ETV Bharat / state

పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ విదేశీయుడు - సంధ్య ఆక్వా పరిశ్రమకు రావటంపై అనుమానాలు - Foreigner Caught with Cash

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 26, 2024, 9:05 AM IST

Foreigner Caught with Cash During Police Check: పోలీసుల తనిఖీల్లో నగదుతో విదేశీయుడు పట్టుబడ్డాడు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ డ్రగ్స్​ కేసుతో సంబంధం ఉన్న సంధ్య ఆక్వా పరిశ్రమకు అతడు రావటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Foreigner_Caught_with_Cash_During_Police_Check
Foreigner_Caught_with_Cash_During_Police_Check

Foreigner Caught with Cash During Police Check : ఎన్నికలు సమీపిస్తున్న వేళ నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, మద్యం ఇతరత్రా అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో జిల్లాల సరిహద్దుల్లో తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో లక్షా 30 వేల రూపాయల నగదును ఓ విదేశీయుడి బ్యాగ్​లో పోలీసులు గుర్తించారు. అయితే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న సంధ్య ఆక్వా పరిశ్రమకు అతడు వచ్చినట్లు సమాచారం.

తిరుగు ప్రయాణంలో అతడిని యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ ప్రధాన కూడలి వద్ద పోలీసులు పట్టుకున్నారు. దీంతో విషయం తెలుసుకున్న సంధ్య ఆక్వా పరిశ్రమ ప్రతినిధులు ఉప్పాడకు చేరుకుని పోలీసు అధికారులతో మాట్లాడి విదేశీయుడిని పంపించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అతడు వియత్నాం దేశానికి చెందిన టాంగ్​గా పోలీసులు గుర్తించారు. అయితే నగదును సీజ్​ చేసి ఎన్నికల కమిషనర్​కు పంపుతున్నట్లు ఫ్లైయింగ్ స్క్వాడ్ నారాయణ దాసు తెలిపారు. కాగా డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న పరిశ్రమకు విదేశీయుడు రావడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

'స్టేషన్‌కు వస్తావా ? రావా ? కాల్చి పడేస్తా' - టీడీపీ నేతకు కారంపూడి సీఐ బెదిరింపు - Karempudi CI Warning to TDP Leader

Police Checks on Sandhya Aqua Industry Bus: విశాఖ పోర్టులో భారీగా డ్రగ్స్‌ పట్టుబడిన వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరుగుతున్న వేళ సంధ్య ఆక్వాకు చెందిన బస్సు ఒకటి కొత్త మూలపేట ఎస్సీజెడ్ కాలనీలో కనిపించడం కలకలం రేపింది. నాలుగు రోజులుగా అక్కడే సంధ్య ఆక్వా పరిశ్రమకు చెందిన బస్సు ఉండటంతో స్థానికులు ఆందోళన చెందారు.

బస్సును ఎవరు అక్కడ పెట్టారో అందులో ఏముందో తెలియక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు సంధ్య ఆక్వా పరిశ్రమకు చెందిన దస్త్రాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను గుర్తించారు. అయితే తనిఖీల తర్వాత బస్సులో ఉన్న కీలక దస్త్రాలను సీబీఐకి అప్పగించకుండా, పరిశ్రమ ప్రతినిధులకు అప్పగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాకినాడలో దారుణం - అభిషేకం సరిగా చేయలేదని అర్చకుడిని కాలితో తన్నిన వైసీపీ నేత - YSRCP Leader Attack on Priest

Police Checks at Yanam-Kakinada District Borders: మరోవైపు యానాం-కాకినాడ జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన అంతర రాష్ట్ర తనిఖీ కేంద్రాలను జిల్లా ఎస్పీ ఎస్‌. సతీష్‌కుమార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. యానాం సరిహద్దులోని మల్లవరం, సుంకరపాలెం, అరటికాయలంక చెక్‌పోస్టులను సోమవారం సాయంత్రం ఆయన సందర్శించారు. ఈ క్రమంలో ఆయా కేంద్రాల్లో విధుల్లో ఉన్న పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.

