ETV Bharat / state

రాష్ట్రాన్ని ముంచెత్తిన వర్షాలు - వరదనీటిలో మునిగిన పంటలు - Rains Effects In Telangana

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 22, 2024, 10:57 PM IST

Heavy Rains Effect In Telangana : రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాలకు రెడ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే వారం రోజులుగా కురుస్తున్న కుండపోత వానలతో వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల దాటికి అనేక చోట్ల రహదారులు తెగిపోయి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితులలో తప్ప ప్రజలెవరూ కూడా బయటికి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Heavy Rain Impacts in Telangana
Heavy Rains Effect In Telangana (ETV Bharat)

Heavy Rain Impacts in Telangana : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సుల్తాన్‌పూర్ - గోరుకొత్తపల్లి గ్రామాల మధ్య చేపట్టిన నిర్మాణ పనులు కొట్టుకుపోయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాయపర్తి మండలం జయరాం తండాలో వర్షపు నీటితో రోడ్లు బురదమయంగా మారాయి. దీంతో మట్టి రోడ్లపై వరి నాట్లు వేసి స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్ల పరిస్థితిపై పాలకులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా పరకాల చలివాగు అలుగు పారుతోంది. వరద దాటికి చలివాగు బ్రిడ్జి పిల్లర్ వద్ద మట్టి కొట్టుకుపోయి పెద్ద గుంత ఏర్పడగా జిల్లా కలెక్టర్ అధికారులతో పరిశీలించారు.

పొలాల్లోకి వరద నీరు : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని దుబ్బపల్లిలో మోరంచవాగు ఉద్ధృతి కొనసాగుతోంది. రేగొండ మండలం తిరుమలగిరిలోని పాండవులగుట్ట పై నుంచి వరద జలపాతంలా కిందకు దూకుతుంది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి చెరువులు, కుంటలు నిండుకున్నాయి. చెన్నూర్, కోటపల్లి మండలాల గుండా ప్రవహించే ప్రాణహిత, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. నదీ ఉద్ధృతికి పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో వందలాది ఎకరాల పత్తిపంట నీటి మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

అనారోగ్యాలకు గురవుతున్న చిన్నారులు : ప్రాణహిత నది ప్రవాహం అదనుగా చేసుకుని దొంగలు టేకు దుంగలను తెప్పలుగా మార్చారు. అధికారుల కళ్లుగప్పి తరలించేందుకు నదిలో వేశారు. అంతలోపే అప్రమత్తమైన అధికారులు మూడున్నర లక్షల రూపాయల విలువైన టేకు కలపను స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి జిల్లా అర్లపెంట పంచాయతీ కిస్తారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు, వాగులు పొంగిపొర్లడంతో అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు 20 కిలోమీటర్లు అడవిలో మోసుకెళ్లాల్సి వచ్చింది.

సిద్దిపేట జిల్లా చందాపూర్ శివారులో కూడవెల్లి వాగు మత్తడి అలుగు పారుతోంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ వ్యాప్తంగా పంట పొలాలు నీట మునగడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లా రుద్రూరు మండలం అంబెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో వర్షపు నీరు చేరి, విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. నీరు నిలవడంతో అనారోగ్యాల బారిన పడుతున్నారని చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎడతెరిపి లేకుండా వానలు - వరద ఉద్ధృతికి మునిగిపోతున్న పంట పొలాలు - Rains impact In Telangana

చెట్టెక్కితేనే ఆ గూడేనికి చేరిక - ఏళ్ల తరబడి గిరిజనుల సాహసం - Tribes Suffering With Floods

Heavy Rain Impacts in Telangana : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సుల్తాన్‌పూర్ - గోరుకొత్తపల్లి గ్రామాల మధ్య చేపట్టిన నిర్మాణ పనులు కొట్టుకుపోయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాయపర్తి మండలం జయరాం తండాలో వర్షపు నీటితో రోడ్లు బురదమయంగా మారాయి. దీంతో మట్టి రోడ్లపై వరి నాట్లు వేసి స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్ల పరిస్థితిపై పాలకులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా పరకాల చలివాగు అలుగు పారుతోంది. వరద దాటికి చలివాగు బ్రిడ్జి పిల్లర్ వద్ద మట్టి కొట్టుకుపోయి పెద్ద గుంత ఏర్పడగా జిల్లా కలెక్టర్ అధికారులతో పరిశీలించారు.

పొలాల్లోకి వరద నీరు : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని దుబ్బపల్లిలో మోరంచవాగు ఉద్ధృతి కొనసాగుతోంది. రేగొండ మండలం తిరుమలగిరిలోని పాండవులగుట్ట పై నుంచి వరద జలపాతంలా కిందకు దూకుతుంది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి చెరువులు, కుంటలు నిండుకున్నాయి. చెన్నూర్, కోటపల్లి మండలాల గుండా ప్రవహించే ప్రాణహిత, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. నదీ ఉద్ధృతికి పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో వందలాది ఎకరాల పత్తిపంట నీటి మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

అనారోగ్యాలకు గురవుతున్న చిన్నారులు : ప్రాణహిత నది ప్రవాహం అదనుగా చేసుకుని దొంగలు టేకు దుంగలను తెప్పలుగా మార్చారు. అధికారుల కళ్లుగప్పి తరలించేందుకు నదిలో వేశారు. అంతలోపే అప్రమత్తమైన అధికారులు మూడున్నర లక్షల రూపాయల విలువైన టేకు కలపను స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి జిల్లా అర్లపెంట పంచాయతీ కిస్తారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు, వాగులు పొంగిపొర్లడంతో అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు 20 కిలోమీటర్లు అడవిలో మోసుకెళ్లాల్సి వచ్చింది.

సిద్దిపేట జిల్లా చందాపూర్ శివారులో కూడవెల్లి వాగు మత్తడి అలుగు పారుతోంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ వ్యాప్తంగా పంట పొలాలు నీట మునగడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లా రుద్రూరు మండలం అంబెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో వర్షపు నీరు చేరి, విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. నీరు నిలవడంతో అనారోగ్యాల బారిన పడుతున్నారని చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎడతెరిపి లేకుండా వానలు - వరద ఉద్ధృతికి మునిగిపోతున్న పంట పొలాలు - Rains impact In Telangana

చెట్టెక్కితేనే ఆ గూడేనికి చేరిక - ఏళ్ల తరబడి గిరిజనుల సాహసం - Tribes Suffering With Floods

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.