ETV Bharat / state

దయనీయంగా మారిన ముంపు బాధితుల బతుకులు - కొత్త ప్రభుత్వంపైనే కోటి ఆశలు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 9, 2024, 7:33 AM IST

Mallanna Sagar 14 Village People Facing problems : మల్లన్నసాగర్! కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 50 టీఎంసీల సామర్థ్యంతో వేలాది ఎకరాలకు సాగునీరు అందించాలనేది లక్ష్యం నిర్మించిన భారీ జలాశయం. కర్షకుల కళ్లల్లో ఆనందం చూడాలని అధిక దిగుబడులు సాధించాలనే ఉద్దేశం. అంతా బానే ఉంది. కానీ అందుకోసం భూములిచ్చిన నిర్వాసితుల బతుకులే దయనీయంగా మారాయి. తమత్యాగంతో ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. తోటి రైతులకు మేలు జరిగే అవకాశం ఉందని, నాడు ఊరొదిన 14 గ్రామాల ప్రజలు, నేడు దేవుడా ఏమిటీ కష్టం అంటూ కన్నీటిపర్యంతం అవుతున్నారు. వారిలో ఏ ఒక్కరిని పలకరించినా, కంట కన్నీళ్లే దర్శనమిస్తాయి. ఇచ్చిన హామీలు అమలు కాక లబ్ధిదారులకు సాయం అందక, కష్టాల కడలిలోనే జీవనం సాగిస్తున్నారు. పునరావాసం కల్పించినా అక్కడా మౌలిక వసతులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. పనులు లేవు పిల్లలకు విద్యాబుద్దులు నేర్పేందుకు బడులూ లేవు. ఎవరైనా రాకపోరా, ఆదుకోరా అంటూ వేడుకోవడమే నిర్వాసితులకు మిగిలింది. ఏం చేస్తే నిర్వాసితుల సమస్యలు పరిష్కరించవచ్చు.? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే లబ్ధిదారుల బాధలు తీర్చవచ్చు.

Mallanna Sagar People emotional over vacated Villages
Mallanna Sagar 14 Village People Facing problems

దయనీయంగా మారిన ముంపు బాధితుల బతుకులు - కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు

Mallanna Sagar 14 Village People Facing Problems : మల్లన్న సాగర్‌ 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం చేపట్టిన ఈ జలాశయం కాళేశ్వరం ప్రాజెక్టులోనే అతిపెద్దది. దీని నిర్మాణానికి దాదాపు 17 వేల ఎకరాల భూమిని గత ప్రభుత్వం సేకరించింది. మల్లన్నసాగర్‌ జలాశయంలో 14 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. దీంతో వారంతా పుట్టి పెరిగిన ఊరును ఉన్న ఫలంగా ఖాళీ చేశారు. వారందరికీ పునరావాసం సహా మరెన్నో హామీలను నాటి ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఆ హామీలన్నీ నీటి మూటలుగా మారడంతో వారంతా అనేక ఇబ్బందులు పడుతున్నారు. నిర్వాసితుల్లో ఏ ఒక్కరిని పలకరించినా కంట కన్నీళ్లే దర్శనమిస్తున్నాయి. తరతరాలుగా ఉన్న భూమిని చమటోడ్చి, కట్టుకున్న ఇళ్లను వదిలిన వారంతా ఎక్కడో ఊరు కాని ఊర్లో బతకాల్సిన పరిస్థితి. ఇంత చేసిన వారికి ప్రభుత్వ సహాయ సహకారాలు అందాయా అంటే అదీ లేదు.

