ETV Bharat / state

హుస్సేన్‌సాగర్‌లోనే వినాయక నిమజ్జనాలు - ప్లాన్​ రెడీ చేసిన అధికారులు - Ganesh Immersion in Tank Bund

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2024, 9:26 AM IST

GHMC on Ganesh Immersion : హుస్సేన్‌సాగర్‌ వద్ద గణేశ్‌ విగ్రహాల నిమజ్జనాలపై జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖ అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. రద్దీ తక్కువ ఉంటే ట్యాంక్‌బండ్‌కు నిమజ్జన వేడుక నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కొన్ని షరతులు విధిస్తూ పలు మార్గదర్శకాలను జారీ చేసింది.

Ganesh Immersion in Hussain Sagar
GHMC on Ganesh Immersion (ETV Bharat)

Ganesh Immersion in Hussain Sagar : హుస్సేన్‌సాగర్‌ వద్ద బొజ్జ గణపయ్య నిమజ్జనాలపై జీహెచ్​ఎంసీ, పోలీస్​ శాఖ ఓ నిర్ణయానికి వచ్చాయి. హుస్సేన్‌సాగర్‌​లో నిమజ్జనానికి వచ్చే వినాయక విగ్రహాల సంఖ్యకు తగ్గట్లుగా అప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకునే ప్రణాళికకు అధికారులు జై కొట్టారు. రద్దీ తక్కువ ఉంటే ట్యాంక్‌బండ్‌కు నిమజ్జన వేడుక నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులు గురువారం ఎన్టీఆర్​ మార్గ్​లో ఏర్పాటు చేసిన నాలుగు క్రేన్లను తొలగించారు. ఖైరతాబాద్​ నుంచి సచివాలయం వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం కలగొద్దనే ఆ క్రేన్లను నెక్లెస్​ రోడ్డుకు మళ్లించామని తెలిపారు.

మార్గదర్శకాలివే..

  • వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.
  • వినాయక విగ్రహాలను జలాశయాల్లో కాకుండా స్థానికంగా తాత్కాలిక కొలనులు ఏర్పాటు చేసుకొని నిమజ్జనం చేయాలి. దీనివల్ల ఉత్పత్తయిన వ్యర్థాలను స్థానిక సంస్థలు 24 గంటల్లోపు తరలించాలి.
  • గణేశ్‌ విగ్రహాల నిమజ్జనం వేళ సైన్‌బోర్డులు, అగ్నిమాపక పరికరాలు, బారికేడ్లు ఏర్పాటు చేయాలి.
  • వ్యర్థాల సేకరణ కోసం ప్రతి కొలను, జలాశయం వద్ద కేంద్రాలను ఏర్పాటు చేయాలి. పూజా, ఇతర వ్యర్థాలను గణేశ్‌ నిమజ్జనానికి ముందే సేకరించాలి.
  • వినాయక నిమజ్జన సమయంలో కాలుష్యమైన రంగులు వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తాత్కాలిక కొలను వద్ద వ్యర్థ జలాలను వెంటనే ఎస్టీపీలకు తరలించి శుద్ధి చేయాలి.

విద్యుత్తు దీపాలను పరిశీలించాలి : నగరంలో గణేశ్​ నిమజ్జన వేడుకల సందర్భంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన విద్యుత్​ దీపాలను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ప్రభుత్వం రహదారులు, భవనాల శాఖ చీఫ్​ ఎలక్ట్రికల్​ ఇంజినీర్​ లింగారెడ్డి అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. మరోవైపు హుస్సేన్​సాగర్​లో, నెక్లెస్​రోడ్​లో ఏర్పాటు చేసిన కొలనులో పేరుకుపోయిన వ్యర్థాలను ఇప్పటికే జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు తొలిగించి ఎప్పటికప్పుడు వాహనాల ద్వారా డంపింగ్ యార్డ్​కు తరలిస్తున్నారు.

