ETV Bharat / state

కోచింగ్​ సెంటర్లను కంట్రోల్​లో పెడతాం : మంత్రి శ్రీధర్​బాబు - Sridhar Babu On Coaching Institutes

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 11, 2024, 10:54 PM IST

Minister Sridhar Babu On Education System : పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్ లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. కోచింగ్ సెంటర్లపై ఎటువంటి నియంత్రణ లేకపోవడం వల్ల అభ్యర్థుల భద్రత, ఫీజుల భారంపై ఇప్పటిదాకా ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయామని ఆయన తెలిపారు. కోచింగ్ సెంటర్లను కంట్రోల్​లో పెడతామని స్పష్టం చేశారు. ఇవాళ జరిగిన కేబినెట్ సబ్​-కమిటీ సమావేశంలో పలు అంశాలపై మంత్రి శ్రీధర్ బాబు ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు.

Minister Sridhar Babu On Education System
Minister Sridhar Babu On Education System (ETV Bharat)

Minister Sridhar Babu On Education System : కోచింగ్ సెంటర్ల నియంత్రణపై కేంద్రం గైడ్​లైన్స్​ను అమలు చేసి వాటిని కట్టడి చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్, మెడిసిన్ ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్న కొన్ని సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా జూనియర్ కాలేజీలను నడుపుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని మంత్రి తెలిపారు. ప్రైవేటు స్కూళ్లు, ఇంటర్మీడియట్ కళాశాల ఫీజుల నిర్ధారణపై నియంత్రణ కమిటీ ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు.

ప్రభుత్వ స్కూళ్లు ప్రతిభా కేంద్రాలుగా : విద్యారంగ సంస్కరణలపై ఇవాళ సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సబ్ కమిటీ సభ్యురాలు పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు. ప్రభుత్వ స్కూళ్లను ప్రతిభా కేంద్రాలుగా తీర్చిదిద్దగలిగితే పేద విద్యార్ధులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లను వేర్వేరుగా నడపడం వల్ల మానవ వనరుల వృథా జరుగుతోందని రెండింటిని విలీనం చేసే అంశంపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంను ఆదేశించారు. విద్యార్థులు లేని 1,600 పాఠశాలల్లోని ఉపాధ్యాయులను ఇతర స్కూళ్లకు బదిలీ చేయాలని సూచించారు.

పాలిటెక్నిక్​లను అప్​గ్రేడ్​ చేస్తాం​ : డిగ్రీ కళాశాలల్లో బీఏ కోర్సు పాఠ్య ప్రణాళికలో మార్పులు చేసి విద్యార్థులను ఉద్యోగాలకు సంసిద్ధం చేసేలా శిక్షణ ఇవ్వాలని శ్రీధర్​ బాబు అన్నారు. రాష్ట్రంలోని 9 పాలిటెక్నిక్ కాలేజీలను ఇంజినీరింగ్ కళాశాలలుగా అప్​గ్రేడ్ చేసే పనులను వేగవంతం చేయాలని శ్రీధర్​బాబు ఆదేశించారు. మాసబ్ ట్యాంక్, రామంతాపూర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, కొత్తగూడెం, సికింద్రాబాద్, కులీకుతుబ్ షా పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజనీరింగ్ కాలేజీలను ప్రారంభిస్తామని తెలిపారు.

విద్యాప్రమాణాల్లో రాష్ట్రం 34 వ స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోందని శ్రీధర్​ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లలో ఈ దుస్థితి నుంచి బయటపడాలని విద్యాశాఖ ఉన్నతాధికారులకు సూచించారు. అన్ని పాఠశాలలు, కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూంలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రైవేటు స్కూళ్లు కూడా ఈ దిశగా ముందడుగు వేసేలా చూడాలని తెలిపారు.

