ETV Bharat / state

వరద బాధితులకు విరాళాల వెల్లువ - జీవీకే ఫౌండేషన్ 5 కోట్లు, దివీస్ సంస్థ మరో 5 కోట్లు - Huge Donations to AP CMRF

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 15, 2024, 8:00 PM IST

Updated : Sep 15, 2024, 10:34 PM IST

Donors Continue to Donate CM Relief Fund : వరదలతో నిర్వాసితులైన బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును, మంత్రి లోకేశ్​ను కలిసి పలువురు విరాళాలు అందజేశారు. జీవీకే ఫౌండేషన్ ఛైర్మన్ జీవీకే రెడ్డి, జీవీ సంజయ్ రెడ్డిలు 5 కోట్ల రూపాయలను అందించారు. అలాగే దివీస్ సంస్థ 5 కోట్ల రూపాయల విరాళం అందించింది. పలువురు వ్యక్తులు, సంస్థల ప్రతినిధులు విరాళాలను ఇచ్చారు.

Donors Continue to Donate CM Relief Fund
Donors Continue to Donate CM Relief Fund (ETV Bharat)

Donors Continue to Donate CM Relief Fund : విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధికి దాతల విరాళాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబును హైదరాబాద్‌లో కలిసి పలువురు చెక్కులు అందించారు. జీవీకే ఫౌండేషన్ ఛైర్మన్ జీవీకే రెడ్డి, జీవీ సంజయ్ రెడ్డిలు 5 కోట్ల రూపాయలను అందించారు. అలాగే కాంటినెంటల్ కాఫీ తరఫున చల్లా శ్రీశాంత్ 1 కోటి 11 లక్షలు, చల్లా రాజేంద్రప్రసాద్ ఫ్యామిలీ ఫౌండేషన్ తరఫున చల్లా అజిత 1 కోటి రూపాయల విరాళం ఇచ్చారు.

వరద బాధితులకు ఆపన్న హస్తం - భాష్యం 4 కోట్లు, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ 3 కోట్లు - HUGE DONATIONS TO AP CMRF

కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఛైర్మన్ అరుణ్ అలగప్ప, ఎండీ శంకర్ సుబ్రహ్మణ్యం 1 కోటి 50 లక్షలు, ట్రైజియో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ వేములపల్లి అశోక్, రోహిత్ వేములపల్లి 1 కోటి రూపాయల చెక్కులను చంద్రబాబుకు అందించారు. లారస్ ల్యాబ్స్ ఫౌండర్, సీఈఓ డాక్టర్ సత్యనారాయణ చావా, నాగరాణి చావ 1 కోటి, చలసాని చాముండేశ్వరి, శ్రీరామ్ 25 లక్షలు, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ 2 లక్షలు, నరసింహారావు 2 లక్షల రూపాయల విరాళల చెక్​లను అందించారు. వీరి అందరికీ చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపి, అభినందించారు.

విపత్తు వేళ పరిమళిస్తున్న మానవత్వం - ఈనాడు సహాయ నిధికి విరాళాల వెల్లువ - Donations To Eenadu Relief Fund

వరదల కారణంగా దెబ్బతిన్న బాధితులను ఆదుకునేందుకు దివీస్ సంస్థ ఐదు కోట్ల రూపాయల భారీ విరాళం అందించింది. ఈ మేరకు సంస్థ సీఈఓ దివి కిరణ్ హైదరాబాదులో మంత్రి నారా లోకేశ్​ను కలిసి చెక్కును అందజేశారు. దివీస్‌ సంస్థ ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు వరద బాధితులకు ఆహారాన్ని అందజేసేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్​కు మరో 4.8 కోట్లను అందజేసింది. మొత్తంగా రాష్ట్రంలో వరద బాధితుల కోసం 9.8 కోట్ల రూపాయల విరాళాన్ని అందించిన సంస్థను మంత్రి లోకేశ్ అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్న దాతలకు లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు.

వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి చంద్రబాబుకి నెల్లూరుకు చెందిన గంటా రమణయ్య నాయుడు, గంటా రమేష్ 1 కోటి రూపాయల విరాళంగా ఇచ్చారు. ముఖ్యమంత్రిని హైదరాబాద్​లోని నివాసంలో కలిసి విరాళంగా చెక్​ను అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారికి కృతజ్ఞతలు తెలిపి, అభినందించారు.

సీఎం చంద్రబాబు పిలుపునకు అనూహ్య స్పందన- వరద బాధితులకు విరాళాలు వెల్లువ - Huge Donations to CMRF

Donors Continue to Donate CM Relief Fund : విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధికి దాతల విరాళాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబును హైదరాబాద్‌లో కలిసి పలువురు చెక్కులు అందించారు. జీవీకే ఫౌండేషన్ ఛైర్మన్ జీవీకే రెడ్డి, జీవీ సంజయ్ రెడ్డిలు 5 కోట్ల రూపాయలను అందించారు. అలాగే కాంటినెంటల్ కాఫీ తరఫున చల్లా శ్రీశాంత్ 1 కోటి 11 లక్షలు, చల్లా రాజేంద్రప్రసాద్ ఫ్యామిలీ ఫౌండేషన్ తరఫున చల్లా అజిత 1 కోటి రూపాయల విరాళం ఇచ్చారు.

వరద బాధితులకు ఆపన్న హస్తం - భాష్యం 4 కోట్లు, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ 3 కోట్లు - HUGE DONATIONS TO AP CMRF

కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఛైర్మన్ అరుణ్ అలగప్ప, ఎండీ శంకర్ సుబ్రహ్మణ్యం 1 కోటి 50 లక్షలు, ట్రైజియో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ వేములపల్లి అశోక్, రోహిత్ వేములపల్లి 1 కోటి రూపాయల చెక్కులను చంద్రబాబుకు అందించారు. లారస్ ల్యాబ్స్ ఫౌండర్, సీఈఓ డాక్టర్ సత్యనారాయణ చావా, నాగరాణి చావ 1 కోటి, చలసాని చాముండేశ్వరి, శ్రీరామ్ 25 లక్షలు, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ 2 లక్షలు, నరసింహారావు 2 లక్షల రూపాయల విరాళల చెక్​లను అందించారు. వీరి అందరికీ చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపి, అభినందించారు.

విపత్తు వేళ పరిమళిస్తున్న మానవత్వం - ఈనాడు సహాయ నిధికి విరాళాల వెల్లువ - Donations To Eenadu Relief Fund

వరదల కారణంగా దెబ్బతిన్న బాధితులను ఆదుకునేందుకు దివీస్ సంస్థ ఐదు కోట్ల రూపాయల భారీ విరాళం అందించింది. ఈ మేరకు సంస్థ సీఈఓ దివి కిరణ్ హైదరాబాదులో మంత్రి నారా లోకేశ్​ను కలిసి చెక్కును అందజేశారు. దివీస్‌ సంస్థ ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు వరద బాధితులకు ఆహారాన్ని అందజేసేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్​కు మరో 4.8 కోట్లను అందజేసింది. మొత్తంగా రాష్ట్రంలో వరద బాధితుల కోసం 9.8 కోట్ల రూపాయల విరాళాన్ని అందించిన సంస్థను మంత్రి లోకేశ్ అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్న దాతలకు లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు.

వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి చంద్రబాబుకి నెల్లూరుకు చెందిన గంటా రమణయ్య నాయుడు, గంటా రమేష్ 1 కోటి రూపాయల విరాళంగా ఇచ్చారు. ముఖ్యమంత్రిని హైదరాబాద్​లోని నివాసంలో కలిసి విరాళంగా చెక్​ను అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారికి కృతజ్ఞతలు తెలిపి, అభినందించారు.

సీఎం చంద్రబాబు పిలుపునకు అనూహ్య స్పందన- వరద బాధితులకు విరాళాలు వెల్లువ - Huge Donations to CMRF

Last Updated : Sep 15, 2024, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.