ETV Bharat / state

కోల్‌కతా ఘటనపై కొనసాగుతున్న వైద్యుల నిరసనలు - రక్షణ కల్పించాలని డిమాండ్ - Doctors continue protest in State

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 18, 2024, 9:01 PM IST

Doctors Continue Protest Across the State : కోల్‌కతా జూనియర్‌ డాక్టర్‌ ఘటనపై వైద్యులు, విద్యార్థులు కదం తొక్కారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిరసనలతో హోరెత్తించారు. నిందితులను కఠినంగా శిక్షించేవరకు ఆందోళనలు ఆపేది లేదని స్పష్టం చేశారు. విధుల్లో ఉన్న డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

Doctors Continue Protest Across the State
Doctors Continue Protest Across the State (ETV Bharat)

Doctors Continue Protest Across the State : కోల్​కతాలో వైద్యవిద్యార్థినిపై జరిగిన అమానుష ఘటనను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు, విద్యార్థులు రోడ్డెక్కారు. ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. వైద్యులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని తేల్చిచెప్పారు.

కోల్‌కతాలో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచారాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ డాక్టర్లు, విద్యార్థులు కతం తొక్కారు. విశాఖ ఆర్​కే బీచ్‌ రోడ్‌లో వైద్యరంగ నిపుణులు, విద్యార్థులు, వివిధ ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు భారీ ర్యాలీ చేపట్టారు. జాతీయ జెండా పట్టుకుని నడుస్తూ 'we want justice' అంటూ నినదించారు.

దేశంలో ఓపీ సేవలు బంద్​! నేషన్​వైడ్​ నిరసనకు IMA రెడీ- దిల్లీలో రెసిడెంట్​ డాక్టర్స్​ ఆందోళనలు

నంద్యాలలో పీజీ వైద్య విద్యార్థులు చేపట్టిన నిరసన దీక్ష కొనసాగుతోంది. నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో మూడు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు నిరసనలు ఆపేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్ ఆసుపత్రి వద్ద జూనియర్‌ డాక్టర్ల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. స్విమ్స్‌ వద్ద టెంట్‌ వేసుకుని కూర్చుని ప్లకార్డులతో దీక్ష చేశారు. ప్రాణాలు కాపాడే డాక్టర్‌పై హత్యాచారాలు జరగడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి బ్రిడ్జి సెంటర్‌లో IMA ఆధ్వర్యంలో వైద్యులు నిరసన చేపట్టారు. నిరసనకు స్థానిక ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి సంఘీభావం తెలిపారు. వైద్యురాలిపై హత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఇది సభ్యసమాజం తలదించుకునే ఘటన అన్నారు. వైద్యుల ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీసే చర్యలు మంచివి కావన్నారు.

'రీక్లెయిమ్​ ది నైట్'- అర్ధరాత్రి అట్టుడుకిన బంగాల్​- వైద్యురాలిపై హత్యాచారం జరిగిన ఆస్పత్రిలో విధ్వంసం!

కేంద్ర ప్రభుత్వం వైద్యులకు రక్షణ చట్టం అమలు చేయాలని జూనియర్ డాక్టర్‌ అసోసియేషన్‌ సభ్యులు డిమాండ్ చేశారు. కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారాన్ని నిరసిస్తూ తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. హత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారానికి నిరసనగా విశాఖలో వైద్యులు ఆందోళన చేశారు. IMA ఆధ్వర్యంలో వందలాది మంది వైద్యులు ర్యాలీ చేశారు. వైద్యురాలి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులను ఆపాలని ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. భవిష్యత్తులో వైద్యులపై దాడులు జరగకుండా చట్టాలు తేవాలని కోరారు.

కోల్‌కతా హత్యాచారం ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా హోరెత్తిన ఆందోళనలు - Doctors Protest across the state

Doctors Continue Protest Across the State : కోల్​కతాలో వైద్యవిద్యార్థినిపై జరిగిన అమానుష ఘటనను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు, విద్యార్థులు రోడ్డెక్కారు. ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. వైద్యులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని తేల్చిచెప్పారు.

కోల్‌కతాలో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచారాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ డాక్టర్లు, విద్యార్థులు కతం తొక్కారు. విశాఖ ఆర్​కే బీచ్‌ రోడ్‌లో వైద్యరంగ నిపుణులు, విద్యార్థులు, వివిధ ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు భారీ ర్యాలీ చేపట్టారు. జాతీయ జెండా పట్టుకుని నడుస్తూ 'we want justice' అంటూ నినదించారు.

దేశంలో ఓపీ సేవలు బంద్​! నేషన్​వైడ్​ నిరసనకు IMA రెడీ- దిల్లీలో రెసిడెంట్​ డాక్టర్స్​ ఆందోళనలు

నంద్యాలలో పీజీ వైద్య విద్యార్థులు చేపట్టిన నిరసన దీక్ష కొనసాగుతోంది. నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో మూడు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు నిరసనలు ఆపేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్ ఆసుపత్రి వద్ద జూనియర్‌ డాక్టర్ల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. స్విమ్స్‌ వద్ద టెంట్‌ వేసుకుని కూర్చుని ప్లకార్డులతో దీక్ష చేశారు. ప్రాణాలు కాపాడే డాక్టర్‌పై హత్యాచారాలు జరగడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి బ్రిడ్జి సెంటర్‌లో IMA ఆధ్వర్యంలో వైద్యులు నిరసన చేపట్టారు. నిరసనకు స్థానిక ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి సంఘీభావం తెలిపారు. వైద్యురాలిపై హత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఇది సభ్యసమాజం తలదించుకునే ఘటన అన్నారు. వైద్యుల ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీసే చర్యలు మంచివి కావన్నారు.

'రీక్లెయిమ్​ ది నైట్'- అర్ధరాత్రి అట్టుడుకిన బంగాల్​- వైద్యురాలిపై హత్యాచారం జరిగిన ఆస్పత్రిలో విధ్వంసం!

కేంద్ర ప్రభుత్వం వైద్యులకు రక్షణ చట్టం అమలు చేయాలని జూనియర్ డాక్టర్‌ అసోసియేషన్‌ సభ్యులు డిమాండ్ చేశారు. కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారాన్ని నిరసిస్తూ తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. హత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారానికి నిరసనగా విశాఖలో వైద్యులు ఆందోళన చేశారు. IMA ఆధ్వర్యంలో వందలాది మంది వైద్యులు ర్యాలీ చేశారు. వైద్యురాలి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులను ఆపాలని ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. భవిష్యత్తులో వైద్యులపై దాడులు జరగకుండా చట్టాలు తేవాలని కోరారు.

కోల్‌కతా హత్యాచారం ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా హోరెత్తిన ఆందోళనలు - Doctors Protest across the state

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.