ETV Bharat / state

హైదరాబాద్​లో దంచికొట్టిన వాన - ప్రధాన రహదారులన్నీ జలమయం - Heavy Rains in Hyderabad

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Updated : 1 hours ago

Heavy Rain in Hyderabad : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. వరద నీటితో రహదారులన్నీ జలమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది రోడ్లపై నీళ్లు నిలవకుండా క్లియర్ చేస్తున్నారు.

Hyderabad Rains
Heavy Rains in Hyderabad (ETV Bharat)

HYDERABAD HIT BY HEAVY RAIN TODAY : ఉదయం నుంచి భానుడి ప్రతాపంతో అల్లాడిపోయిన హైదరాాబాద్ నగరవాసులకు ఒక్కసారిగా వాతావరణం చల్లబడి భారీగా వర్షం పడింది. తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపై వరద నీరు చేరడంతో ప్రధాన రహదారులు చిన్నపాటి చెరువులు, కాలువలను తలపిస్తున్నాయి. జీహెచ్​ఎంసీ, డీఆర్​ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వరద నీటిని నాలాల్లోకి మళ్లిస్తున్నారు.

మరోవైపు ఎల్​బీనగర్, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట్‌, ముషీరాబాద్‌, చంపాపేట్‌, సైదాబాద్‌, సరూర్‌నగర్‌, కోఠి, సుల్తాన్‌బజార్, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముసారాంబాగ్ వంతెనను వరద తాకుకుంటూ ఉప్పొంగి ప్రవహిస్తోంది. అప్రమత్తమైన అధికారులు వంతెనపై రాకపోకలు నిలిపేశారు. ఇరువైపులా భారీగా ట్రాఫిక్​జాం అయ్యింది. బేగంబజార్, అబిడ్స్‌, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నూమ, చార్మినార్‌, బహదూర్‌పుర, ఉప్పుగూడ, నాంపల్లి, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్‌, నారాయణగూడ, బోయిన్‌పల్లి, అల్వాల్, చిలకలగూడ, మేడ్చల్, దుండిగల్, గండిమైసమ్మ, మల్లంపేటలో వర్షం దంచి కొట్టింది. రోడ్లపై వాన నీరు చేరడంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు.

సీపీ ఆనంద్ అత్యవసర సమావేశం : వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో హైదరబాద్ సీపీ సీవీ ఆనంద్ అత్యవసర సమీక్ష నిర్వహించారు. నగరంలో అధికార యంత్రాంగమంతా వేగంగా స్పందించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. కీలకమైన కూడళ్లలో వరదనీరు, ట్రాఫిక్ క్రమబద్దీకరణ చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి, మూడు కమిషనరేట్ల సీపీలు, మున్సిపల్​శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్, హెచ్‌ఎండీఏ, హైడ్రా అధికారులు పాల్గొన్నారు.

ప్రజలకు ఎప్పటికప్పుడు ఐఎండీ హెచ్చరికలు, ట్రాఫిక్ జామ్ అప్టేడ్స్ అందించాలని కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. నగరంలో ట్రాఫిక్ మేనేజ్​మెంట్​పై దీర్ఘకాలిక ఫలితాలిచ్చే చర్యలు చేపట్టాలని తెలిపిన అధికారులు, ట్రై పోలీస్ కమిషనరేట్లు, జీహెచ్​ఎంసీ ఇతర విభాగాల ట్రాఫిక్ కమిషనర్‌లతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నగరంలో వర్షాలు కురుస్తున్న వేళ ఐటీ కంపెనీలతో అనుసంధానం చేయడం, ప్రధాన నీటి వనరులలో నీటి మట్టాలను పర్యవేక్షించడం, సాంకేతికతను పెంచడం వంటి అంశాలపై అధికారులు చర్చించారు.

రెయిన్ అలర్ట్ - ఉపరితల ఆవర్తనంతో రాగల రెండు రోజులు భారీ వర్షాలు

వర్షం పడితే వణుకే : బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న ఆ ఊరు ప్రజలు - Flood Affects in Telangana

HYDERABAD HIT BY HEAVY RAIN TODAY : ఉదయం నుంచి భానుడి ప్రతాపంతో అల్లాడిపోయిన హైదరాాబాద్ నగరవాసులకు ఒక్కసారిగా వాతావరణం చల్లబడి భారీగా వర్షం పడింది. తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపై వరద నీరు చేరడంతో ప్రధాన రహదారులు చిన్నపాటి చెరువులు, కాలువలను తలపిస్తున్నాయి. జీహెచ్​ఎంసీ, డీఆర్​ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వరద నీటిని నాలాల్లోకి మళ్లిస్తున్నారు.

మరోవైపు ఎల్​బీనగర్, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట్‌, ముషీరాబాద్‌, చంపాపేట్‌, సైదాబాద్‌, సరూర్‌నగర్‌, కోఠి, సుల్తాన్‌బజార్, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముసారాంబాగ్ వంతెనను వరద తాకుకుంటూ ఉప్పొంగి ప్రవహిస్తోంది. అప్రమత్తమైన అధికారులు వంతెనపై రాకపోకలు నిలిపేశారు. ఇరువైపులా భారీగా ట్రాఫిక్​జాం అయ్యింది. బేగంబజార్, అబిడ్స్‌, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నూమ, చార్మినార్‌, బహదూర్‌పుర, ఉప్పుగూడ, నాంపల్లి, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్‌, నారాయణగూడ, బోయిన్‌పల్లి, అల్వాల్, చిలకలగూడ, మేడ్చల్, దుండిగల్, గండిమైసమ్మ, మల్లంపేటలో వర్షం దంచి కొట్టింది. రోడ్లపై వాన నీరు చేరడంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు.

సీపీ ఆనంద్ అత్యవసర సమావేశం : వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో హైదరబాద్ సీపీ సీవీ ఆనంద్ అత్యవసర సమీక్ష నిర్వహించారు. నగరంలో అధికార యంత్రాంగమంతా వేగంగా స్పందించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. కీలకమైన కూడళ్లలో వరదనీరు, ట్రాఫిక్ క్రమబద్దీకరణ చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి, మూడు కమిషనరేట్ల సీపీలు, మున్సిపల్​శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్, హెచ్‌ఎండీఏ, హైడ్రా అధికారులు పాల్గొన్నారు.

ప్రజలకు ఎప్పటికప్పుడు ఐఎండీ హెచ్చరికలు, ట్రాఫిక్ జామ్ అప్టేడ్స్ అందించాలని కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. నగరంలో ట్రాఫిక్ మేనేజ్​మెంట్​పై దీర్ఘకాలిక ఫలితాలిచ్చే చర్యలు చేపట్టాలని తెలిపిన అధికారులు, ట్రై పోలీస్ కమిషనరేట్లు, జీహెచ్​ఎంసీ ఇతర విభాగాల ట్రాఫిక్ కమిషనర్‌లతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నగరంలో వర్షాలు కురుస్తున్న వేళ ఐటీ కంపెనీలతో అనుసంధానం చేయడం, ప్రధాన నీటి వనరులలో నీటి మట్టాలను పర్యవేక్షించడం, సాంకేతికతను పెంచడం వంటి అంశాలపై అధికారులు చర్చించారు.

రెయిన్ అలర్ట్ - ఉపరితల ఆవర్తనంతో రాగల రెండు రోజులు భారీ వర్షాలు

వర్షం పడితే వణుకే : బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న ఆ ఊరు ప్రజలు - Flood Affects in Telangana

Last Updated : 1 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.