ETV Bharat / state

తెలంగాణలో QR కోడ్​ విధానం - ఒక్క క్లిక్​తో కరెంట్ బిల్లు కట్టేయొచ్చు! - CURRENT BILL PAYMENT

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 5, 2024, 4:34 PM IST

Electricity Bill Payment With QR Code System : ఇంతకుముందు కరెంట్ బిల్లు కట్టాలంటే విద్యుత్ కార్యాలయాలకు వెళ్లి కట్టేవాళ్లు. ఆ తర్వాత ఆన్​లైన్, అనంతరం డిజిటల్ పేమెంట్స్ వచ్చాయి. ఇక ఇటీవల గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్ ద్వారా విద్యుత్ బిల్లు చెల్లింపులు నిలిపివేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో నూతన విధానాన్ని తెరపైకి తీసుకువచ్చింది ఉత్తర తెలంగాణ డిస్కం. అదే క్యూఆర్ కోడ్ పద్ధతి. మరి క్యూఆర్ కోడ్​తో కరెంట్ బిల్లు ఎలా కట్టాలంటే?

current_bill_payment
current_bill_payment (ETV Bharat)

Current Bill Payment With QR Code System in Telangana: జులై 1వ తేదీన థర్డ్​ పార్టీ పేమెంట్​ యాప్స్​ నుంచి బిల్లులను చెల్లించడం నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విద్యుత్​ బిల్లులను చెల్లించే వినియోగదారులకు (ఉత్తర తెలంగాణ) విద్యుత్​ పంపిణీ సంస్థ గుడ్​ న్యూస్​ చెప్పింది. పేమెంట్​ యాప్స్​ స్థానంలో కొత్తగా ఇంటి వద్ద నుంచే బిల్లులు చెల్లించే వెసులుబాటును కల్పించారు. అదే క్యూఆర్​ కోడ్​ విధానం. ఇంటి వద్ద మీటర్​ రీడింగ్​ తీసినప్పుడు బిల్లు కింద ఈ క్యూఆర్​ కోడ్​ను ఇస్తారు. దాని ద్వారా మీకు నచ్చిన పేమెంట్​ యాప్​ ద్వారా విద్యుత్​ బిల్లును చెల్లించే వెసులుబాటును విద్యుత్​ పంపిణీ సంస్థ తీసుకువచ్చింది.

ముందుగా ఇళ్లలో మీటర్ల నుంచి రీడింగ్​ తీశాక వచ్చే బిల్లు కిందే క్యూఆర్​ కోడ్​ ముద్రించి ఉంటుంది. వినియోగదారులు తమ మొబైల్స్​ ద్వారా క్యూఆర్​ కోడ్​ను స్కాన్​ చేసి డెబిట్, క్రెడిట్​ కార్డులు, యూపీఐ, నెట్​ బ్యాంకింగ్​ తదితర విధానాల్లో బిల్లులను చెల్లించే వెసులుబాటును ఎన్పీడీసీఎల్​ తీసుకువచ్చింది. ఇలా ఈజీగా బిల్లులను చెల్లించేలా ఏర్పాట్లు చేసింది.

ఇలా క్యూఆర్​ కోడ్​ ద్వారా విద్యుత్​ బిల్లును చెల్లించే వెసులుబాటును ముందుగా ఎన్పీడీసీఎల్​ పైలట్​ ప్రాజెక్టుగా కొన్ని విద్యుత్​ రెవెన్యూ కార్యాలయాల(ఈఆర్​వో) పరిధిలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. అక్కడ వచ్చిన ఫలితాల ఆధారంగా దశలవారీగా డిస్కంల పరిధిలోని అన్ని జిల్లాల్లో క్యూఆర్​ కోడ్​ బిల్లులు రానున్నాయని అధికారులు తెలిపారు. ఈ విధానంగా పూర్తిస్థాయిలో అమలైతే వినియోదారుడికి విద్యుత్​ బిల్లుల చెల్లింపులో ఎలాంటి ఆటంకం ఏర్పడదు. ఇప్పటికే విద్యుత్​ వినియోగదారులు విద్యుత్​ సంస్థ యాప్​, వెబ్​సైట్​లలో బిల్లులను చెల్లిస్తున్నారు. ఇప్పుడు వాటికి క్యూఆర్​ సిస్టమ్ అదనం.

థర్డ్​ పార్టీ యాప్​ ద్వారా కరెంటు బిల్లు చెల్లింపులు నిలిపివేత : జులై 1వ తేదీన విద్యుత్​ పంపిణీ సంస్థలు ఫోన్​ పే, పేటీఎం, అమెజాన్​ పే వంటి థర్డ్​ పార్టీ యాప్స్​ ద్వారా విద్యుత్​ బిల్లులను చెల్లించే విధానాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం జులై 1 నుంచి ఆయా సంస్థలు విద్యుత్​ బిల్లుల చెల్లింపులను నిలిపివేశాయి. ఇక నుంచి డిస్కం వెబ్​సైట్​ లేదా టీజీఎస్పీడీసీఎల్​ మొబైల్​ యాప్​లో కరెంటు బిల్లులు చెల్లించాలని వినియోగదారులకు ముఖ్య గమనికను చేరవేసింది. ఈ చెల్లింపులు గత సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి.