సాగు చేసుకుందామంటే భూమి లేక, చేసుకుందామంటే ఉపాధి కానరాక, తలదాచుకుందామంచే సరైన గూడూ లేక పిల్లలకు విద్యాబుద్దులు నేర్పేందుకు కనీసం స్కూళ్లు లేక ఇలా అనేక సమస్యలతో జీవనం సాగిస్తున్నారు. తమ గ్రామం పేరు గుర్తొస్తేనే ఆనాటి జ్ఞాపకాలు, వారి పల్లెవాతారణనాన్ని గుర్తు చేసుకుని తల్లడిల్లి పోతున్నారు మల్లన్నసాగర్‌ నిర్వాసితులు. సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి మల్లన్నసాగర్‌ జలాశయ నిర్మాణానికి పరివాహక ప్రాతంలోని 14 గ్రామాల్ని ఖాళీ చేయించారు. ఒక్కో కుటుంబానికి ఒక్కో విధంగా ప్రభుత్వం ఆదుకుంటుందని ఆనాటి ప్రజాప్రతి నిధులు హామీల వర్షం కురిపించారు. సాగుభూమి కోల్పోయిన వారికి ప్రభుత్వ అంచనాల ప్రకారం ధర నిర్ణయించారు. వాస్తవానికి అక్కడ ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే దాదాపు మూడింతలు అధికంగా ధర ఉంటుంది. కానీ, ప్రాంత అభివృద్ధితో పాటు తోటి రైతులకు మేలు జరుగుతుందని భావించిన నిర్వాసితులు వారి భూముల్ని ప్రభుత్వానికి అప్పగించారు. ఆ డబ్బుల కోసమూ ఏళ్ల పాటు అధికారుల చుట్టూ తిరగారు.

Mallanna Sagar People emotional over vacated Villages : భూమితో పాటు ఇళ్లు కోల్పోయిన వారికి కొత్తగా ఇళ్లు కట్టించి ఇస్తామని, అదొద్దు అనుకుంటే 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. నిర్వాసితుల కుటుంబాల్లో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ ప్లాట్లు ఇస్తామని ప్రకటించింది. నూతనంగా నిర్మించిన ఇళ్లు అద్భుతంగా ఉంటాయని నమ్మబలికారు. ఒంటరి మహిళల కుటుంబ పోషణ కోసం ప్రత్యేక ప్యాకేజీని కేటాయించారు. ప్యాకేజీలో ఏడున్నర్ర లక్షల నగదు, ఇంటి స్థలం లేదా ఇల్లు కట్టించి ఇస్తానని పేర్కొన్నారు. కానీ, ఆ ప్యాకేజీలు నేటికీ చాలా మందికి అందనే లేదని నిర్వాసితులు చెబుతున్నారు. భూములు, ఇళ్లు, చెట్టు, పుట్ట ఇలా సర్వం కోల్పోయిన తమకు మూడేళ్లయినా గత పాలకులు ఇళ్లు ఇవ్వలేకపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మల్లన్నసాగర్‌ పరివాహక ప్రాంతంలో మెుత్తం 14 గ్రామాలు ఖాళీ చేయించగా ప్రాజెక్టులో పాక్షికంగా ముంపునకు గురైన గ్రామాల కుటుంబాలు అక్కడే నివాసిస్తున్నాయి. మల్లన్న సాగర్‌లో ముంపునకు గురైన గ్రామాల వివరాలు పరిశీలిస్తే ఎర్రవెల్లి గ్రామంలో మెుత్తం 553 కుటుంబాలు ఉండగా అందరినీ ఖాళీ చేయించారు. సింగారం 181, లక్ష్మాపూర్‌ 310, రాంపూర్‌ 220, వేముల ఘాట్‌ 689, బంజేరుపల్లి 79, పల్లెపహాడ్‌ 509, ఏటిగడ్డ కిష్టాపూర్‌ 463, మెుగులు చెరువు తండాలో 113 కుటుంబాలు ఇలా ఆయా గ్రామాల్లోని అన్ని కుటుంబాలను ఖాళీ చేయించారు. వారందరినీ గజ్వెల్‌ శివారులోని సంగాపూర్‌లో నిర్మించిన ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీకి తరలించారు. గజ్వేల్‌-‌ప్రజ్ఞాపూర్‌ బల్దియా పరిధి సంగాపూర్‌-ముట్రాజ్‌పల్లి సమీపంలో దాదాపు 600 ఎకరాలు సేకరించిన గత ప్రభుత్వం తిరిగి గ్రామాలను పునర్‌ నిర్మించింది.

