ETV Bharat / state

ఇన్​స్టాలో డీమార్ట్​ పేరుతో యాడ్ చూసి క్లిక్ చేశాడు - రూ. 81 వేలు పోగొట్టుకున్నాడు - SCAMMERS CREATING FAKE ADS

డీమార్ట్‌ ప్రకటన చూసి తన క్రెడిట్‌కార్డు వివరాలను సైబర్‌ నేరగాళ్లకు చెప్పిన ఓ వ్యక్తి - వెంటనే తన ఖాతా నుంచి రూ.81 వేలు మాయం - అనంతరం మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు

SCAMMERS CREATING FAKE ADS
D-MART IN HYDERBAD (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 20, 2025, 3:52 PM IST

Fake D-Mart Ads in Instagram : ప్రముఖ సోషల్​ మీడియా ఫ్లాట్​ఫాం అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి డీమార్ట్‌ ప్రకటన చూసి తన క్రెడిట్‌కార్డు వివరాలను ఆలోచించకుండా సైబర్‌ నేరగాళ్లకు చెప్పి రూ. 81 వేలు పోగొట్టుకున్న ఘటన హైదరాబాద్​లోని నేరేడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం సైనిక్‌పురి అంబేడ్కర్‌ నగర్‌లో నివాసముంటున్న ప్రైవేటు ఉద్యోగి ఆదివారం (జనవరి 19న) మొబైల్​లో ఇన్‌స్టాగ్రామ్‌ వాడుతూ డీమార్ట్‌ యాడ్​ చూశాడు.

కొన్ని వస్తువులు తక్కువధరకే వస్తున్నాయని సైబర్‌ నేరగాళ్లు ఆ ప్రకటనలో ఇచ్చారు. అదిచూసి ఆశపడిన అతను అందులోని కొన్ని వస్తువులను వెంటనే ఆర్డర్‌ పెట్టాడు. సైబర్‌ నేరగాళ్లు అతనికి ఫోన్‌ చేసి అందుకు సంబంధించిన క్రెడిట్‌ కార్డ్‌ వివరాలు చెబితే ఆర్డర్​ పెట్టిన వస్తువులను పంపిస్తామని చెప్పారు. దీంతో అతను ఆలోచించకుండా క్రెడిట్‌ కార్డ్‌ వివరాలు చెప్పేశాడు. క్షణాల్లో అతని ఖాతా నుంచి రూ.81 వేలు కట్​ అయ్యాయి. కొద్ది సేపు అనంతరం తాను మోసపోయానని గ్రహించి ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై హైదరాబాద్ సైబర్‌ క్రైమ్‌ విభాగం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి ప్రకటనలను నమ్మి మోసపోవద్దని ఇన్స్​పెక్టర్​ సందీప్‌ కుమార్‌ తెలిపారు.

Fake D-Mart Ads in Instagram : ప్రముఖ సోషల్​ మీడియా ఫ్లాట్​ఫాం అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి డీమార్ట్‌ ప్రకటన చూసి తన క్రెడిట్‌కార్డు వివరాలను ఆలోచించకుండా సైబర్‌ నేరగాళ్లకు చెప్పి రూ. 81 వేలు పోగొట్టుకున్న ఘటన హైదరాబాద్​లోని నేరేడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం సైనిక్‌పురి అంబేడ్కర్‌ నగర్‌లో నివాసముంటున్న ప్రైవేటు ఉద్యోగి ఆదివారం (జనవరి 19న) మొబైల్​లో ఇన్‌స్టాగ్రామ్‌ వాడుతూ డీమార్ట్‌ యాడ్​ చూశాడు.

కొన్ని వస్తువులు తక్కువధరకే వస్తున్నాయని సైబర్‌ నేరగాళ్లు ఆ ప్రకటనలో ఇచ్చారు. అదిచూసి ఆశపడిన అతను అందులోని కొన్ని వస్తువులను వెంటనే ఆర్డర్‌ పెట్టాడు. సైబర్‌ నేరగాళ్లు అతనికి ఫోన్‌ చేసి అందుకు సంబంధించిన క్రెడిట్‌ కార్డ్‌ వివరాలు చెబితే ఆర్డర్​ పెట్టిన వస్తువులను పంపిస్తామని చెప్పారు. దీంతో అతను ఆలోచించకుండా క్రెడిట్‌ కార్డ్‌ వివరాలు చెప్పేశాడు. క్షణాల్లో అతని ఖాతా నుంచి రూ.81 వేలు కట్​ అయ్యాయి. కొద్ది సేపు అనంతరం తాను మోసపోయానని గ్రహించి ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై హైదరాబాద్ సైబర్‌ క్రైమ్‌ విభాగం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి ప్రకటనలను నమ్మి మోసపోవద్దని ఇన్స్​పెక్టర్​ సందీప్‌ కుమార్‌ తెలిపారు.

మేము చెప్పినట్టు చేయండి అధిక లాభాలు వస్తాయన్నారు - రూ.2.43 కోట్లు కొట్టేశారు

ఆశతో పెట్టుబడి - మోసాలకు పట్టుబడి - రూ.2.43 కోట్లు పోగొట్టుకున్న ఉద్యోగి, శాస్త్రవేత్త

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.