ETV Bharat / state

రాజ్​నాథ్ సింగ్​తో సీఎం రేవంత్ భేటీ- రక్షణశాఖ భూముల కేటాయింపునకై విజ్ఞప్తి - CM REVANTH DELHI TOUR UPDATES

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 24, 2024, 5:36 PM IST

Updated : Jun 24, 2024, 10:13 PM IST

CM Revanth Delhi Tour : రెండ్రోజుల పర్యటన నిమిత్తం సీఎం రేవంత్ రెడ్డి దిల్లీ చేరుకున్నారు. దేశ రాజధానిలో ఇవాళ ఆయన రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్​, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో భేటీ భేటీ అయ్యారు. రక్షణశాఖ భూములు అప్పగింత, ఇళ్ల నిర్మాణాలపై కేంద్రమంత్రులతో చర్చించారు.

CM Revanth met Union Minister Rajnath singh
CM Revanth Delhi Tour (ETV Bharat)

CM Revanth Meets Union Minister Rajnath Singh : సీఎం రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. తెలంగాణ ఎంపీలతో కలిసి ఇవాళ దిల్లిలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్​తో ఆయన భేటీ అయ్యారు. హైద‌రాబాద్‌లో ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, ఇత‌ర అవ‌స‌రాల‌కు ర‌క్ష‌ణ శాఖ భూములు 2,450 ఎక‌రాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వానికి బ‌దలాయించాల‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

హస్తం గూటికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్​ కుమార్​ - కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ - Jagtial BRS MLA Join Congress

రావిరాల గ్రామంలో తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన 2,462 ఎక‌రాల భూముల‌ను ఇమార‌త్ ప‌రిశోధ‌న కేంద్రం (ఆర్‌సీఐ) ఉప‌యోగించుకుంటున్న విష‌యాన్ని ముఖ్య‌మంత్రి ర‌క్ష‌ణ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు న‌గ‌రం చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల్లో ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, ఫ్లైఓవ‌ర్లు, ఇత‌ర మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు ర‌క్ష‌ణ శాఖ భూములు త‌మ‌కు అవ‌స‌ర‌మ‌ని, ఆర్‌సీఐ రాష్ట్ర ప్ర‌భుత్వ భూములు వినియోగించుకుంటున్నందున ర‌క్ష‌ణ శాఖ భూములు 2,450 ఎక‌రాలు త‌మ‌కు అప్ప‌గించాల‌ని కోరారు.

వ‌రంగ‌ల్ న‌గ‌రానికి గ‌తంలోనే సైనిక్ స్కూల్ మంజూరు చేసినా గ‌త రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్మాణప‌రంగా ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. వ‌రంగ‌ల్ సైనిక్ స్కూల్ అనుమ‌తుల గ‌డువు ముగిసినందున అనుమ‌తులు పున‌రుద్ధ‌రించాల‌ని లేదా తాజాగా మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు.

కేంద్రమంత్రి ఖట్టర్​తో భేటీ.. అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో భేటీ అయ్యారు. 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రంలో బీఎల్‌సీ మోడ‌ల్‌లో తెలంగాణ‌కు 2.70 ల‌క్ష‌ల ఇళ్లు మంజూరు చేయాల‌ని విజ్ఞప్తి చేశారు. నిరుపేద‌లకు వారి సొంత స్థ‌లాల్లో 25 ల‌క్ష‌ల ఇళ్లు నిర్మించాల‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

రాష్ట్రంలో తాము నిర్మించ‌ తలపెట్టిన 25 ల‌క్ష‌ల ఇళ్ల‌లో 15 ల‌క్ష‌లు ఇళ్లు, ప‌ట్ట‌ణాభివృద్ధి సంస్థ‌ల ప‌రిధిలోకి వ‌స్తాయ‌ని సీఎం రేవంత్ గుర్తుచేశారు. వాటిని ల‌బ్ధిదారు ఆధ్వ‌ర్యంలోని వ్య‌క్తిగ‌త ఇళ్ల నిర్మాణం (బీఎల్‌సీ) ప‌ద్థ‌తిలో నిర్మించ‌నున్న‌ట్లు తెలిపారు. అలాగే, వరంగల్, కరీంనగర్ పట్టణాల్లో స్మార్ట్ సిటీ మిష‌న్ కింద చేప‌ట్టే ప‌నులు పూర్తి కాలేదని తెలియజేస్తూ, మిష‌న్ కాల ప‌రిమితి వచ్చే జూన్ 30తో ముగుస్తున్నందున ఆ గడువును జూన్ 2025 వ‌ర‌కు పొడిగించాల‌ని ముఖ్య‌మంత్రి గారు విజ్ఞప్తి చేశారు.

