ETV Bharat / state

101 బస్సులు 5 వేల మంది - మంత్రాలయం చేరుకున్న 'ఓంశక్తి' మాలధారులు - OM SHAKTI DEVOTEES AT MANTRALAYAM

మంత్రాలయానికి ఓం శక్తి మాలధారులు - 101 బస్సులు సమకూర్చిన కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం

బస్సుల్లో  మంత్రాలయం చేరుకున్న 'ఓంశక్తి' మాలధారులు
om_shakti_devotees_at_mantralayam (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 27, 2024, 3:20 PM IST

Om Shakti devotees at Mantralayam : మాలధారణలో ఉన్న భక్తులు తీర్థయాత్రలు చేయడం పరిపాటే. అయ్యప్య భక్తులు శబరిమల వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. అదే విధంగా శివభక్తులు శ్రీశైలం, గోవింద మాల భక్తులు తిరుపతి, భవానీలు ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గాదేవిని దర్శించుకుని మాల విరమణ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో వారంతా 41 రోజుల పాటు కఠిన నియమాలు పాటిస్తూ దీక్ష పూర్తి చేస్తుంటారు. మాలధారులు మండల కాలం (41రోజులు)లో నిత్యం రెండు సార్లు స్నానం చేయడంతో పాటు ఒకే పూట భోజనం, పూజలు, భజనల్లో మునిగితేలుతుంటారు. ఈ క్రమంలోనే వివిధ చారిత్రక ఆలయాలను సందర్శిస్తుంటారు.

మాల ధరించిన భక్తులకు దాతలు భోజనం ఏర్పాటు చేయిస్తుంటారు. మరికొంత మంది దాతలు భక్తుల యాత్రకు అవసరమైన ఖర్చులు సమకూర్చుతారు. ఇది అంతటా జరిగేదే. అయితే కర్ణాటక రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఈశ్వరప్ప సైతం మాలధారులకు ప్రతి సంవత్సరం యాత్రకు అవసరమైన ఏర్పాట్లు చేస్తుంటారు. బస్సులు సమకూర్చడంతో పాటు యాత్రలో భోజనం సహా పలు అవసరాలకు ఆర్థిక సాయం అందిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి ఆ రాష్ట్రానికి చెందిన 5వేల మంది ఓం శక్తి మాల ధరించిన మహిళా భక్తుల యాత్రకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా వారు ప్రయాణిస్తున్న 101 బస్సులు శుక్రవారం కర్నూలు జిల్లా మంత్రాలయం చేరుకున్నాయి.

వెల్లివిరిసిన మతసామరస్యం.. హనుమాన్ మాలలో ముస్లిం వ్యక్తి.. భక్తిశ్రద్ధలతో భజనలు

కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ ప్రాంతం నుంచి 5 వేల మంది ఓం శక్తి మాల ధరించిన మహిళా భక్తులు శుక్రవారం ఉదయం మంత్రాలయం చేరుకున్నారు. వీరంతా కర్ణాటక ఆర్టీసీకి చెందిన 101 బస్సుల్లో ఇక్కడకు వచ్చారు. ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఈశ్వరప్ప ఓం శక్తి మాల ధరించిన భక్తులకు తన సొంత ఖర్చులతో ప్రతి సంవత్సరం 101 బస్సులలో దాదాపు 5 వేల మందికి ఉచిత ప్రయాణం, భోజన వసతి కల్పిస్తూ తీర్థయాత్రలకు పంపిస్తున్నారని నిర్వాహకులు, భక్తులు తెలిపారు.

శివమొగ్గ నుంచి 25వ తేదీ బయలుదేరిన ఈ బస్సులు శుక్రవారం ఉదయం మంత్రాలయం చేరుకున్నారు. దర్శనాంతరం తిరుపతి వెళ్లి వేంకటేశ్వర స్వామి దర్శించుకుంటామని భక్తులు తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలోని ఓం శక్తి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించిన తర్వాత ఈ నెల 31వ తేదీ శివమొగ్గ చేరుకుంటామని భక్తులు వెల్లడించారు.

ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన భవానీ దీక్ష విరమణలు.. అరుణవర్ణమైన విజయవాడ

గుడ్​న్యూస్ - శబరిమలకు 28 ప్రత్యేక రైళ్లు - రేపటి నుంచే బుకింగ్

Om Shakti devotees at Mantralayam : మాలధారణలో ఉన్న భక్తులు తీర్థయాత్రలు చేయడం పరిపాటే. అయ్యప్య భక్తులు శబరిమల వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. అదే విధంగా శివభక్తులు శ్రీశైలం, గోవింద మాల భక్తులు తిరుపతి, భవానీలు ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గాదేవిని దర్శించుకుని మాల విరమణ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో వారంతా 41 రోజుల పాటు కఠిన నియమాలు పాటిస్తూ దీక్ష పూర్తి చేస్తుంటారు. మాలధారులు మండల కాలం (41రోజులు)లో నిత్యం రెండు సార్లు స్నానం చేయడంతో పాటు ఒకే పూట భోజనం, పూజలు, భజనల్లో మునిగితేలుతుంటారు. ఈ క్రమంలోనే వివిధ చారిత్రక ఆలయాలను సందర్శిస్తుంటారు.

మాల ధరించిన భక్తులకు దాతలు భోజనం ఏర్పాటు చేయిస్తుంటారు. మరికొంత మంది దాతలు భక్తుల యాత్రకు అవసరమైన ఖర్చులు సమకూర్చుతారు. ఇది అంతటా జరిగేదే. అయితే కర్ణాటక రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఈశ్వరప్ప సైతం మాలధారులకు ప్రతి సంవత్సరం యాత్రకు అవసరమైన ఏర్పాట్లు చేస్తుంటారు. బస్సులు సమకూర్చడంతో పాటు యాత్రలో భోజనం సహా పలు అవసరాలకు ఆర్థిక సాయం అందిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి ఆ రాష్ట్రానికి చెందిన 5వేల మంది ఓం శక్తి మాల ధరించిన మహిళా భక్తుల యాత్రకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా వారు ప్రయాణిస్తున్న 101 బస్సులు శుక్రవారం కర్నూలు జిల్లా మంత్రాలయం చేరుకున్నాయి.

వెల్లివిరిసిన మతసామరస్యం.. హనుమాన్ మాలలో ముస్లిం వ్యక్తి.. భక్తిశ్రద్ధలతో భజనలు

కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ ప్రాంతం నుంచి 5 వేల మంది ఓం శక్తి మాల ధరించిన మహిళా భక్తులు శుక్రవారం ఉదయం మంత్రాలయం చేరుకున్నారు. వీరంతా కర్ణాటక ఆర్టీసీకి చెందిన 101 బస్సుల్లో ఇక్కడకు వచ్చారు. ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఈశ్వరప్ప ఓం శక్తి మాల ధరించిన భక్తులకు తన సొంత ఖర్చులతో ప్రతి సంవత్సరం 101 బస్సులలో దాదాపు 5 వేల మందికి ఉచిత ప్రయాణం, భోజన వసతి కల్పిస్తూ తీర్థయాత్రలకు పంపిస్తున్నారని నిర్వాహకులు, భక్తులు తెలిపారు.

శివమొగ్గ నుంచి 25వ తేదీ బయలుదేరిన ఈ బస్సులు శుక్రవారం ఉదయం మంత్రాలయం చేరుకున్నారు. దర్శనాంతరం తిరుపతి వెళ్లి వేంకటేశ్వర స్వామి దర్శించుకుంటామని భక్తులు తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలోని ఓం శక్తి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించిన తర్వాత ఈ నెల 31వ తేదీ శివమొగ్గ చేరుకుంటామని భక్తులు వెల్లడించారు.

ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన భవానీ దీక్ష విరమణలు.. అరుణవర్ణమైన విజయవాడ

గుడ్​న్యూస్ - శబరిమలకు 28 ప్రత్యేక రైళ్లు - రేపటి నుంచే బుకింగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.