విద్యావ్యవస్థలో ఏఐను వినియోగించాలి : డిగ్రీ కాలేజీల్లోని పబ్లిక్ పాలసీ విద్యార్థులను ఏడాది పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల వద్ద ఇంటర్నీలుగా పనిచేసే అవకాశం కల్పిస్తామని శ్రీధర్​ బాబు వెల్లడించారు. దీని వల్ల వారికి ప్రభుత్వ పాలనపై అవగాహన కలుగుతుందని తెలిపారు. విద్యా వ్యవస్థలో కృత్రిమ మేథను వినియోగించాలని కోరారు. పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులు చదివే విద్యార్థులకు పరిశ్రమల్లో ఆన్ హ్యాండ్ శిక్షణనిస్తే వారికి వెంటనే ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు.

విద్యార్థుల వినూత్న ఆలోచనలు, సృజనను బయటకు తెచ్చేలా ప్రతి కళాశాల డిజిటల్ మ్యాగజైన్​లను నడపాలని మంత్రి సూచించారు. బీకాం, బీబీఏ, ఎంబీఏ విద్యార్థులకు బి.ఎఫ్.ఐసీ (బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్) సంస్థల్లో శిక్షణ ఇప్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. ట్రిపుల్ ఐటీల్లో బయో సైన్సెస్, ఫార్మా కోర్సులను వచ్చే ఏడాది నుంచే ప్రవేశ పెట్టేలా పాఠ్యాంశాలు రూపొందించాలని ఆదేశించారు.

విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దండి : విద్యాసంస్థల్లో కేవలం పాఠ్యాంశాలే కాకుండా విద్యార్థులను సమాజం కోసం ఆలోచించేలా ప్రోత్సహించడం, మహిళలకు గౌరవం ఇచ్చేలా తీర్చిదిద్దాలని మంత్రి సీతక్క సూచించారు. మహిళలపై అత్యాచారాలు, వేధింపుల ఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లో మహిళలపై అరాచకాలకు పాల్పడితే ఎలాంటి శిక్షలుంటాయో చేర్చాలని ఆదేశించారు. 5-6 తరగతుల టెక్ట్స్ బుక్​లలో ఈ అంశాలను పాఠాలుగా చేర్చాలని తెలిపారు. ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు ఉన్నా విద్యార్థులు ప్రైవేటు కళాశాలలకు ఎందుకు వెళ్తున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు.

19సంస్థలతో చర్చలు - రాష్ట్రానికి రూ.31,500 కోట్ల ఒప్పందాలు : శ్రీధర్ బాబు - Sridhar on Investments In Telangana

ఉపాధి అవకాశములో యువతకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి : మంత్రి శ్రీధర్​ బాబు

Minister Sridhar Babu On Education System : కోచింగ్ సెంటర్ల నియంత్రణపై కేంద్రం గైడ్​లైన్స్​ను అమలు చేసి వాటిని కట్టడి చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్, మెడిసిన్ ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్న కొన్ని సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా జూనియర్ కాలేజీలను నడుపుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని మంత్రి తెలిపారు. ప్రైవేటు స్కూళ్లు, ఇంటర్మీడియట్ కళాశాల ఫీజుల నిర్ధారణపై నియంత్రణ కమిటీ ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు.

ప్రభుత్వ స్కూళ్లు ప్రతిభా కేంద్రాలుగా : విద్యారంగ సంస్కరణలపై ఇవాళ సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సబ్ కమిటీ సభ్యురాలు పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు. ప్రభుత్వ స్కూళ్లను ప్రతిభా కేంద్రాలుగా తీర్చిదిద్దగలిగితే పేద విద్యార్ధులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లను వేర్వేరుగా నడపడం వల్ల మానవ వనరుల వృథా జరుగుతోందని రెండింటిని విలీనం చేసే అంశంపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంను ఆదేశించారు. విద్యార్థులు లేని 1,600 పాఠశాలల్లోని ఉపాధ్యాయులను ఇతర స్కూళ్లకు బదిలీ చేయాలని సూచించారు.

