ETV Bharat / state

సీఎం సహాయనిధికి రూ.300 కోట్లు - దాతలకు మంత్రి లోకేశ్‌ కృతజ్ఞతలు - Donors Cheques to Minister Lokesh

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 18, 2024, 6:32 PM IST

Donors Present Cheques to Minister Nara Lokesh For Vijayawada Flood Victims at Undavalli Residence : వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు దాతలు విరాళాలు అందిస్తూ దాతృత్వం చాటుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సీఎంఆర్​ఎఫ్​కు రూ. 300 కోట్లకు పైగా వచ్చాయి. ఇంకా దాతలు తమ వంతు సాయం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేశ్​ను కలిసి పలువురు చెక్కులు అందించారు.

donation_to_cmrf_on_floods
donation_to_cmrf_on_floods (ETV Bharat)

Donation to CMRF on Floods : విజయవాడ వరద బాధితుల సహాయార్థం పలువురు దాతలు ముందుకొచ్చారు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేశ్‌ను కలిసి చెక్కులు అందజేశారు. గుంటూరుకు చెందిన దామచర్ల శ్రీనివాసరావు ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ తరఫున రూ. 6 లక్షల నూట పదహారు రూపాయలు విరాళమిచ్చారు. అమలాపురం బోనం వెంకట చలమయ్య ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఛైర్మన్ బోనం కనకయ్య 5 లక్షలు, నంద్యాల SVR ఇంజనీరింగ్‌ కాలేజ్‌ M.Dదినేశ్‌ రెడ్డి, కాలేజీ డీన్ సూర్యప్రకాశ్ రెడ్డి 4 లక్షలు, ఎమ్మెల్యే గౌతు శిరీష నేతృత్వంలో పలాస నియోజకవర్గ ప్రజలు 2 లక్షల 90 వేలు విరాళమిచ్చారు.

నవ్యాంధ్రప్రదేశ్‌ ప్లాస్టిక్‌ మాన్యూఫ్యాక్చరింగ్‌ అసోసియేషన్ ప్రతినిధి జయకుమార్ రెండున్నర లక్షల రూపాయలు, మదనపల్లె గోల్డెన్ వాలీ ఇంజనీరింగ్ కాలేజీ కరస్పాండెంట్‌ రమణారెడ్డి 2 లక్షలు, అనంతపురానికి చెందిన సురేశ్‌ నాయుడు లక్ష అందజేశారు. బీజేపీ మజ్దూర్‌ విభాగం నాయకుడు నాగేశ్వరరావు 10వేలు అందజేశారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు తమవంతు సాయం అందించిన దాతలకు మంత్రి నారా లోకేశ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Donations For Flood Relief : వరద బాధితుల కష్టాలు చూశాక వారికి అండగా ఉండేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు, నడవలేని స్థితిలో ఉన్నవారు వీల్‌చైర్‌లో వచ్చి విరాళాలు అందజేస్తున్న దృష్యాలు దాతృత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే సీఎంఆర్​ఎఫ్​కు రూ.300 కోట్లు వచ్చాయి. మరో రూ.50-100 కోట్లు వచ్చే అవకాశముందని అంచనాలున్నాయి.

సీఎం సహాయనిధికి రూ. 5 కోట్ల విరాళం అందజేసిన మేఘా

తమ వంతు సాయంగా చాలా మంది తమకు తోచినంత సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో స్కూల్ పిల్లలు సైతం వారి పాకెట్​ మనీ ఇవ్వడం స్పూర్తిని కలిగించింది. వైఎస్​ సునీత చంద్రబాబు నాయుడును కలిసి రూ.10 లక్షలను విరాళంగా అందజేశాారు. వరద విలయంతో కకావికలమైన వారికి విరాళాలు అందిస్తూ సాంత్వన చేకూరుస్తున్నారు దాతలు. తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో సేకరిస్తున్నారు. వివిధ గ్రామాల్లో వసూలు చేసిన విరాళాలు సీఎం రిలీఫ్​ ఫండ్​కు ఇస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో గ్రామ పార్టీ అధ్యక్షులు, సీనియర్‌ నాయకులు, క్లస్టర్‌ ఇన్‌ఛార్జులు తదితరులు పాల్గొంటున్నారు.

