ETV Bharat / state

కొండా సురేఖ వ్యాఖ్యలతో నా పరువు ప్రతిష్ఠ దెబ్బతిన్నాయి: కేటీఆర్

పరువునష్టం దావా వాంగ్మూలం కోసం నాంపల్లి కోర్టుకు హాజరైన మాజీ మంత్రి కేటీఆర్ - కొండా సురేఖ వ్యాఖ్యలతో నా పరువు ప్రతిష్ఠ దెబ్బతిన్నాయన్న కేటీఆర్

konda surekha case
KTR Attend Nampally Court (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Updated : 57 minutes ago

KTR Attend Nampally Court : సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తనకు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం కలిగించాయని ఒక మహిళ పట్ల తనకున్న గౌరవంతో ఆమె చెప్పిన మాటలు తిరిగి చెప్పలేకపోతున్నానని కేటీఆర్ కోర్టుకు వివరించారు. కొండా సురేఖపై ఆయన వేసిన పరువు నష్టం పిటిషన్​పై నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఆయన విచారణకు హాజరయ్యారు. కోర్టుకు తన వాగ్మూలాన్ని వినిపించారు. ఆయనతో పాటు సాక్షిగా ఉన్న దాసోజు శ్రవణ్ స్టేట్​మెంట్​ను కోర్టు రికార్డు చేసింది. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.

నాంపల్లి కోర్టులో కేటీఆర్ వాంగ్మూలం : మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టులో కేటీఆర్ వాంగ్మూలం ఇచ్చారు. కొండా సురేఖ వ్యాఖ్యలు తనతో పాటు పార్టీకి కూడా తీవ్రంగా నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని కోర్టులో కేటీఆర్ స్టేట్​మెంట్ ఇచ్చారు. తనపై మంత్రి చేసిన కామెంట్లను చూసి సాక్షులు తనకు ఫోన్ చేశారన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని వాటిని విని షాక్ గురయ్యానని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షులు తనకు 18 ఏళ్లుగా తెలుసని వారు కూడా ఈ వ్యాఖ్యలు విని చాలా బాధపడ్డారని చెప్పారు. బాధ్యతగల మంత్రి పదవిలో ఉండి అత్యంత దిగజారుడు వ్యాఖ్యలను కొండా సురేఖ చేశారని కేటీఆర్ తన వాంగ్మూలంలో తెలిపారు.

వాగ్మూలాన్ని న్యాయమూర్తి ఎదుట చెప్పేందుకు కేటీఆర్ ఇబ్బంది పడ్డారు. పిటిషన్​లోనివి పరిగణలోకి తీసకోవాలని కోరారు. మంత్రి మాట్లాడిన మాటలు కొన్ని చెప్పలేని విధంగా తీవ్ర ఆవేదన కలిగించేలా ఉన్నాయని కోర్టుకు చెప్పారు. నేను డ్రగ్ అడిక్ట్ అని, రేవ్ పార్టీలు నిర్వహిస్తానని ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం పబ్లిసిటీ కోసమే కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారన్నారు.

సాక్షుల స్టేట్​మెంట్లను సేకరించిన కోర్టు : దాదాపు అరగంట పాటు కోర్టులో కేటీఆర్ తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. కొండా సురేఖ చేసిన కామెంట్ల వీడియోలను ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించారు. కేటీఆర్​తో పాటు సాక్షిగా ఉన్న దాసోజు శ్రావణ్ స్టేట్​మెంట్​ను కూడా కోర్టు నమోదు చేసుకుంది. మిగతా సాక్షుల స్టేట్​మెంట్ల రికార్డును ఈ నెల 30కి వాయిదా వేసింది. కేటీఆర్ కోర్టుకు హజరైన సమయంలో బీఆర్ఎస్ నేతలు అక్కడికి భారీగా చేరుకన్నారు.

బండికి కేటీఆర్​ లోగల్ నోటీసులు : మరోవైపు కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని, తన పరువుకు నష్టం కలిగేంచే వ్యాఖ్యలు చేశారని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. నిరాధార వ్యాఖ్యలకు వారం రోజుల్లో బేషరతు క్షమాపణలు చెప్పాలని, లేదంటే పరువునష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు. ఈనెల 19న బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, తాను డ్రగ్స్ తీసుకుంటానని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్టు సంజయ్‌ తనపై ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు.

