ETV Bharat / state

'మీ పిల్లలు ఫలానా కేసులో ఇరుక్కున్నారంటూ' కాల్స్​ వస్తున్నాయా? - అయితే జాగ్రత్త పడాల్సిందే! - Cyber Crime in Nizamabad

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 30, 2024, 4:27 PM IST

Updated : Jul 30, 2024, 5:04 PM IST

Cyber Crime in Nizamabad : మీ కుమారుడు డ్రగ్స్ తరలిస్తూ పోలీసులకు చిక్కాడంటూ తండ్రి కాల్​ వచ్చింది. కేసు కావద్దొంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్​ చేయగా అనుమానం వచ్చిన తండ్రి పూర్తి వివరాలు అడిగాడు. దీంతో కంగారుపడ్డ నిందితుడు మధ్యలోన్ ఫోన్ కట్​ చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

Cyber Crime in Nizamabad
Cyber Crime in Nizamabad (ETV Bharat)

Cyber Crime in Nizamabad : కొత్త పంథాలతో సైబర్ నేరాలకు తెరలేపారు నేరగాళ్లు. ఈ నేరాల పట్ల అవగాహన పెరిగినందున రోజుకో మార్గంలో ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీస్​ ఉన్నతాధికారుల పేరిట వాట్సాప్​ క్రియేట్​ చేసి, ప్రజలకు కాల్స్​ చేసి ఫలనా మీ అబ్బాయి, అమ్మాయి ఫలానా కేసులో ఇరుక్కుందంటూ చెప్పి డబ్బులు లాగుతున్నారు. పోలీస్​ అధికారుల ఫొటోతో కాల్​ రావడంతో ఆందోళనకు గురువుతున్న కొంతమంది డబ్బులు పంపిస్తున్నారు. మరికొందరు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఒకతనికి ఎదురైంది. దీంతో నిందితులకు ప్రశ్నల వర్షం కురిపించగా ఏకంగా కాల్​ కట్ చేశారు.

హైదరాబాద్​లో ట్రేడింగ్ పేరిట మోసానికి మరొకరు బలి

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్​ జిల్లా సిరికొండ మండలంలోని కొండూర్​ గ్రామానికి చెందిన వ్యాపారి శంకర్​కు​ ఇద్దరు కుమారులు. ఇద్దరు విదేశాల్లో ఉంటున్నారు. సోమవారం ఉదయం శంకర్​కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్​ వచ్చింది. 'మీ కుమారుడు, మరో ఇద్దరు యువకులు మాదకద్రవ్యాలు తరలిస్తూ పోలీసులకు చిక్కారు. రూ.2.5లక్షలు ఇస్తే వారిని విడిచి పెడతాం, లేదంటే జైలుకు పంపిస్తాం' అని హిందీలో మాట్లాడి బెదిరించారు.

అప్రమత్తమైన బాధితుడు : మీరు ఎవరని అడగ్గా నిజామాబాద్ సీపీ అని బదులు ఇచ్చారు. త్వరగా డబ్బులు పంపాలని పదేపదే అడగడంతో శంకర్​కు అనుమానం వచ్చింది. దీంతో 'అప్రమత్తమైన తాను వారితో వాదించాడు. అయినా మా సీపీ తెలుగులో మాట్లాడుతారు, హిందీలో మాట్లాడరు, మీ భాష చూస్తుంటే వేరే రాష్ట్రానికి చెందిన వారిలా మాట్లాడుతున్నారు, సరే డబ్బులు తీసుకుని వస్తాం ఎక్కడికి రావాలని అడగ్గా' కాల్​ కట్ చేశారు. శంకర్​ అప్రమత్తం కావడంతో సైబర్​ నేరం నుంచి తప్పించుకోగలిగాడు. ఎవరైనా డబ్బుల కోసం ఈ తరహా ఫోన్స్​ వస్తే ప్రజలు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించాడు.

"నాకు ఫోన్ వచ్చింది. మీ అబ్బాయి డ్రగ్స్ కేసులో చిక్కాడు, కేసు కావొద్దంటే డబ్బులు ఇవ్వాలి అని అడిగారు. అయితే నాకు అనుమానం వచ్చింది. మీరు ఎవరు అని అడిగితే నిజామాబాద్​ సీపీ అన్నారు. అయితే నేను సీపీ అయితే డైరెక్ట్ ఫోన్​ చేయరు, స్టేషన్​కు తీసుకువెళ్తారు లేదా పోలీసులను ఇక్కడికి పంపిస్తారు అని నేను అన్నాను. తర్వాత డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీ భాష తేడాగా ఉంది మా సీపీ హిందీలో మాట్లాడరు అని నేను అనగానే కాల్​ కట్​ చేశారు." - శంకర్​, భాదితుడు

