ETV Bharat / state

గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన నేత రాజీవ్‌ గాంధీ : సీఎం రేవంత్ - Revanth Unveil Rajiv Gandhi Statue

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2024, 7:01 PM IST

Updated : Sep 16, 2024, 7:25 PM IST

CM Revanth Unveiled Statue Of Rajiv Gandhi : దేశ ప్రజల కోసమే రాజీవ్‌ గాంధీ ప్రధాని పదవి చేపట్టారని, ప్రజలకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సచివాలయం ఎదుట మాజీ ప్రధాని, దివంగత రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని ఇవాళ ఆయన ఆవిష్కరించారు. అనంతరం సభలో మాట్లాడుతూ, గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన నేత రాజీవ్‌ గాంధీ అని కొనియాడారు.

CM Revanth Unveiled Statue Of Rajiv Gandhi
CM Revanth Unveiled Statue Of Rajiv Gandhi (ETV Bharat)

CM Revanth Reddy Slams On BRS Party Over Rajiv Statue Issue : తెలంగాణ సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని, దివంగత రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌ బాబు, సీతక్క, కొండా సురేఖ, రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తదితరులు హాజరయ్యారు.

అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. దేశ ప్రజల కోసమే రాజీవ్‌ గాంధీ ప్రధాని పదవి చేపట్టారని, ప్రజలకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారని గుర్తు చేశారు. 'రాష్ట్రానికి గ్రామాలే పట్టుకొమ్మలని మహాత్మా గాంధీ అన్నారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన నేత రాజీవ్‌ గాంధీ. 72, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా నేరుగా గ్రామాలకు నిధులు కేటాయించారు. ఆడబిడ్డలకు రాజ్యాధికారం ఇచ్చారు. ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేశారు’ అని తెలిపారు.

"దేశానికి సాంకేతికతను పరిచయం చేసింది రాజీవ్‌ గాంధీ. మహిళలకు రాజ్యాధికారం ఇచ్చింది ఆయనే, స్థానిక సంస్థల్లో రాజీవ్​ గాంధీ తీసుకువచ్చిన రిజర్వేషన్ల వల్లనే ఇవాళ మహిళలంతా కుర్చీలలో కూర్చొని రాజ్యాధికారంలో భాగస్వాములయ్యారు. కానీ గత పాలకుల హయాంలో ఐదేళ్ల వ్యవధిలో కనీసం ఒక మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. ఇంకా వాళ్లకు (బీఆర్ఎస్​) ఇవన్నీ ఎక్కడ గుర్తుంటాయి."-రేవంత్​రెడ్డి, ముఖ్యమంత్రి

తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మంత్రి పదవులు పొందారు : త్యాగం అంటే ఏంటో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. రూ.వేల కోట్ల సంపదను దేశం కోసం త్యాగం చేసిన నాయకుడు, స్వాతంత్య్రం కోసం జైలుకు వెళ్లిన వ్యక్తి, స్వాతంత్య్రం తర్వాత దేశాన్ని ఐక్యంగా ఉంచిన నేత నెహ్రూ అని కొనియాడారు. ఆయన కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ ఆయన పనితనానికి సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయని గుర్తు చేశారు. నెహ్రూ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరా గాంధీ ఏ బాధ్యత తీసుకోలేదన్న సీఎం, కొందరు మాత్రం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మంత్రి పదవులు పొందుతున్నారని పరోక్షంగా విపక్షాలను విమర్శించారు.

బ్యాంకులను ప్రభుత్వ పరం చేసి పేదలకు ఇందిరా గాంధీ మంచి చేశారని, లక్షల ఎకరాల భూములను పేదలకు పంచి పెట్టింది ఇందిరా గాంధీ కాదా అని ప్రశ్నించారు. దేశంలో రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీ కాదా అని అన్నారు. రాజీవ్‌ గాంధీ సాంకేతిక విప్లవం తీసుకురావడం వల్లే ఇప్పుడు మనం ప్రపంచంతో పోటీ పడగలుతున్నామని, ఆయన వల్లే కేటీఆర్‌ ఐటీ చదివి అమెరికా వెళ్లారని వ్యాఖ్యానించారు.

రాజీవ్‌ విగ్రహాన్ని ఎవరు తొలగిస్తారో రండి చూసుకుందాం : రాజీవ్‌ గాంధీ తర్వాత సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ఏ పదవీ తీసుకోలేదని, పదవి త్యాగం అంటే వాళ్లవని ఉద్ఘాటించారు. తెలంగాణ బిడ్డ పీవీని ప్రధానిని చేసింది సోనియా గాంధీ కాదా అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబం గురించి కేసీఆర్‌ కుటుంబానికి తెలుసా, అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామనుకున్నారా అని తీవ్రంగా స్పందించారు. గత పాలకులు సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెడదామనుకున్నారట, మరి పదేళ్లలో ఎందుకు పెట్టలేదని సీఎం ప్రశ్నించారు.