మంచి స్నేహితుడి ఎంపిక మీ చేతిలోనే! - How to Choose A Good Friend

మచిలీపట్నంలో రూ.60వేల కోట్లతో బీపీసీఎల్‌ రిఫైనరీ - త్వరలోనే అధికారిక ప్రకటన - Chandrababu Meet Central Ministers

రూ.755 చెల్లిస్తే చాలు రూ.15 లక్షల ఇన్సూరెన్స్ - కుటుంబానికి అండగా తపాలా జీవిత బీమా! - Postal Life Insurance

Current Bill Payment With QR Code System in Telangana: జులై 1వ తేదీన థర్డ్​ పార్టీ పేమెంట్​ యాప్స్​ నుంచి బిల్లులను చెల్లించడం నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విద్యుత్​ బిల్లులను చెల్లించే వినియోగదారులకు (ఉత్తర తెలంగాణ) విద్యుత్​ పంపిణీ సంస్థ గుడ్​ న్యూస్​ చెప్పింది. పేమెంట్​ యాప్స్​ స్థానంలో కొత్తగా ఇంటి వద్ద నుంచే బిల్లులు చెల్లించే వెసులుబాటును కల్పించారు. అదే క్యూఆర్​ కోడ్​ విధానం. ఇంటి వద్ద మీటర్​ రీడింగ్​ తీసినప్పుడు బిల్లు కింద ఈ క్యూఆర్​ కోడ్​ను ఇస్తారు. దాని ద్వారా మీకు నచ్చిన పేమెంట్​ యాప్​ ద్వారా విద్యుత్​ బిల్లును చెల్లించే వెసులుబాటును విద్యుత్​ పంపిణీ సంస్థ తీసుకువచ్చింది.

ముందుగా ఇళ్లలో మీటర్ల నుంచి రీడింగ్​ తీశాక వచ్చే బిల్లు కిందే క్యూఆర్​ కోడ్​ ముద్రించి ఉంటుంది. వినియోగదారులు తమ మొబైల్స్​ ద్వారా క్యూఆర్​ కోడ్​ను స్కాన్​ చేసి డెబిట్, క్రెడిట్​ కార్డులు, యూపీఐ, నెట్​ బ్యాంకింగ్​ తదితర విధానాల్లో బిల్లులను చెల్లించే వెసులుబాటును ఎన్పీడీసీఎల్​ తీసుకువచ్చింది. ఇలా ఈజీగా బిల్లులను చెల్లించేలా ఏర్పాట్లు చేసింది.

ఇలా క్యూఆర్​ కోడ్​ ద్వారా విద్యుత్​ బిల్లును చెల్లించే వెసులుబాటును ముందుగా ఎన్పీడీసీఎల్​ పైలట్​ ప్రాజెక్టుగా కొన్ని విద్యుత్​ రెవెన్యూ కార్యాలయాల(ఈఆర్​వో) పరిధిలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. అక్కడ వచ్చిన ఫలితాల ఆధారంగా దశలవారీగా డిస్కంల పరిధిలోని అన్ని జిల్లాల్లో క్యూఆర్​ కోడ్​ బిల్లులు రానున్నాయని అధికారులు తెలిపారు. ఈ విధానంగా పూర్తిస్థాయిలో అమలైతే వినియోదారుడికి విద్యుత్​ బిల్లుల చెల్లింపులో ఎలాంటి ఆటంకం ఏర్పడదు. ఇప్పటికే విద్యుత్​ వినియోగదారులు విద్యుత్​ సంస్థ యాప్​, వెబ్​సైట్​లలో బిల్లులను చెల్లిస్తున్నారు. ఇప్పుడు వాటికి క్యూఆర్​ సిస్టమ్ అదనం.

థర్డ్​ పార్టీ యాప్​ ద్వారా కరెంటు బిల్లు చెల్లింపులు నిలిపివేత : జులై 1వ తేదీన విద్యుత్​ పంపిణీ సంస్థలు ఫోన్​ పే, పేటీఎం, అమెజాన్​ పే వంటి థర్డ్​ పార్టీ యాప్స్​ ద్వారా విద్యుత్​ బిల్లులను చెల్లించే విధానాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం జులై 1 నుంచి ఆయా సంస్థలు విద్యుత్​ బిల్లుల చెల్లింపులను నిలిపివేశాయి. ఇక నుంచి డిస్కం వెబ్​సైట్​ లేదా టీజీఎస్పీడీసీఎల్​ మొబైల్​ యాప్​లో కరెంటు బిల్లులు చెల్లించాలని వినియోగదారులకు ముఖ్య గమనికను చేరవేసింది. ఈ చెల్లింపులు గత సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి.

మంచి స్నేహితుడి ఎంపిక మీ చేతిలోనే! - How to Choose A Good Friend

మచిలీపట్నంలో రూ.60వేల కోట్లతో బీపీసీఎల్‌ రిఫైనరీ - త్వరలోనే అధికారిక ప్రకటన - Chandrababu Meet Central Ministers

రూ.755 చెల్లిస్తే చాలు రూ.15 లక్షల ఇన్సూరెన్స్ - కుటుంబానికి అండగా తపాలా జీవిత బీమా! - Postal Life Insurance

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.