ETV Bharat / state

గణేశ్ నిమజ్జనం స్పెషల్ - 17న అర్ధరాత్రి 2గంటల వరకు మెట్రో రైళ్లు - HYDERABAD METRO TIMINGS EXTENDED

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 15, 2024, 7:07 PM IST

Updated : Sep 15, 2024, 7:28 PM IST

Hyderabad Metro Timings Extended : హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన ఉత్సవాల వేళ మెట్రో కీలక ప్రకటన చేసింది. నగరవాసుల సౌకర్యార్థం మెట్రో టైమింగ్స్‌ను పొడిగిస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 17న అర్ధరాత్రి వరకు అన్నిస్టేషన్ల నుంచి 1 గంటకు బయల్దేరి 2 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని వెల్లడించారు.

Ganesh Immersion 2024
Hyderabad Metro Timings (ETV Bharat)

Ganesh Immersion 2024 : హైదరాబాద్ మహానగరంలో గణేశ్ నిమజ్జనాల దృష్ట్యా ప్రజలకు హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 17న అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తాయని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అన్ని స్టేషన్ల నుంచి అర్ధరాత్రి 1 గంటకు బయల్దేరి 2 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని వెల్లడించారు. ఈ మేరకు హెచ్‌ఎంఆర్ఎల్, ఎల్ అండ్ టీ సీనియర్ అధికారులతో సమావేశమైన ఆయన నిమజ్జనం దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లపై సమీక్షించారు.

మెట్రోలో రద్దీ : ఈ నెలలో ఖైరతాబాద్ గణేశ్ సందర్శనతో మెట్రో రైలు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా నమోదైందని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం (సెప్టెంబరు 14వ తేదీ) ఒక్క రోజే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి 94 వేల మంది ప్రయాణించారని తెలిపారు. 39వేల మంది ఎంట్రీ, 55 వేల మంది ఎగ్జిట్​లు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్​లో నమోదైనట్లు వివరించారు.

ఖైరతాబాద్, లక్డీకాపూల్ మెట్రో స్టేషన్లలో అదనపు పోలీసులు, ప్రైవేటు భద్రతా సిబ్బందితో పర్యవేక్షిస్తున్నామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రద్దీకి అనుగుణంగా ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఖైరతాబాద్​కు వచ్చే మెట్రో ప్రయాణికులు స్వీయ క్రమశిక్షణ పాటించి మెట్రో భద్రతా సిబ్బందికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఎంఎంటీఎస్ పొడిగింపు : నగరంలో గణేశ్​ నిమజ్జనాల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే గుడ్​ న్యూస్ తెలిపింది. ఈ మేరకు ఎంఎంటీఎస్​ అదనపు ట్రిప్పులను తిప్పనున్నట్లుగా వెల్లడించింది. నిమజ్జనం రోజు నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు ఎంఎంటీఎస్​ సర్వీసులకు నడిపిస్తామని అధికారులు తెలిపారు. ఈ నెల 17,18 తేదీల్లో ఎంఎంటీఎస్​ సేవలను భక్తులు వినియోగించుకోవాలని కోరారు. 17వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 18వ తేదీ తెల్లవారుజామున 4 గంటల వరకు సర్వీసులు నడుపుతున్నట్లుగా వివరించారు.

రెండ్రోజులు వైన్స్ బంద్ : మరోవైపు బొజ్జ గణపయ్య నిమజ్జనం వేళ మద్యం దుకాణాలు మూసేయాలని పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 17 ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. మద్యం, కల్లు దుకాణాలు, బార్లు అన్నింటికీ రూల్స్​ వర్తిస్తాయని స్పష్టం చేశారు.

నిషేధంపై యూటర్న్ - ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనానికి గ్రీన్‌సిగ్నల్ - Ganesh Immersion 2024

జైజై గణేశా జై కొడతా గణేశా జయములివ్వు బొజ్జ గణేశా - రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వినాయక నవరాత్రులు - Ganesh Chaturthi Celebrations

Ganesh Immersion 2024 : హైదరాబాద్ మహానగరంలో గణేశ్ నిమజ్జనాల దృష్ట్యా ప్రజలకు హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 17న అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తాయని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అన్ని స్టేషన్ల నుంచి అర్ధరాత్రి 1 గంటకు బయల్దేరి 2 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని వెల్లడించారు. ఈ మేరకు హెచ్‌ఎంఆర్ఎల్, ఎల్ అండ్ టీ సీనియర్ అధికారులతో సమావేశమైన ఆయన నిమజ్జనం దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లపై సమీక్షించారు.

మెట్రోలో రద్దీ : ఈ నెలలో ఖైరతాబాద్ గణేశ్ సందర్శనతో మెట్రో రైలు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా నమోదైందని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం (సెప్టెంబరు 14వ తేదీ) ఒక్క రోజే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి 94 వేల మంది ప్రయాణించారని తెలిపారు. 39వేల మంది ఎంట్రీ, 55 వేల మంది ఎగ్జిట్​లు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్​లో నమోదైనట్లు వివరించారు.

ఖైరతాబాద్, లక్డీకాపూల్ మెట్రో స్టేషన్లలో అదనపు పోలీసులు, ప్రైవేటు భద్రతా సిబ్బందితో పర్యవేక్షిస్తున్నామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రద్దీకి అనుగుణంగా ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఖైరతాబాద్​కు వచ్చే మెట్రో ప్రయాణికులు స్వీయ క్రమశిక్షణ పాటించి మెట్రో భద్రతా సిబ్బందికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఎంఎంటీఎస్ పొడిగింపు : నగరంలో గణేశ్​ నిమజ్జనాల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే గుడ్​ న్యూస్ తెలిపింది. ఈ మేరకు ఎంఎంటీఎస్​ అదనపు ట్రిప్పులను తిప్పనున్నట్లుగా వెల్లడించింది. నిమజ్జనం రోజు నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు ఎంఎంటీఎస్​ సర్వీసులకు నడిపిస్తామని అధికారులు తెలిపారు. ఈ నెల 17,18 తేదీల్లో ఎంఎంటీఎస్​ సేవలను భక్తులు వినియోగించుకోవాలని కోరారు. 17వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 18వ తేదీ తెల్లవారుజామున 4 గంటల వరకు సర్వీసులు నడుపుతున్నట్లుగా వివరించారు.

రెండ్రోజులు వైన్స్ బంద్ : మరోవైపు బొజ్జ గణపయ్య నిమజ్జనం వేళ మద్యం దుకాణాలు మూసేయాలని పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 17 ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. మద్యం, కల్లు దుకాణాలు, బార్లు అన్నింటికీ రూల్స్​ వర్తిస్తాయని స్పష్టం చేశారు.

నిషేధంపై యూటర్న్ - ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనానికి గ్రీన్‌సిగ్నల్ - Ganesh Immersion 2024

జైజై గణేశా జై కొడతా గణేశా జయములివ్వు బొజ్జ గణేశా - రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వినాయక నవరాత్రులు - Ganesh Chaturthi Celebrations

Last Updated : Sep 15, 2024, 7:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.