ఫామ్‌హౌస్‌లు కట్టుకోవటానికి, రూ.లక్ష కోట్లు మింగి కాళేశ్వరం నిర్మించటానికి ఉన్న సమయం, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి మాత్రం కేసీఆర్‌కు తీరిక లేదా అని నిలదీశారు. కేసీఆర్ విగ్రహం పెట్టుకోవడానికి ఇక్కడ స్థలం ఉంచుకున్నారని ఎద్దేవా చేశారు. రాజీవ్‌ విగ్రహాన్ని ఎవరు తొలగిస్తారో రండి చూసుకుందామన్న సీఎం, దమ్ముంటే రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తొలగించే టైమ్‌ చెప్పాలని సవాల్​ విసిరారు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - ఈ ఏడాది చివరి వరకు మరో 35 వేల ఉద్యోగాలు - CM REVANTH PROMISES 35000 NEW JOBS

2035 నాటికి రాష్ట్రంలో 40,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తే లక్ష్యం : భట్టి - Deputy CM Bhatti On Green Power

CM Revanth Reddy Slams On BRS Party Over Rajiv Statue Issue : తెలంగాణ సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని, దివంగత రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌ బాబు, సీతక్క, కొండా సురేఖ, రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తదితరులు హాజరయ్యారు.

అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. దేశ ప్రజల కోసమే రాజీవ్‌ గాంధీ ప్రధాని పదవి చేపట్టారని, ప్రజలకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారని గుర్తు చేశారు. 'రాష్ట్రానికి గ్రామాలే పట్టుకొమ్మలని మహాత్మా గాంధీ అన్నారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన నేత రాజీవ్‌ గాంధీ. 72, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా నేరుగా గ్రామాలకు నిధులు కేటాయించారు. ఆడబిడ్డలకు రాజ్యాధికారం ఇచ్చారు. ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేశారు’ అని తెలిపారు.

"దేశానికి సాంకేతికతను పరిచయం చేసింది రాజీవ్‌ గాంధీ. మహిళలకు రాజ్యాధికారం ఇచ్చింది ఆయనే, స్థానిక సంస్థల్లో రాజీవ్​ గాంధీ తీసుకువచ్చిన రిజర్వేషన్ల వల్లనే ఇవాళ మహిళలంతా కుర్చీలలో కూర్చొని రాజ్యాధికారంలో భాగస్వాములయ్యారు. కానీ గత పాలకుల హయాంలో ఐదేళ్ల వ్యవధిలో కనీసం ఒక మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. ఇంకా వాళ్లకు (బీఆర్ఎస్​) ఇవన్నీ ఎక్కడ గుర్తుంటాయి."-రేవంత్​రెడ్డి, ముఖ్యమంత్రి

తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మంత్రి పదవులు పొందారు : త్యాగం అంటే ఏంటో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. రూ.వేల కోట్ల సంపదను దేశం కోసం త్యాగం చేసిన నాయకుడు, స్వాతంత్య్రం కోసం జైలుకు వెళ్లిన వ్యక్తి, స్వాతంత్య్రం తర్వాత దేశాన్ని ఐక్యంగా ఉంచిన నేత నెహ్రూ అని కొనియాడారు. ఆయన కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ ఆయన పనితనానికి సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయని గుర్తు చేశారు. నెహ్రూ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరా గాంధీ ఏ బాధ్యత తీసుకోలేదన్న సీఎం, కొందరు మాత్రం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మంత్రి పదవులు పొందుతున్నారని పరోక్షంగా విపక్షాలను విమర్శించారు.

బ్యాంకులను ప్రభుత్వ పరం చేసి పేదలకు ఇందిరా గాంధీ మంచి చేశారని, లక్షల ఎకరాల భూములను పేదలకు పంచి పెట్టింది ఇందిరా గాంధీ కాదా అని ప్రశ్నించారు. దేశంలో రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీ కాదా అని అన్నారు. రాజీవ్‌ గాంధీ సాంకేతిక విప్లవం తీసుకురావడం వల్లే ఇప్పుడు మనం ప్రపంచంతో పోటీ పడగలుతున్నామని, ఆయన వల్లే కేటీఆర్‌ ఐటీ చదివి అమెరికా వెళ్లారని వ్యాఖ్యానించారు.

రాజీవ్‌ విగ్రహాన్ని ఎవరు తొలగిస్తారో రండి చూసుకుందాం : రాజీవ్‌ గాంధీ తర్వాత సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ఏ పదవీ తీసుకోలేదని, పదవి త్యాగం అంటే వాళ్లవని ఉద్ఘాటించారు. తెలంగాణ బిడ్డ పీవీని ప్రధానిని చేసింది సోనియా గాంధీ కాదా అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబం గురించి కేసీఆర్‌ కుటుంబానికి తెలుసా, అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామనుకున్నారా అని తీవ్రంగా స్పందించారు. గత పాలకులు సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెడదామనుకున్నారట, మరి పదేళ్లలో ఎందుకు పెట్టలేదని సీఎం ప్రశ్నించారు.

ఫామ్‌హౌస్‌లు కట్టుకోవటానికి, రూ.లక్ష కోట్లు మింగి కాళేశ్వరం నిర్మించటానికి ఉన్న సమయం, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి మాత్రం కేసీఆర్‌కు తీరిక లేదా అని నిలదీశారు. కేసీఆర్ విగ్రహం పెట్టుకోవడానికి ఇక్కడ స్థలం ఉంచుకున్నారని ఎద్దేవా చేశారు. రాజీవ్‌ విగ్రహాన్ని ఎవరు తొలగిస్తారో రండి చూసుకుందామన్న సీఎం, దమ్ముంటే రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తొలగించే టైమ్‌ చెప్పాలని సవాల్​ విసిరారు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - ఈ ఏడాది చివరి వరకు మరో 35 వేల ఉద్యోగాలు - CM REVANTH PROMISES 35000 NEW JOBS

2035 నాటికి రాష్ట్రంలో 40,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తే లక్ష్యం : భట్టి - Deputy CM Bhatti On Green Power

Last Updated : Sep 16, 2024, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.