రూ.10వేలకు 20 వేలు వస్తాయన్నారు - చివరకు రూ.10కోట్లు కొట్టేశారు - Investment Fraud in Karimnagar

'పోలీసులు మీకు ఫోన్ చేయరు - కాల్ చేస్తోంది మేం కాదు కేటుగాళ్లు' - సైబర్ నేరాలపై డీజీపీ

Cyber Crime in Nizamabad : కొత్త పంథాలతో సైబర్ నేరాలకు తెరలేపారు నేరగాళ్లు. ఈ నేరాల పట్ల అవగాహన పెరిగినందున రోజుకో మార్గంలో ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీస్​ ఉన్నతాధికారుల పేరిట వాట్సాప్​ క్రియేట్​ చేసి, ప్రజలకు కాల్స్​ చేసి ఫలనా మీ అబ్బాయి, అమ్మాయి ఫలానా కేసులో ఇరుక్కుందంటూ చెప్పి డబ్బులు లాగుతున్నారు. పోలీస్​ అధికారుల ఫొటోతో కాల్​ రావడంతో ఆందోళనకు గురువుతున్న కొంతమంది డబ్బులు పంపిస్తున్నారు. మరికొందరు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఒకతనికి ఎదురైంది. దీంతో నిందితులకు ప్రశ్నల వర్షం కురిపించగా ఏకంగా కాల్​ కట్ చేశారు.

హైదరాబాద్​లో ట్రేడింగ్ పేరిట మోసానికి మరొకరు బలి

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్​ జిల్లా సిరికొండ మండలంలోని కొండూర్​ గ్రామానికి చెందిన వ్యాపారి శంకర్​కు​ ఇద్దరు కుమారులు. ఇద్దరు విదేశాల్లో ఉంటున్నారు. సోమవారం ఉదయం శంకర్​కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్​ వచ్చింది. 'మీ కుమారుడు, మరో ఇద్దరు యువకులు మాదకద్రవ్యాలు తరలిస్తూ పోలీసులకు చిక్కారు. రూ.2.5లక్షలు ఇస్తే వారిని విడిచి పెడతాం, లేదంటే జైలుకు పంపిస్తాం' అని హిందీలో మాట్లాడి బెదిరించారు.

అప్రమత్తమైన బాధితుడు : మీరు ఎవరని అడగ్గా నిజామాబాద్ సీపీ అని బదులు ఇచ్చారు. త్వరగా డబ్బులు పంపాలని పదేపదే అడగడంతో శంకర్​కు అనుమానం వచ్చింది. దీంతో 'అప్రమత్తమైన తాను వారితో వాదించాడు. అయినా మా సీపీ తెలుగులో మాట్లాడుతారు, హిందీలో మాట్లాడరు, మీ భాష చూస్తుంటే వేరే రాష్ట్రానికి చెందిన వారిలా మాట్లాడుతున్నారు, సరే డబ్బులు తీసుకుని వస్తాం ఎక్కడికి రావాలని అడగ్గా' కాల్​ కట్ చేశారు. శంకర్​ అప్రమత్తం కావడంతో సైబర్​ నేరం నుంచి తప్పించుకోగలిగాడు. ఎవరైనా డబ్బుల కోసం ఈ తరహా ఫోన్స్​ వస్తే ప్రజలు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించాడు.

"నాకు ఫోన్ వచ్చింది. మీ అబ్బాయి డ్రగ్స్ కేసులో చిక్కాడు, కేసు కావొద్దంటే డబ్బులు ఇవ్వాలి అని అడిగారు. అయితే నాకు అనుమానం వచ్చింది. మీరు ఎవరు అని అడిగితే నిజామాబాద్​ సీపీ అన్నారు. అయితే నేను సీపీ అయితే డైరెక్ట్ ఫోన్​ చేయరు, స్టేషన్​కు తీసుకువెళ్తారు లేదా పోలీసులను ఇక్కడికి పంపిస్తారు అని నేను అన్నాను. తర్వాత డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీ భాష తేడాగా ఉంది మా సీపీ హిందీలో మాట్లాడరు అని నేను అనగానే కాల్​ కట్​ చేశారు." - శంకర్​, భాదితుడు

రూ.10వేలకు 20 వేలు వస్తాయన్నారు - చివరకు రూ.10కోట్లు కొట్టేశారు - Investment Fraud in Karimnagar

'పోలీసులు మీకు ఫోన్ చేయరు - కాల్ చేస్తోంది మేం కాదు కేటుగాళ్లు' - సైబర్ నేరాలపై డీజీపీ

Last Updated : Jul 30, 2024, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.