ETV Bharat / state

నాలుగో రోజూ కొనసాగుతున్న బోట్ల తొలగింపు ప్రక్రియ - సాయంత్రలోగా బయటకు తెస్తామంటున్న అధికారులు - Boat Removal at Prakasam Barrage

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 14, 2024, 2:00 PM IST

Boat Removal at Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్‌లో బోట్ల వెలికితీత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. బెకెమ్ సంస్థ ఆధ్వర్యంలో విశాఖకు చెందిన అబ్బులు బృందం వేగంగా పనులు చేస్తోంది. బోట్లు ఒకదానికొకటి ముడి పడి ఉండటంతో ప్రక్రియ క్లిష్టంగా మారింది. ఇవాళ ఒక బోటును బయటకు తెస్తామని అధికారులు తెలిపారు.

Boat Removal at Prakasam Barrage
Boat Removal at Prakasam Barrage (ETV Bharat)

Boat Removal at Prakasam Barrage : ప్రకాశం బ్యారేజ్‌ వద్ద బోట్లు తొలగింపు ప్రక్రియ అందర్ని ముప్పుతిప్పలు పెడుతోంది. నాలుగు రోజులుగా విస్తృతంగా బోట్ల వెలికితీతప్రక్రియ విస్తృతంగా సాగుతోంది. బోట్లను బయటకు తెచ్చేందుకు మూడు రోజలు అధికారులు, డైవింగ్ టీమ్‌ ఎంతో కృషి చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. అందుకే బోట్లను బయటకు తెచ్చేందుకు అందులో నిపుణుడైన అబ్బులు బృందాన్ని సైతం ప్రత్యేకంగా కాకినాడ నుంచి తీసుకు వచ్చారు.

బెకెమ్ సంస్థ ఆధ్వర్యంలో విశాఖకు చెందిన అబ్బులు బృందం వేగంగా పనులు చేస్తోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో 18 అడుగుల దిగువన రెండు బోట్లు చిక్కుకున్నాయి. బోట్లు ఒకదానికొకటి ముడి పడి ఉండటంతో ప్రక్రియ క్లిష్టంగా మారింది. శుక్రవారం సాయంత్రం బోట్లను కలిపివున్న చిక్కుముడిని బెకెమ్ సంస్థ విడదీసింది. బ్యారేజ్ నుంచి 200 మీటర్ల దూరం వరకు బోట్లను లాగేందుకు పొక్లెయిన్‌ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ ఒక బోటును బయటకు తెస్తామని అధికారులు తెలిపారు.

10 అడుగులు కదిలి బోల్తా పడింది - కొనసాగుతున్న బోట్ల వెలికితీత ప్రక్రియ - Boat Removal process on third day

Prakasam Barrage Boat Incident : ప్రకాశం బ్యారేజీ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ వరుసగా మూడోరోజూ కొనసాగింది. గేట్ల వద్ద చిక్కుకున్న నాలుగు భారీ పడవలను బయటకు తీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. రంగంలోకి దిగిన కాకినాడకు చెందిన పడవలను వెలికితీసే నిపుణుడు అబ్బులు నేతృత్వంలోని 14 మంది బృందం భారీ బోట్లు బయటకు లాగే ఏర్పాట్లు చేసింది. ఒక్కొకటి 50 టన్నుల పైగా బరువులాగే 7 భారీ పడవలతో రెస్క్యూ ఆపరేషన్ చేశారు.

ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లు తొలగింపు ప్రక్రియ వేగవంతం - రంగంలోకి మరో టీం - BOATS REMOVAL AT PRAKASAM BARRAGE

వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి - కేంద్ర బృందాన్ని కోరిన సీఎం చంద్రబాబు - Central Team Meet Chandrababu

భారీ పడవలను ఒక దానితో మరోటి అనుసంధానించి చిక్కుకున్న పడవలకు గొలుసులతో కట్టి బయటకు లాగే ప్రయత్నం చేశారు. విశాఖకు చెందిన డైవింగ్ టీంతో ఓ బోటును రెండుగా కోశారు. రెండుగా కోసిన ఆ బోటును తొలుత బయటకు లాగేందుకు ఏర్పాట్లు చేశారు. అనంతరం మిగిలిన 3 బోట్లనూ భారీ పడవల సాయంతో బయటకు తీయనున్నారు. బ్యారేజీ గోడలకు, గేట్లకు ఎక్కడా చిన్నపాటి నష్టం కూడా కలగకుండా బోట్లను తీసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీలైనంత త్వరలో బోట్లు బయటకు తీసేలా చర్యలు తీసుకుంటున్నారు.