ఇక్కడ సుమారు 3 వేల కుటుంబాలకు రెండు పడకగదుల ఇళ్లు కేటాయించగా మరో 3 వేల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. స్థలాలు తీసుకున్న వారు ఇళ్లు నిర్మించుకుంటున్నారు. పలువురు ఇంకా స్థలాల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు పూర్తిస్థాయిలో ప్యాకేజీ ఇవ్వలేదని తమకు ఇంటి స్థలాలు కేటాయించలేదని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇళ్ల కేటాయింపులోనూ ఆయా గ్రామాల సర్పంచులు చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిరుపేదలు, వృద్ధులైన నిర్వాసితులకు అన్యాయం జరిగిందని ని‌ర్వాసితులు చెబుతున్నారు. సర్పంచులకు లక్షల్లో సొమ్ము ముట్టజెపితే గానీ ఇళ్లు కేటాయించలేదని చేతులు తడిపినా ఇళ్లు రాలేదని పలువురు నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

No Facilities at R&R Colony in Mallanna Sagar : మరోవైపు మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు కేటాయించిన ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. నూతనంగా నిర్మించిన కాలనీలకు సరైన రోడ్లు, డ్రైనేజీలు కరవయ్యాయి. ఆగమేఘాలపై నిర్మించిన డ్రైనేజీలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీధిలైట్లు లేక రాత్రిళ్లు ప్రమాదాలు జరుగుతున్నాయని నిర్వాసితులు చెబుతున్నారు. విద్యుత్‌ స్తంభాలు రోడ్లపక్కన పడేశారు. కాలువ పక్కనే ఇళ్లు ఉండటంతో దానిని దాటడానికి సరైన వంతెన లేకపోవడంతో ఆ స్తంభాల్నే అడ్డంగా వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు కూడా లేవంటున్నారు. శివారుల్లో నిర్మించిన ఆ గ్రామాల్లో మౌలిక వసతులు లేక వారంతా నిత్యం సమస్యలతో జీవనం సాగిస్తున్నారు. నిత్యావసరాల కోసం 2, 3 కిలో మీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుంది.

సొంతూళ్లల్లో ఉన్నప్పుడు ఏదో ‍ఒకపని దొరికేదని, ఇక్కడికొచ్చాక పనుల్లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నామని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. యువత ఖాళీగా ఉండటంతో మద్యం సేవిస్తూ ప్రమాదాలకు గురై కొందరు మృతిచెందగా మరికొందరు ఆసుపత్రి పాలైనట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అభివృద్ధి పేరుతో భూములు తీసుకున్న గత ప్రభుత్వం హామీలు, పునరావాసంపై సరైన చర్యలు తీసుకోలేదని నిర్వాసితులు చెబుతున్నారు. వీరి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డే ముఖ్యమంత్రి కావటంతో తమ ఇక్కట్లు తీరుతాయని నిర్వాసితులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. అధికారులు వచ్చి కాలనీలోని సమస్యలను ఎప్పుడు తెలుసుకుంటారా? అని భూ నిర్వాసితులు వేచిచూస్తున్నారు.

నిజాం చక్కెర ఫ్యాక్టరీ ప్రారంభంపై ప్రభుత్వం కసరత్తు - కార్మికుల్లో చిగురిస్తున్న ఆశలు

ఇళ్లైతే ఇచ్చారు - మరి మౌలిక సదుపాయాల మాటేంటి మహాప్రభో!

దయనీయంగా మారిన ముంపు బాధితుల బతుకులు - కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు

Mallanna Sagar 14 Village People Facing Problems : మల్లన్న సాగర్‌ 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం చేపట్టిన ఈ జలాశయం కాళేశ్వరం ప్రాజెక్టులోనే అతిపెద్దది. దీని నిర్మాణానికి దాదాపు 17 వేల ఎకరాల భూమిని గత ప్రభుత్వం సేకరించింది. మల్లన్నసాగర్‌ జలాశయంలో 14 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. దీంతో వారంతా పుట్టి పెరిగిన ఊరును ఉన్న ఫలంగా ఖాళీ చేశారు. వారందరికీ పునరావాసం సహా మరెన్నో హామీలను నాటి ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఆ హామీలన్నీ నీటి మూటలుగా మారడంతో వారంతా అనేక ఇబ్బందులు పడుతున్నారు. నిర్వాసితుల్లో ఏ ఒక్కరిని పలకరించినా కంట కన్నీళ్లే దర్శనమిస్తున్నాయి. తరతరాలుగా ఉన్న భూమిని చమటోడ్చి, కట్టుకున్న ఇళ్లను వదిలిన వారంతా ఎక్కడో ఊరు కాని ఊర్లో బతకాల్సిన పరిస్థితి. ఇంత చేసిన వారికి ప్రభుత్వ సహాయ సహకారాలు అందాయా అంటే అదీ లేదు.