'కేసీఆర్ చేసిన అప్పుల్లో ఎక్కువ భాగం వాటికే ఖర్చు చేశారు - అవన్నీ తప్పుడు ఆరోపణలు'

విద్యుత్ ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం ఫిక్సయింది : కేటీఆర్

KTR Attend Nampally Court : సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తనకు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం కలిగించాయని ఒక మహిళ పట్ల తనకున్న గౌరవంతో ఆమె చెప్పిన మాటలు తిరిగి చెప్పలేకపోతున్నానని కేటీఆర్ కోర్టుకు వివరించారు. కొండా సురేఖపై ఆయన వేసిన పరువు నష్టం పిటిషన్​పై నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఆయన విచారణకు హాజరయ్యారు. కోర్టుకు తన వాగ్మూలాన్ని వినిపించారు. ఆయనతో పాటు సాక్షిగా ఉన్న దాసోజు శ్రవణ్ స్టేట్​మెంట్​ను కోర్టు రికార్డు చేసింది. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.

నాంపల్లి కోర్టులో కేటీఆర్ వాంగ్మూలం : మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టులో కేటీఆర్ వాంగ్మూలం ఇచ్చారు. కొండా సురేఖ వ్యాఖ్యలు తనతో పాటు పార్టీకి కూడా తీవ్రంగా నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని కోర్టులో కేటీఆర్ స్టేట్​మెంట్ ఇచ్చారు. తనపై మంత్రి చేసిన కామెంట్లను చూసి సాక్షులు తనకు ఫోన్ చేశారన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని వాటిని విని షాక్ గురయ్యానని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షులు తనకు 18 ఏళ్లుగా తెలుసని వారు కూడా ఈ వ్యాఖ్యలు విని చాలా బాధపడ్డారని చెప్పారు. బాధ్యతగల మంత్రి పదవిలో ఉండి అత్యంత దిగజారుడు వ్యాఖ్యలను కొండా సురేఖ చేశారని కేటీఆర్ తన వాంగ్మూలంలో తెలిపారు.

వాగ్మూలాన్ని న్యాయమూర్తి ఎదుట చెప్పేందుకు కేటీఆర్ ఇబ్బంది పడ్డారు. పిటిషన్​లోనివి పరిగణలోకి తీసకోవాలని కోరారు. మంత్రి మాట్లాడిన మాటలు కొన్ని చెప్పలేని విధంగా తీవ్ర ఆవేదన కలిగించేలా ఉన్నాయని కోర్టుకు చెప్పారు. నేను డ్రగ్ అడిక్ట్ అని, రేవ్ పార్టీలు నిర్వహిస్తానని ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం పబ్లిసిటీ కోసమే కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారన్నారు.

సాక్షుల స్టేట్​మెంట్లను సేకరించిన కోర్టు : దాదాపు అరగంట పాటు కోర్టులో కేటీఆర్ తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. కొండా సురేఖ చేసిన కామెంట్ల వీడియోలను ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించారు. కేటీఆర్​తో పాటు సాక్షిగా ఉన్న దాసోజు శ్రావణ్ స్టేట్​మెంట్​ను కూడా కోర్టు నమోదు చేసుకుంది. మిగతా సాక్షుల స్టేట్​మెంట్ల రికార్డును ఈ నెల 30కి వాయిదా వేసింది. కేటీఆర్ కోర్టుకు హజరైన సమయంలో బీఆర్ఎస్ నేతలు అక్కడికి భారీగా చేరుకన్నారు.

బండికి కేటీఆర్​ లోగల్ నోటీసులు : మరోవైపు కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని, తన పరువుకు నష్టం కలిగేంచే వ్యాఖ్యలు చేశారని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. నిరాధార వ్యాఖ్యలకు వారం రోజుల్లో బేషరతు క్షమాపణలు చెప్పాలని, లేదంటే పరువునష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు. ఈనెల 19న బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, తాను డ్రగ్స్ తీసుకుంటానని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్టు సంజయ్‌ తనపై ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు.

'కేసీఆర్ చేసిన అప్పుల్లో ఎక్కువ భాగం వాటికే ఖర్చు చేశారు - అవన్నీ తప్పుడు ఆరోపణలు'

విద్యుత్ ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం ఫిక్సయింది : కేటీఆర్

Last Updated : 57 minutes ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.