ETV Bharat / state

ఆ 21 కొత్త రూట్లలో బస్సులు నడిపించండి - పొన్నం ప్రభాకర్​కు ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి వినతి - Rajgopal Reddy Meet Ponnam

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 12, 2024, 10:41 PM IST

Rajagopal Reddy Meets Ponnam : మునుగోడు నియోజకవర్గంలోని ఆర్టీసీ, బీసీ సంక్షేమ శాఖకు చెందిన పలు సమస్యలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్​ను కలిశారు. పలు సమస్యలను మంత్రికి వివరించిన ఆయన, పలు గ్రామాల్లో బస్సులు నడపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వినత పత్రం ఇచ్చారు.

MLA Komatireddy Rajgopal Reddy Meets Minister Ponnam
Rajagopal Reddy Meets Ponnam (ETV Bharat)

MLA Komatireddy Rajgopal Reddy Meets Minister Ponnam : హైదరాబాద్‌ మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి కలిశారు. ఆయన మునుగోడు నియోజకవర్గంలోని ఆర్టీసీ, బీసీ సంక్షేమ శాఖకు చెందిన పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మునుగోడు నియోజకవర్గంలో 21 కొత్త రూట్లల్లో పలు గ్రామాలను కలుపుతూ బస్సులు నడిపించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మునుగోడు నియోజకవర్గం నాంపల్లి, నారాయణపూర్ మండలాలకు కొత్త బస్ షెల్టర్ల నిర్మాణం చేయాలని పొన్నం ప్రభాకర్‌ను కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి కోరారు.

ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి ఇచ్చిన వినతులపై మంత్రి పొన్నం సానుకూలంగా స్పందించారు. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, సీఎం సలహాదారు వేం నరేందర్​రెడ్డిలను పీసీసీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ జగ్గారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, షాద్​నగర్‌ ఎమ్మెల్యేలు సంజయ్‌, విజయరమణరావు, శంకర్‌, కాంగ్రెస్‌ ఎన్‌ఆర్‌ఐ ఛైర్మన్‌ వినోద్‌ కుమార్‌లు భేటీ అయ్యారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సమయంలో గల్ఫ్‌ బాధితుల సమస్యలను సీఎంతో చర్చించినట్లు తెలిపిన వినోద్‌ కుమార్‌, విదేశాల నుంచి సీఎం రాగానే గల్ఫ్‌ కార్మిక సమస్యలపై కార్మికులు ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేస్తామని వేం నరేందర్​రెడ్డి తెలిపారు.

జీవో 46పై మంత్రి పొన్నంను కలిసిన బీఆర్​ఎస్​ నేత రాకేశ్‌రెడ్డి : మరోవైపు జీవో 46 బాధితులతో కలిసి బీఆర్​ఎస్​ నేత ఏనుగల రాకేశ్‌రెడ్డి సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. మాజీమంత్రి కేటీఆర్ చొరవతో చర్చకు వెళ్లిన రాకేశ్‌రెడ్డి, జీవో 46 వల్ల గ్రామీణ విద్యార్థులకు జరుగుతున్న నష్టం గురించి మంత్రికి వివరించారు. రాజకీయ భేషజాలకు వెళ్లకుండా జీవో రద్దుకు సంపూర్ణంగా సహకరించాలని కోరారు.

జీవో రద్దుతో పాటు న్యూమరికల్ పోస్టులతో న్యాయం చేయడంపై మంత్రితో సమాలోచనలు చేశారు. ఆగస్టు 19న జీవో 46పై హైకోర్టులో జరగనున్న విచారణకు, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ హాజరయ్యేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని రాకేశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో జీవో 46 బాధితులు మంత్రికి తమ బాధను చెప్పుకున్నారు. జీవో 46 రద్దుపై శాసనసభలో సబ్‌ కమిటీ సభ్యుడిగా ఉన్న మంత్రి పొన్నం, సానుకూలంగా సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

MLA Komatireddy Rajgopal Reddy Meets Minister Ponnam : హైదరాబాద్‌ మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి కలిశారు. ఆయన మునుగోడు నియోజకవర్గంలోని ఆర్టీసీ, బీసీ సంక్షేమ శాఖకు చెందిన పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మునుగోడు నియోజకవర్గంలో 21 కొత్త రూట్లల్లో పలు గ్రామాలను కలుపుతూ బస్సులు నడిపించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మునుగోడు నియోజకవర్గం నాంపల్లి, నారాయణపూర్ మండలాలకు కొత్త బస్ షెల్టర్ల నిర్మాణం చేయాలని పొన్నం ప్రభాకర్‌ను కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి కోరారు.

ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి ఇచ్చిన వినతులపై మంత్రి పొన్నం సానుకూలంగా స్పందించారు. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, సీఎం సలహాదారు వేం నరేందర్​రెడ్డిలను పీసీసీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ జగ్గారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, షాద్​నగర్‌ ఎమ్మెల్యేలు సంజయ్‌, విజయరమణరావు, శంకర్‌, కాంగ్రెస్‌ ఎన్‌ఆర్‌ఐ ఛైర్మన్‌ వినోద్‌ కుమార్‌లు భేటీ అయ్యారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సమయంలో గల్ఫ్‌ బాధితుల సమస్యలను సీఎంతో చర్చించినట్లు తెలిపిన వినోద్‌ కుమార్‌, విదేశాల నుంచి సీఎం రాగానే గల్ఫ్‌ కార్మిక సమస్యలపై కార్మికులు ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేస్తామని వేం నరేందర్​రెడ్డి తెలిపారు.

జీవో 46పై మంత్రి పొన్నంను కలిసిన బీఆర్​ఎస్​ నేత రాకేశ్‌రెడ్డి : మరోవైపు జీవో 46 బాధితులతో కలిసి బీఆర్​ఎస్​ నేత ఏనుగల రాకేశ్‌రెడ్డి సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. మాజీమంత్రి కేటీఆర్ చొరవతో చర్చకు వెళ్లిన రాకేశ్‌రెడ్డి, జీవో 46 వల్ల గ్రామీణ విద్యార్థులకు జరుగుతున్న నష్టం గురించి మంత్రికి వివరించారు. రాజకీయ భేషజాలకు వెళ్లకుండా జీవో రద్దుకు సంపూర్ణంగా సహకరించాలని కోరారు.

జీవో రద్దుతో పాటు న్యూమరికల్ పోస్టులతో న్యాయం చేయడంపై మంత్రితో సమాలోచనలు చేశారు. ఆగస్టు 19న జీవో 46పై హైకోర్టులో జరగనున్న విచారణకు, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ హాజరయ్యేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని రాకేశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో జీవో 46 బాధితులు మంత్రికి తమ బాధను చెప్పుకున్నారు. జీవో 46 రద్దుపై శాసనసభలో సబ్‌ కమిటీ సభ్యుడిగా ఉన్న మంత్రి పొన్నం, సానుకూలంగా సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.