సాగు చేసుకుందామంటే భూమి లేక, చేసుకుందామంటే ఉపాధి కానరాక, తలదాచుకుందామంచే సరైన గూడూ లేక పిల్లలకు విద్యాబుద్దులు నేర్పేందుకు కనీసం స్కూళ్లు లేక ఇలా అనేక సమస్యలతో జీవనం సాగిస్తున్నారు. తమ గ్రామం పేరు గుర్తొస్తేనే ఆనాటి జ్ఞాపకాలు, వారి పల్లెవాతారణనాన్ని గుర్తు చేసుకుని తల్లడిల్లి పోతున్నారు మల్లన్నసాగర్‌ నిర్వాసితులు. సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి మల్లన్నసాగర్‌ జలాశయ నిర్మాణానికి పరివాహక ప్రాతంలోని 14 గ్రామాల్ని ఖాళీ చేయించారు. ఒక్కో కుటుంబానికి ఒక్కో విధంగా ప్రభుత్వం ఆదుకుంటుందని ఆనాటి ప్రజాప్రతి నిధులు హామీల వర్షం కురిపించారు. సాగుభూమి కోల్పోయిన వారికి ప్రభుత్వ అంచనాల ప్రకారం ధర నిర్ణయించారు. వాస్తవానికి అక్కడ ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే దాదాపు మూడింతలు అధికంగా ధర ఉంటుంది. కానీ, ప్రాంత అభివృద్ధితో పాటు తోటి రైతులకు మేలు జరుగుతుందని భావించిన నిర్వాసితులు వారి భూముల్ని ప్రభుత్వానికి అప్పగించారు. ఆ డబ్బుల కోసమూ ఏళ్ల పాటు అధికారుల చుట్టూ తిరగారు.

Mallanna Sagar People emotional over vacated Villages : భూమితో పాటు ఇళ్లు కోల్పోయిన వారికి కొత్తగా ఇళ్లు కట్టించి ఇస్తామని, అదొద్దు అనుకుంటే 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. నిర్వాసితుల కుటుంబాల్లో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ ప్లాట్లు ఇస్తామని ప్రకటించింది. నూతనంగా నిర్మించిన ఇళ్లు అద్భుతంగా ఉంటాయని నమ్మబలికారు. ఒంటరి మహిళల కుటుంబ పోషణ కోసం ప్రత్యేక ప్యాకేజీని కేటాయించారు. ప్యాకేజీలో ఏడున్నర్ర లక్షల నగదు, ఇంటి స్థలం లేదా ఇల్లు కట్టించి ఇస్తానని పేర్కొన్నారు. కానీ, ఆ ప్యాకేజీలు నేటికీ చాలా మందికి అందనే లేదని నిర్వాసితులు చెబుతున్నారు. భూములు, ఇళ్లు, చెట్టు, పుట్ట ఇలా సర్వం కోల్పోయిన తమకు మూడేళ్లయినా గత పాలకులు ఇళ్లు ఇవ్వలేకపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మల్లన్నసాగర్‌ పరివాహక ప్రాంతంలో మెుత్తం 14 గ్రామాలు ఖాళీ చేయించగా ప్రాజెక్టులో పాక్షికంగా ముంపునకు గురైన గ్రామాల కుటుంబాలు అక్కడే నివాసిస్తున్నాయి. మల్లన్న సాగర్‌లో ముంపునకు గురైన గ్రామాల వివరాలు పరిశీలిస్తే ఎర్రవెల్లి గ్రామంలో మెుత్తం 553 కుటుంబాలు ఉండగా అందరినీ ఖాళీ చేయించారు. సింగారం 181, లక్ష్మాపూర్‌ 310, రాంపూర్‌ 220, వేముల ఘాట్‌ 689, బంజేరుపల్లి 79, పల్లెపహాడ్‌ 509, ఏటిగడ్డ కిష్టాపూర్‌ 463, మెుగులు చెరువు తండాలో 113 కుటుంబాలు ఇలా ఆయా గ్రామాల్లోని అన్ని కుటుంబాలను ఖాళీ చేయించారు. వారందరినీ గజ్వెల్‌ శివారులోని సంగాపూర్‌లో నిర్మించిన ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీకి తరలించారు. గజ్వేల్‌-‌ప్రజ్ఞాపూర్‌ బల్దియా పరిధి సంగాపూర్‌-ముట్రాజ్‌పల్లి సమీపంలో దాదాపు 600 ఎకరాలు సేకరించిన గత ప్రభుత్వం తిరిగి గ్రామాలను పునర్‌ నిర్మించింది.