ఈ విధంగా హుస్సేన్​సాగర్​లో క్లీనింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సాగర్​లోని వ్యర్థాలను తొలగించే బాధ్యతను హెచ్‌ఎండీఏ, రోడ్లను శుభ్రం చేసే బాధ్యతను జీఎచ్ఎం​సీ తీసుకుని పనులు మొదలుపెట్టాయి. ప్రకృతికి హాని కలిగించే గణేశ్​ విగ్రహాలను హుస్సేన్​సాగర్​లో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

హుస్సేన్‌సాగర్‌లో గణపయ్య నిమజ్జనం - హైకోర్టు కండిషన్స్ ఇవే - Hussain Sagar Ganesh Immersion

హైదరాబాద్‌లో ఈనెల 10 నుంచి గణేశ్‌ నిమజ్జనాలు - ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Ganesh Immersion in Hussain Sagar : హుస్సేన్‌సాగర్‌ వద్ద బొజ్జ గణపయ్య నిమజ్జనాలపై జీహెచ్​ఎంసీ, పోలీస్​ శాఖ ఓ నిర్ణయానికి వచ్చాయి. హుస్సేన్‌సాగర్‌​లో నిమజ్జనానికి వచ్చే వినాయక విగ్రహాల సంఖ్యకు తగ్గట్లుగా అప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకునే ప్రణాళికకు అధికారులు జై కొట్టారు. రద్దీ తక్కువ ఉంటే ట్యాంక్‌బండ్‌కు నిమజ్జన వేడుక నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులు గురువారం ఎన్టీఆర్​ మార్గ్​లో ఏర్పాటు చేసిన నాలుగు క్రేన్లను తొలగించారు. ఖైరతాబాద్​ నుంచి సచివాలయం వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం కలగొద్దనే ఆ క్రేన్లను నెక్లెస్​ రోడ్డుకు మళ్లించామని తెలిపారు.

మార్గదర్శకాలివే..

  • వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.
  • వినాయక విగ్రహాలను జలాశయాల్లో కాకుండా స్థానికంగా తాత్కాలిక కొలనులు ఏర్పాటు చేసుకొని నిమజ్జనం చేయాలి. దీనివల్ల ఉత్పత్తయిన వ్యర్థాలను స్థానిక సంస్థలు 24 గంటల్లోపు తరలించాలి.
  • గణేశ్‌ విగ్రహాల నిమజ్జనం వేళ సైన్‌బోర్డులు, అగ్నిమాపక పరికరాలు, బారికేడ్లు ఏర్పాటు చేయాలి.
  • వ్యర్థాల సేకరణ కోసం ప్రతి కొలను, జలాశయం వద్ద కేంద్రాలను ఏర్పాటు చేయాలి. పూజా, ఇతర వ్యర్థాలను గణేశ్‌ నిమజ్జనానికి ముందే సేకరించాలి.
  • వినాయక నిమజ్జన సమయంలో కాలుష్యమైన రంగులు వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తాత్కాలిక కొలను వద్ద వ్యర్థ జలాలను వెంటనే ఎస్టీపీలకు తరలించి శుద్ధి చేయాలి.

విద్యుత్తు దీపాలను పరిశీలించాలి : నగరంలో గణేశ్​ నిమజ్జన వేడుకల సందర్భంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన విద్యుత్​ దీపాలను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ప్రభుత్వం రహదారులు, భవనాల శాఖ చీఫ్​ ఎలక్ట్రికల్​ ఇంజినీర్​ లింగారెడ్డి అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. మరోవైపు హుస్సేన్​సాగర్​లో, నెక్లెస్​రోడ్​లో ఏర్పాటు చేసిన కొలనులో పేరుకుపోయిన వ్యర్థాలను ఇప్పటికే జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు తొలిగించి ఎప్పటికప్పుడు వాహనాల ద్వారా డంపింగ్ యార్డ్​కు తరలిస్తున్నారు.

ఈ విధంగా హుస్సేన్​సాగర్​లో క్లీనింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సాగర్​లోని వ్యర్థాలను తొలగించే బాధ్యతను హెచ్‌ఎండీఏ, రోడ్లను శుభ్రం చేసే బాధ్యతను జీఎచ్ఎం​సీ తీసుకుని పనులు మొదలుపెట్టాయి. ప్రకృతికి హాని కలిగించే గణేశ్​ విగ్రహాలను హుస్సేన్​సాగర్​లో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

హుస్సేన్‌సాగర్‌లో గణపయ్య నిమజ్జనం - హైకోర్టు కండిషన్స్ ఇవే - Hussain Sagar Ganesh Immersion

హైదరాబాద్‌లో ఈనెల 10 నుంచి గణేశ్‌ నిమజ్జనాలు - ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.