ETV Bharat / state

'జువైనల్‌ హోమ్‌లో వేధిస్తున్నారు!' - ప్రహరీ గోడ దూకి బయటకు వచ్చిన బాలికలు - JUVENILE HOME GIRLS PROTEST

విశాఖ వ్యాలీ వద్ద ఉన్న జువైనల్ హోమ్‌ బాలికల ఆందోళన - బాలికల మానసిక పరిస్థితి సరిగా లేదన్న జువైనల్‌ హోం సూపరింటెండెంట్‌ సునీత

Juvenile Home Girls Protest at Visakhapatnam
Juvenile Home Girls Protest at Visakhapatnam (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 22, 2025, 6:56 PM IST

Updated : Jan 22, 2025, 10:43 PM IST

Juvenile Home Girls Protest at Visakha: విశాఖ వ్యాలీ పాఠశాల సమీపంలోని జువైనల్‌ హోంలోని బాలికలు ప్రహరీ గోడ దూకి బయటకు వచ్చిన ఘటన కలకలం సృష్టించింది. జువైనల్‌ హోంలో వేధిస్తున్నారని బాలికలు రోడ్డుపైకి వచ్చిన ఆందోళన చేశారు. నిద్ర మాత్రలు ఇచ్చి మానసిక రోగులుగా మారుస్తున్నారని ఆరోపించారు. జువైనల్‌ హోం నిర్వాహకుల ఫిర్యాదుతో పోలీసులు రంగప్రవేశం చేసి బాలికలను వసతి గృహంలోకి పంపారు.

చర్యలకు ఆదేశించిన హోంమంత్రి: బాలికలు ఆందోళనపై హోంశాఖ మంత్రి అనిత స్పందించారు. ఆరోపణలపై విశాఖ సీపీ, కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. మహిళా పోలీసు, తహసీల్దార్‌ నేతృత్వంలో బాలికలతో మాట్లాడాలని అనిత ఆదేశించారు. తక్షణమే విచారణ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. ఆరోపణలు వాస్తవమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

బాలికల మానసిక పరిస్థితి సరిగా లేదు: విశాఖలో జువైనల్‌ హోం ప్రహరీ గోడ దూకి కలకలం రేపిన బాలికల ఘటనపై వసతి గృహం సూపరింటెండెంట్‌ సునీత స్పందించారు. బాలికల మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లే వారు అలా ప్రవర్తించారని వివరించారు. వారు ఆరోగ్యంగా ఉండేందుకు చికిత్స అందిస్తున్నామన్నారు.

Juvenile Home Girls Protest at Visakha: విశాఖ వ్యాలీ పాఠశాల సమీపంలోని జువైనల్‌ హోంలోని బాలికలు ప్రహరీ గోడ దూకి బయటకు వచ్చిన ఘటన కలకలం సృష్టించింది. జువైనల్‌ హోంలో వేధిస్తున్నారని బాలికలు రోడ్డుపైకి వచ్చిన ఆందోళన చేశారు. నిద్ర మాత్రలు ఇచ్చి మానసిక రోగులుగా మారుస్తున్నారని ఆరోపించారు. జువైనల్‌ హోం నిర్వాహకుల ఫిర్యాదుతో పోలీసులు రంగప్రవేశం చేసి బాలికలను వసతి గృహంలోకి పంపారు.

చర్యలకు ఆదేశించిన హోంమంత్రి: బాలికలు ఆందోళనపై హోంశాఖ మంత్రి అనిత స్పందించారు. ఆరోపణలపై విశాఖ సీపీ, కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. మహిళా పోలీసు, తహసీల్దార్‌ నేతృత్వంలో బాలికలతో మాట్లాడాలని అనిత ఆదేశించారు. తక్షణమే విచారణ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. ఆరోపణలు వాస్తవమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

బాలికల మానసిక పరిస్థితి సరిగా లేదు: విశాఖలో జువైనల్‌ హోం ప్రహరీ గోడ దూకి కలకలం రేపిన బాలికల ఘటనపై వసతి గృహం సూపరింటెండెంట్‌ సునీత స్పందించారు. బాలికల మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లే వారు అలా ప్రవర్తించారని వివరించారు. వారు ఆరోగ్యంగా ఉండేందుకు చికిత్స అందిస్తున్నామన్నారు.

"ప్రిన్సిపాల్ వేధింపులు" - గురుకుల విద్యార్థుల 18 కి.మీ. పాదయాత్ర

'పురుగులు వచ్చిన మాట నిజమే' - ఏఎన్​యూ సిబ్బంది అంతా ఒకే మాట

Last Updated : Jan 22, 2025, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.