ఇక్కడ సుమారు 3 వేల కుటుంబాలకు రెండు పడకగదుల ఇళ్లు కేటాయించగా మరో 3 వేల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. స్థలాలు తీసుకున్న వారు ఇళ్లు నిర్మించుకుంటున్నారు. పలువురు ఇంకా స్థలాల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు పూర్తిస్థాయిలో ప్యాకేజీ ఇవ్వలేదని తమకు ఇంటి స్థలాలు కేటాయించలేదని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇళ్ల కేటాయింపులోనూ ఆయా గ్రామాల సర్పంచులు చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిరుపేదలు, వృద్ధులైన నిర్వాసితులకు అన్యాయం జరిగిందని ని‌ర్వాసితులు చెబుతున్నారు. సర్పంచులకు లక్షల్లో సొమ్ము ముట్టజెపితే గానీ ఇళ్లు కేటాయించలేదని చేతులు తడిపినా ఇళ్లు రాలేదని పలువురు నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

No Facilities at R&R Colony in Mallanna Sagar : మరోవైపు మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు కేటాయించిన ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. నూతనంగా నిర్మించిన కాలనీలకు సరైన రోడ్లు, డ్రైనేజీలు కరవయ్యాయి. ఆగమేఘాలపై నిర్మించిన డ్రైనేజీలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీధిలైట్లు లేక రాత్రిళ్లు ప్రమాదాలు జరుగుతున్నాయని నిర్వాసితులు చెబుతున్నారు. విద్యుత్‌ స్తంభాలు రోడ్లపక్కన పడేశారు. కాలువ పక్కనే ఇళ్లు ఉండటంతో దానిని దాటడానికి సరైన వంతెన లేకపోవడంతో ఆ స్తంభాల్నే అడ్డంగా వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు కూడా లేవంటున్నారు. శివారుల్లో నిర్మించిన ఆ గ్రామాల్లో మౌలిక వసతులు లేక వారంతా నిత్యం సమస్యలతో జీవనం సాగిస్తున్నారు. నిత్యావసరాల కోసం 2, 3 కిలో మీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుంది.

సొంతూళ్లల్లో ఉన్నప్పుడు ఏదో ‍ఒకపని దొరికేదని, ఇక్కడికొచ్చాక పనుల్లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నామని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. యువత ఖాళీగా ఉండటంతో మద్యం సేవిస్తూ ప్రమాదాలకు గురై కొందరు మృతిచెందగా మరికొందరు ఆసుపత్రి పాలైనట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అభివృద్ధి పేరుతో భూములు తీసుకున్న గత ప్రభుత్వం హామీలు, పునరావాసంపై సరైన చర్యలు తీసుకోలేదని నిర్వాసితులు చెబుతున్నారు. వీరి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డే ముఖ్యమంత్రి కావటంతో తమ ఇక్కట్లు తీరుతాయని నిర్వాసితులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. అధికారులు వచ్చి కాలనీలోని సమస్యలను ఎప్పుడు తెలుసుకుంటారా? అని భూ నిర్వాసితులు వేచిచూస్తున్నారు.

నిజాం చక్కెర ఫ్యాక్టరీ ప్రారంభంపై ప్రభుత్వం కసరత్తు - కార్మికుల్లో చిగురిస్తున్న ఆశలు

ఇళ్లైతే ఇచ్చారు - మరి మౌలిక సదుపాయాల మాటేంటి మహాప్రభో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.