చెక్‌పోస్టు వద్ద పనిచేసే అధికారులు, సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. యానాం ఎస్పీతో చర్చించి యానాం-కాకినాడ సరిహద్దులో యానాం వైపు మరో 10 చెక్‌ పోస్టులు ఏర్పాటుచేసి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీడియో కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎస్‌.సతీష్‌కుమార్‌ పేర్కొన్నారు.

Foreigner Caught with Cash During Police Check : ఎన్నికలు సమీపిస్తున్న వేళ నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, మద్యం ఇతరత్రా అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో జిల్లాల సరిహద్దుల్లో తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో లక్షా 30 వేల రూపాయల నగదును ఓ విదేశీయుడి బ్యాగ్​లో పోలీసులు గుర్తించారు. అయితే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న సంధ్య ఆక్వా పరిశ్రమకు అతడు వచ్చినట్లు సమాచారం.

తిరుగు ప్రయాణంలో అతడిని యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ ప్రధాన కూడలి వద్ద పోలీసులు పట్టుకున్నారు. దీంతో విషయం తెలుసుకున్న సంధ్య ఆక్వా పరిశ్రమ ప్రతినిధులు ఉప్పాడకు చేరుకుని పోలీసు అధికారులతో మాట్లాడి విదేశీయుడిని పంపించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అతడు వియత్నాం దేశానికి చెందిన టాంగ్​గా పోలీసులు గుర్తించారు. అయితే నగదును సీజ్​ చేసి ఎన్నికల కమిషనర్​కు పంపుతున్నట్లు ఫ్లైయింగ్ స్క్వాడ్ నారాయణ దాసు తెలిపారు. కాగా డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న పరిశ్రమకు విదేశీయుడు రావడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

'స్టేషన్‌కు వస్తావా ? రావా ? కాల్చి పడేస్తా' - టీడీపీ నేతకు కారంపూడి సీఐ బెదిరింపు - Karempudi CI Warning to TDP Leader

Police Checks on Sandhya Aqua Industry Bus: విశాఖ పోర్టులో భారీగా డ్రగ్స్‌ పట్టుబడిన వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరుగుతున్న వేళ సంధ్య ఆక్వాకు చెందిన బస్సు ఒకటి కొత్త మూలపేట ఎస్సీజెడ్ కాలనీలో కనిపించడం కలకలం రేపింది. నాలుగు రోజులుగా అక్కడే సంధ్య ఆక్వా పరిశ్రమకు చెందిన బస్సు ఉండటంతో స్థానికులు ఆందోళన చెందారు.

బస్సును ఎవరు అక్కడ పెట్టారో అందులో ఏముందో తెలియక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు సంధ్య ఆక్వా పరిశ్రమకు చెందిన దస్త్రాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను గుర్తించారు. అయితే తనిఖీల తర్వాత బస్సులో ఉన్న కీలక దస్త్రాలను సీబీఐకి అప్పగించకుండా, పరిశ్రమ ప్రతినిధులకు అప్పగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాకినాడలో దారుణం - అభిషేకం సరిగా చేయలేదని అర్చకుడిని కాలితో తన్నిన వైసీపీ నేత - YSRCP Leader Attack on Priest

Police Checks at Yanam-Kakinada District Borders: మరోవైపు యానాం-కాకినాడ జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన అంతర రాష్ట్ర తనిఖీ కేంద్రాలను జిల్లా ఎస్పీ ఎస్‌. సతీష్‌కుమార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. యానాం సరిహద్దులోని మల్లవరం, సుంకరపాలెం, అరటికాయలంక చెక్‌పోస్టులను సోమవారం సాయంత్రం ఆయన సందర్శించారు. ఈ క్రమంలో ఆయా కేంద్రాల్లో విధుల్లో ఉన్న పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.

చెక్‌పోస్టు వద్ద పనిచేసే అధికారులు, సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. యానాం ఎస్పీతో చర్చించి యానాం-కాకినాడ సరిహద్దులో యానాం వైపు మరో 10 చెక్‌ పోస్టులు ఏర్పాటుచేసి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీడియో కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎస్‌.సతీష్‌కుమార్‌ పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.