పాలిటెక్నిక్​లను అప్​గ్రేడ్​ చేస్తాం​ : డిగ్రీ కళాశాలల్లో బీఏ కోర్సు పాఠ్య ప్రణాళికలో మార్పులు చేసి విద్యార్థులను ఉద్యోగాలకు సంసిద్ధం చేసేలా శిక్షణ ఇవ్వాలని శ్రీధర్​ బాబు అన్నారు. రాష్ట్రంలోని 9 పాలిటెక్నిక్ కాలేజీలను ఇంజినీరింగ్ కళాశాలలుగా అప్​గ్రేడ్ చేసే పనులను వేగవంతం చేయాలని శ్రీధర్​బాబు ఆదేశించారు. మాసబ్ ట్యాంక్, రామంతాపూర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, కొత్తగూడెం, సికింద్రాబాద్, కులీకుతుబ్ షా పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజనీరింగ్ కాలేజీలను ప్రారంభిస్తామని తెలిపారు.

విద్యాప్రమాణాల్లో రాష్ట్రం 34 వ స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోందని శ్రీధర్​ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లలో ఈ దుస్థితి నుంచి బయటపడాలని విద్యాశాఖ ఉన్నతాధికారులకు సూచించారు. అన్ని పాఠశాలలు, కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూంలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రైవేటు స్కూళ్లు కూడా ఈ దిశగా ముందడుగు వేసేలా చూడాలని తెలిపారు.

విద్యావ్యవస్థలో ఏఐను వినియోగించాలి : డిగ్రీ కాలేజీల్లోని పబ్లిక్ పాలసీ విద్యార్థులను ఏడాది పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల వద్ద ఇంటర్నీలుగా పనిచేసే అవకాశం కల్పిస్తామని శ్రీధర్​ బాబు వెల్లడించారు. దీని వల్ల వారికి ప్రభుత్వ పాలనపై అవగాహన కలుగుతుందని తెలిపారు. విద్యా వ్యవస్థలో కృత్రిమ మేథను వినియోగించాలని కోరారు. పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులు చదివే విద్యార్థులకు పరిశ్రమల్లో ఆన్ హ్యాండ్ శిక్షణనిస్తే వారికి వెంటనే ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు.

విద్యార్థుల వినూత్న ఆలోచనలు, సృజనను బయటకు తెచ్చేలా ప్రతి కళాశాల డిజిటల్ మ్యాగజైన్​లను నడపాలని మంత్రి సూచించారు. బీకాం, బీబీఏ, ఎంబీఏ విద్యార్థులకు బి.ఎఫ్.ఐసీ (బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్) సంస్థల్లో శిక్షణ ఇప్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. ట్రిపుల్ ఐటీల్లో బయో సైన్సెస్, ఫార్మా కోర్సులను వచ్చే ఏడాది నుంచే ప్రవేశ పెట్టేలా పాఠ్యాంశాలు రూపొందించాలని ఆదేశించారు.

విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దండి : విద్యాసంస్థల్లో కేవలం పాఠ్యాంశాలే కాకుండా విద్యార్థులను సమాజం కోసం ఆలోచించేలా ప్రోత్సహించడం, మహిళలకు గౌరవం ఇచ్చేలా తీర్చిదిద్దాలని మంత్రి సీతక్క సూచించారు. మహిళలపై అత్యాచారాలు, వేధింపుల ఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లో మహిళలపై అరాచకాలకు పాల్పడితే ఎలాంటి శిక్షలుంటాయో చేర్చాలని ఆదేశించారు. 5-6 తరగతుల టెక్ట్స్ బుక్​లలో ఈ అంశాలను పాఠాలుగా చేర్చాలని తెలిపారు. ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు ఉన్నా విద్యార్థులు ప్రైవేటు కళాశాలలకు ఎందుకు వెళ్తున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు.

19సంస్థలతో చర్చలు - రాష్ట్రానికి రూ.31,500 కోట్ల ఒప్పందాలు : శ్రీధర్ బాబు - Sridhar on Investments In Telangana

ఉపాధి అవకాశములో యువతకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి : మంత్రి శ్రీధర్​ బాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.