ETV Bharat / state

అంగీకారం, అభ్యంతరం - ల్యాండ్​ టైటిలింగ్​ చట్టంపై మంత్రి వింత సమాధానాలు - Botsa on Land Titling Act

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 5, 2024, 12:05 PM IST

Minister Botsa Different Opinion on Land Titling Act: వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్​ టైటిలింగ్​ చట్టాన్ని న్యాయవాదులు, రైతులు సైతం దీనిని అంగీకరించేదిలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంపై మంత్రి బొత్స సత్యనారాయణ వింత వింత సమాధానాలు చెప్పారు. పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్‌ ఫొటో ఉంటే తప్పేముందంటూ సమర్థించుకున్నారు. ఈ వివాదాలపై రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారంటే సమగ్ర సర్వేపై సమాధానం చెప్పలేదు.

BOTSA ON LAND TITLING ACT
BOTSA ON LAND TITLING ACT (Etv Bharat)

Minister Botsa Comments on Land Titling Act: ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంపై ఎవరికైనా అభ్యంతరాలుంటే జిల్లా జడ్జి స్థాయి అధికారి దృష్టికి తీసుకెళ్లొచ్చని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వారి ఉత్తర్వులపైనా అభ్యంతరాలుంటే హైకోర్టుకు వెళ్లాల్సిందే అని బొత్స సత్యనారాయణ అంగీకరించారు. సమగ్ర భూ సర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రజాభిప్రాయం సేకరించి చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తామన్నారు. అమరావతిలో ఉన్న హైకోర్టుకు వెళ్లడానికి సామాన్య ప్రజలకు ఇబ్బంది కాదా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు హైకోర్టుకు ఎవరు వెళ్లమన్నారు. మేం వెళ్లమని చెప్పామా అంటూ బొత్స అసహనం వ్యక్తం చేశారు.

ఆంధ్రులారా తస్మాత్ జాగ్రత్త - ఇది జగన్‌ మార్కు దోపిడీ చట్టం - చూసుకోకుంటే మీ భూములు ఇక అంతే!

జిల్లా జడ్జి స్థాయి అధికారి ఉత్తర్వులతో రూలింగ్‌ ఇచ్చిన తర్వాత హైకోర్టుకు తప్ప కింది కోర్టుకు వెళ్లడానికి అవకాశం లేదన్నారు. కింది కోర్టుల పరిధి తీసేశాం. ఈ విషయమై న్యాయవాదులు విజ్ఞప్తి చేయడంతో పరిశీలిస్తామని చెప్పామన్నారు. గిట్టని వ్యక్తులు చేసిన క్లెయిమ్‌ల వల్ల స్థలం డిస్ప్యూట్‌ రిజిస్ట్రర్‌లో చేరితే సామాన్య ప్రజలు హైకోర్టు చుట్టూ తిరగలేరుగా అని ప్రశ్నించగా మీరు చెప్పింది నిజమేనంటూ అంగీకరించారు. ఆ వెంటనే అలా తిరగకుండా ఉండటానికే చట్టం తీసుకొస్తున్నామని బదులిచ్చారు. ఈ చట్టం గురించి ఏమైనా సందేహాలుంటే అడగండి సమాధానాలు చెబుతా అంటూనే మంత్రి పాత్రికేయులకు ఎదురు ప్రశ్నలు వేశారు. పైగా పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్‌ ఫొటో వేస్తే తప్పేంటంటూ సమర్థించుకున్నారు.

భూమి పత్రాలన్నీ ప్రైవేటు సంస్థ ఆధీనంలో- ల్యాండ్ టైట్లింగ్ చట్టం గుట్టు ఇదే : టీడీపీ - neelayapalem vijay kumar comments

రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు, జిరాక్స్‌ కాపీలు ఇస్తారని ఆందోళన చెందుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా అన్నం తినే వారెవరైనా డాక్యుమెంట్లకు సంబంధించి జిరాక్స్‌ కాపీలు ఇస్తారా? ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? అంటూ ఎదురు ప్రశ్నించారు. స్థిరాస్తులు కొనుగోలు చేసిన వారికి ఒరిజినల్‌ దస్తావేజులు కాకుండా అన్ని వివరాలను ప్రింట్‌ తీసి ఇస్తే వాటిని జిరాక్స్‌ కాకుండా ఏమనాలో ఆయనే చెప్పాలి. సమగ్ర సర్వేలో భూ విస్తీర్ణం తగ్గిన రైతుల ఆవేదన గురించి ప్రశ్నిస్తే కొన్ని చోట్ల దస్తావేజులు, వాస్తవానికి విస్తీర్ణం తేడా ఉంది. తగ్గిపోయిందంటే ఆ భూములను పిల్లి ఎత్తుకెళ్లిపోయిందా అంటూ ఎద్దేవా చేశారు. ఈ వివాదాలపై రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారంటే సమగ్ర సర్వే వద్దా చెప్పండంటూ దాటవేసే ప్రయత్నం చేశారు.

విద్యుత్తు ఛార్జీలను 8 సార్లు పెంచారని అడగ్గా ఛార్జీలు పెంపు వాస్తమేనని, ఎన్ని సార్లు పెంచారు, ఆ తేదీలు గుర్తు లేవని బదులిచ్చారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని భూములను మూడో రిజిస్ట్రేషన్‌ కింద మా కుమారుడు సందీప్‌ కొనుగోలు చేశారు. ఆ సర్వే నంబరులో మొత్తం 31 ఎకరాలుంటే మేం కొన్నది 2.50 ఎకరాలే. దీనిపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని బొత్స సత్యనారాయణ అన్నారు.