ప్రకాశం బ్యారేజీలో బోట్ల కటింగ్​ వర్క్​ - మరో మూడురోజుల్లో తొలగింపు - Boats Removal At Prakasam Barrage

Boat Removal at Prakasam Barrage : ప్రకాశం బ్యారేజ్‌ వద్ద బోట్లు తొలగింపు ప్రక్రియ అందర్ని ముప్పుతిప్పలు పెడుతోంది. నాలుగు రోజులుగా విస్తృతంగా బోట్ల వెలికితీతప్రక్రియ విస్తృతంగా సాగుతోంది. బోట్లను బయటకు తెచ్చేందుకు మూడు రోజలు అధికారులు, డైవింగ్ టీమ్‌ ఎంతో కృషి చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. అందుకే బోట్లను బయటకు తెచ్చేందుకు అందులో నిపుణుడైన అబ్బులు బృందాన్ని సైతం ప్రత్యేకంగా కాకినాడ నుంచి తీసుకు వచ్చారు.

బెకెమ్ సంస్థ ఆధ్వర్యంలో విశాఖకు చెందిన అబ్బులు బృందం వేగంగా పనులు చేస్తోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో 18 అడుగుల దిగువన రెండు బోట్లు చిక్కుకున్నాయి. బోట్లు ఒకదానికొకటి ముడి పడి ఉండటంతో ప్రక్రియ క్లిష్టంగా మారింది. శుక్రవారం సాయంత్రం బోట్లను కలిపివున్న చిక్కుముడిని బెకెమ్ సంస్థ విడదీసింది. బ్యారేజ్ నుంచి 200 మీటర్ల దూరం వరకు బోట్లను లాగేందుకు పొక్లెయిన్‌ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ ఒక బోటును బయటకు తెస్తామని అధికారులు తెలిపారు.

10 అడుగులు కదిలి బోల్తా పడింది - కొనసాగుతున్న బోట్ల వెలికితీత ప్రక్రియ - Boat Removal process on third day

Prakasam Barrage Boat Incident : ప్రకాశం బ్యారేజీ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ వరుసగా మూడోరోజూ కొనసాగింది. గేట్ల వద్ద చిక్కుకున్న నాలుగు భారీ పడవలను బయటకు తీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. రంగంలోకి దిగిన కాకినాడకు చెందిన పడవలను వెలికితీసే నిపుణుడు అబ్బులు నేతృత్వంలోని 14 మంది బృందం భారీ బోట్లు బయటకు లాగే ఏర్పాట్లు చేసింది. ఒక్కొకటి 50 టన్నుల పైగా బరువులాగే 7 భారీ పడవలతో రెస్క్యూ ఆపరేషన్ చేశారు.

ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లు తొలగింపు ప్రక్రియ వేగవంతం - రంగంలోకి మరో టీం - BOATS REMOVAL AT PRAKASAM BARRAGE

వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి - కేంద్ర బృందాన్ని కోరిన సీఎం చంద్రబాబు - Central Team Meet Chandrababu

భారీ పడవలను ఒక దానితో మరోటి అనుసంధానించి చిక్కుకున్న పడవలకు గొలుసులతో కట్టి బయటకు లాగే ప్రయత్నం చేశారు. విశాఖకు చెందిన డైవింగ్ టీంతో ఓ బోటును రెండుగా కోశారు. రెండుగా కోసిన ఆ బోటును తొలుత బయటకు లాగేందుకు ఏర్పాట్లు చేశారు. అనంతరం మిగిలిన 3 బోట్లనూ భారీ పడవల సాయంతో బయటకు తీయనున్నారు. బ్యారేజీ గోడలకు, గేట్లకు ఎక్కడా చిన్నపాటి నష్టం కూడా కలగకుండా బోట్లను తీసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీలైనంత త్వరలో బోట్లు బయటకు తీసేలా చర్యలు తీసుకుంటున్నారు.

ప్రకాశం బ్యారేజీలో బోట్ల కటింగ్​ వర్క్​ - మరో మూడురోజుల్లో తొలగింపు - Boats Removal At Prakasam Barrage

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.