వరద బాధితులకు పోలీసుల సాయం-ఒకరోజు వేతనం 12 కోట్ల విరాళం - Huge Donations to CMRF AP

Donation to CMRF on Floods : విజయవాడ వరద బాధితుల సహాయార్థం పలువురు దాతలు ముందుకొచ్చారు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేశ్‌ను కలిసి చెక్కులు అందజేశారు. గుంటూరుకు చెందిన దామచర్ల శ్రీనివాసరావు ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ తరఫున రూ. 6 లక్షల నూట పదహారు రూపాయలు విరాళమిచ్చారు. అమలాపురం బోనం వెంకట చలమయ్య ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఛైర్మన్ బోనం కనకయ్య 5 లక్షలు, నంద్యాల SVR ఇంజనీరింగ్‌ కాలేజ్‌ M.Dదినేశ్‌ రెడ్డి, కాలేజీ డీన్ సూర్యప్రకాశ్ రెడ్డి 4 లక్షలు, ఎమ్మెల్యే గౌతు శిరీష నేతృత్వంలో పలాస నియోజకవర్గ ప్రజలు 2 లక్షల 90 వేలు విరాళమిచ్చారు.

నవ్యాంధ్రప్రదేశ్‌ ప్లాస్టిక్‌ మాన్యూఫ్యాక్చరింగ్‌ అసోసియేషన్ ప్రతినిధి జయకుమార్ రెండున్నర లక్షల రూపాయలు, మదనపల్లె గోల్డెన్ వాలీ ఇంజనీరింగ్ కాలేజీ కరస్పాండెంట్‌ రమణారెడ్డి 2 లక్షలు, అనంతపురానికి చెందిన సురేశ్‌ నాయుడు లక్ష అందజేశారు. బీజేపీ మజ్దూర్‌ విభాగం నాయకుడు నాగేశ్వరరావు 10వేలు అందజేశారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు తమవంతు సాయం అందించిన దాతలకు మంత్రి నారా లోకేశ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Donations For Flood Relief : వరద బాధితుల కష్టాలు చూశాక వారికి అండగా ఉండేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు, నడవలేని స్థితిలో ఉన్నవారు వీల్‌చైర్‌లో వచ్చి విరాళాలు అందజేస్తున్న దృష్యాలు దాతృత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే సీఎంఆర్​ఎఫ్​కు రూ.300 కోట్లు వచ్చాయి. మరో రూ.50-100 కోట్లు వచ్చే అవకాశముందని అంచనాలున్నాయి.

సీఎం సహాయనిధికి రూ. 5 కోట్ల విరాళం అందజేసిన మేఘా

తమ వంతు సాయంగా చాలా మంది తమకు తోచినంత సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో స్కూల్ పిల్లలు సైతం వారి పాకెట్​ మనీ ఇవ్వడం స్పూర్తిని కలిగించింది. వైఎస్​ సునీత చంద్రబాబు నాయుడును కలిసి రూ.10 లక్షలను విరాళంగా అందజేశాారు. వరద విలయంతో కకావికలమైన వారికి విరాళాలు అందిస్తూ సాంత్వన చేకూరుస్తున్నారు దాతలు. తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో సేకరిస్తున్నారు. వివిధ గ్రామాల్లో వసూలు చేసిన విరాళాలు సీఎం రిలీఫ్​ ఫండ్​కు ఇస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో గ్రామ పార్టీ అధ్యక్షులు, సీనియర్‌ నాయకులు, క్లస్టర్‌ ఇన్‌ఛార్జులు తదితరులు పాల్గొంటున్నారు.

వరద బాధితులకు పోలీసుల సాయం-ఒకరోజు వేతనం 12 కోట్ల విరాళం - Huge Donations to CMRF AP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.