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రైతుల భూములు కాజేసే చట్టం : సీపీఐ రామకృష్ణ - CPI Ramakrishna on Land Titling Act

Minister Botsa Comments on Land Titling Act: ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంపై ఎవరికైనా అభ్యంతరాలుంటే జిల్లా జడ్జి స్థాయి అధికారి దృష్టికి తీసుకెళ్లొచ్చని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వారి ఉత్తర్వులపైనా అభ్యంతరాలుంటే హైకోర్టుకు వెళ్లాల్సిందే అని బొత్స సత్యనారాయణ అంగీకరించారు. సమగ్ర భూ సర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రజాభిప్రాయం సేకరించి చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తామన్నారు. అమరావతిలో ఉన్న హైకోర్టుకు వెళ్లడానికి సామాన్య ప్రజలకు ఇబ్బంది కాదా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు హైకోర్టుకు ఎవరు వెళ్లమన్నారు. మేం వెళ్లమని చెప్పామా అంటూ బొత్స అసహనం వ్యక్తం చేశారు.

ఆంధ్రులారా తస్మాత్ జాగ్రత్త - ఇది జగన్‌ మార్కు దోపిడీ చట్టం - చూసుకోకుంటే మీ భూములు ఇక అంతే!

జిల్లా జడ్జి స్థాయి అధికారి ఉత్తర్వులతో రూలింగ్‌ ఇచ్చిన తర్వాత హైకోర్టుకు తప్ప కింది కోర్టుకు వెళ్లడానికి అవకాశం లేదన్నారు. కింది కోర్టుల పరిధి తీసేశాం. ఈ విషయమై న్యాయవాదులు విజ్ఞప్తి చేయడంతో పరిశీలిస్తామని చెప్పామన్నారు. గిట్టని వ్యక్తులు చేసిన క్లెయిమ్‌ల వల్ల స్థలం డిస్ప్యూట్‌ రిజిస్ట్రర్‌లో చేరితే సామాన్య ప్రజలు హైకోర్టు చుట్టూ తిరగలేరుగా అని ప్రశ్నించగా మీరు చెప్పింది నిజమేనంటూ అంగీకరించారు. ఆ వెంటనే అలా తిరగకుండా ఉండటానికే చట్టం తీసుకొస్తున్నామని బదులిచ్చారు. ఈ చట్టం గురించి ఏమైనా సందేహాలుంటే అడగండి సమాధానాలు చెబుతా అంటూనే మంత్రి పాత్రికేయులకు ఎదురు ప్రశ్నలు వేశారు. పైగా పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్‌ ఫొటో వేస్తే తప్పేంటంటూ సమర్థించుకున్నారు.

భూమి పత్రాలన్నీ ప్రైవేటు సంస్థ ఆధీనంలో- ల్యాండ్ టైట్లింగ్ చట్టం గుట్టు ఇదే : టీడీపీ - neelayapalem vijay kumar comments

రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు, జిరాక్స్‌ కాపీలు ఇస్తారని ఆందోళన చెందుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా అన్నం తినే వారెవరైనా డాక్యుమెంట్లకు సంబంధించి జిరాక్స్‌ కాపీలు ఇస్తారా? ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? అంటూ ఎదురు ప్రశ్నించారు. స్థిరాస్తులు కొనుగోలు చేసిన వారికి ఒరిజినల్‌ దస్తావేజులు కాకుండా అన్ని వివరాలను ప్రింట్‌ తీసి ఇస్తే వాటిని జిరాక్స్‌ కాకుండా ఏమనాలో ఆయనే చెప్పాలి. సమగ్ర సర్వేలో భూ విస్తీర్ణం తగ్గిన రైతుల ఆవేదన గురించి ప్రశ్నిస్తే కొన్ని చోట్ల దస్తావేజులు, వాస్తవానికి విస్తీర్ణం తేడా ఉంది. తగ్గిపోయిందంటే ఆ భూములను పిల్లి ఎత్తుకెళ్లిపోయిందా అంటూ ఎద్దేవా చేశారు. ఈ వివాదాలపై రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారంటే సమగ్ర సర్వే వద్దా చెప్పండంటూ దాటవేసే ప్రయత్నం చేశారు.

విద్యుత్తు ఛార్జీలను 8 సార్లు పెంచారని అడగ్గా ఛార్జీలు పెంపు వాస్తమేనని, ఎన్ని సార్లు పెంచారు, ఆ తేదీలు గుర్తు లేవని బదులిచ్చారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని భూములను మూడో రిజిస్ట్రేషన్‌ కింద మా కుమారుడు సందీప్‌ కొనుగోలు చేశారు. ఆ సర్వే నంబరులో మొత్తం 31 ఎకరాలుంటే మేం కొన్నది 2.50 ఎకరాలే. దీనిపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని బొత్స సత్యనారాయణ అన్నారు.

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రైతుల భూములు కాజేసే చట్టం : సీపీఐ రామకృష్ణ - CPI Ramakrishna on Land Titling Act

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.