ల బిగింపు - PRAKASAM BARRAGE GATES WORKS

'ఆ రోజు రాత్రి ఏం జరిగింది?, ఆ పడవలు ఎవరివి?'- కుట్ర కోణంపై పోలీసుల దర్యాప్తు - Prakasam Barrage Boat Incident

Last Updated : Sep 9, 2024, 4:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.