అభివృద్ధిలో చంద్రబాబుతో పోటీ పడతా : సీఎం రేవంత్ రెడ్డి - Basavatarakam IndoAmerican Hospital

ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ - 2023 డిసెంబర్‌ 9లోపు లోన్స్​ తీసుకున్నవారికే ఛాన్స్​ - Telangana Cabinet Meeting 2024

CM Revanth Meets Union Minister Rajnath Singh : సీఎం రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. తెలంగాణ ఎంపీలతో కలిసి ఇవాళ దిల్లిలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్​తో ఆయన భేటీ అయ్యారు. హైద‌రాబాద్‌లో ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, ఇత‌ర అవ‌స‌రాల‌కు ర‌క్ష‌ణ శాఖ భూములు 2,450 ఎక‌రాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వానికి బ‌దలాయించాల‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

హస్తం గూటికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్​ కుమార్​ - కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ - Jagtial BRS MLA Join Congress

రావిరాల గ్రామంలో తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన 2,462 ఎక‌రాల భూముల‌ను ఇమార‌త్ ప‌రిశోధ‌న కేంద్రం (ఆర్‌సీఐ) ఉప‌యోగించుకుంటున్న విష‌యాన్ని ముఖ్య‌మంత్రి ర‌క్ష‌ణ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు న‌గ‌రం చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల్లో ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, ఫ్లైఓవ‌ర్లు, ఇత‌ర మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు ర‌క్ష‌ణ శాఖ భూములు త‌మ‌కు అవ‌స‌ర‌మ‌ని, ఆర్‌సీఐ రాష్ట్ర ప్ర‌భుత్వ భూములు వినియోగించుకుంటున్నందున ర‌క్ష‌ణ శాఖ భూములు 2,450 ఎక‌రాలు త‌మ‌కు అప్ప‌గించాల‌ని కోరారు.

వ‌రంగ‌ల్ న‌గ‌రానికి గ‌తంలోనే సైనిక్ స్కూల్ మంజూరు చేసినా గ‌త రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్మాణప‌రంగా ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. వ‌రంగ‌ల్ సైనిక్ స్కూల్ అనుమ‌తుల గ‌డువు ముగిసినందున అనుమ‌తులు పున‌రుద్ధ‌రించాల‌ని లేదా తాజాగా మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు.

కేంద్రమంత్రి ఖట్టర్​తో భేటీ.. అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో భేటీ అయ్యారు. 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రంలో బీఎల్‌సీ మోడ‌ల్‌లో తెలంగాణ‌కు 2.70 ల‌క్ష‌ల ఇళ్లు మంజూరు చేయాల‌ని విజ్ఞప్తి చేశారు. నిరుపేద‌లకు వారి సొంత స్థ‌లాల్లో 25 ల‌క్ష‌ల ఇళ్లు నిర్మించాల‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

రాష్ట్రంలో తాము నిర్మించ‌ తలపెట్టిన 25 ల‌క్ష‌ల ఇళ్ల‌లో 15 ల‌క్ష‌లు ఇళ్లు, ప‌ట్ట‌ణాభివృద్ధి సంస్థ‌ల ప‌రిధిలోకి వ‌స్తాయ‌ని సీఎం రేవంత్ గుర్తుచేశారు. వాటిని ల‌బ్ధిదారు ఆధ్వ‌ర్యంలోని వ్య‌క్తిగ‌త ఇళ్ల నిర్మాణం (బీఎల్‌సీ) ప‌ద్థ‌తిలో నిర్మించ‌నున్న‌ట్లు తెలిపారు. అలాగే, వరంగల్, కరీంనగర్ పట్టణాల్లో స్మార్ట్ సిటీ మిష‌న్ కింద చేప‌ట్టే ప‌నులు పూర్తి కాలేదని తెలియజేస్తూ, మిష‌న్ కాల ప‌రిమితి వచ్చే జూన్ 30తో ముగుస్తున్నందున ఆ గడువును జూన్ 2025 వ‌ర‌కు పొడిగించాల‌ని ముఖ్య‌మంత్రి గారు విజ్ఞప్తి చేశారు.

అభివృద్ధిలో చంద్రబాబుతో పోటీ పడతా : సీఎం రేవంత్ రెడ్డి - Basavatarakam IndoAmerican Hospital

ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ - 2023 డిసెంబర్‌ 9లోపు లోన్స్​ తీసుకున్నవారికే ఛాన్స్​ - Telangana Cabinet Meeting 2024

Last Updated : Jun 24, 2024, 10:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.