ETV Bharat / state

ఆదోనిలో బీజేపీ నేత దారుణ హత్య - గొంతు కోసి చంపిన దుండగులు - BJP Leader Murder in Adoni

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 19, 2024, 10:28 AM IST

Brutally Murdered BJP Leader in Adoni : కర్నూలు జిల్లాలో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. పెద్దహరివాణం గ్రామంలో ఇంటి ముందు నిద్రిస్తున్న శేఖన్నను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హతమార్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మృతుడు ఇటీవలే వైఎస్సార్సీపీని వీడి కమలం పార్టీలో చేరారు.

BJP Leader Murder in Adoni
BJP Leader Murder in Adoni (ETV Bharat)

BJP Leader Murder in Adoni : కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామంలో ఓ బీజేపీ నేతను దుండగులు హతమార్చారు. శేఖన్న అనే వ్యక్తి రాత్రి ఆరుబయట నిద్రపోయాడు. నిద్రలో ఉన్న అతణ్ని గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. మృతుడు కొద్దిరోజుల క్రితం వైఎస్సార్సీపీని వీడి ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో కమలం పార్టీలో చేరారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

ఆదోని డీఎస్పీ సోమన్న, తాలూకా సీఐ నల్లప్ప, ఐఎస్‌వీఐ ఎస్సై నాగేంద్ర హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శేఖన్నకు గ్రామంలో ఎలాంటి విభేదాలు లేవని స్థానికులు తెలిపారు ఆయన్ను హత్య చేయాల్సిన అవసరం ఎవరికీ లేదని చెప్పారు.

BJP Leader Murder in Adoni : కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామంలో ఓ బీజేపీ నేతను దుండగులు హతమార్చారు. శేఖన్న అనే వ్యక్తి రాత్రి ఆరుబయట నిద్రపోయాడు. నిద్రలో ఉన్న అతణ్ని గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. మృతుడు కొద్దిరోజుల క్రితం వైఎస్సార్సీపీని వీడి ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో కమలం పార్టీలో చేరారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

ఆదోని డీఎస్పీ సోమన్న, తాలూకా సీఐ నల్లప్ప, ఐఎస్‌వీఐ ఎస్సై నాగేంద్ర హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శేఖన్నకు గ్రామంలో ఎలాంటి విభేదాలు లేవని స్థానికులు తెలిపారు ఆయన్ను హత్య చేయాల్సిన అవసరం ఎవరికీ లేదని చెప్పారు.

'టీడీపీ శ్రేణుల సహనాన్ని పరీక్షించొద్దు - శ్రీను హత్య వెనక ఎవరున్నా వదిలిపెట్టం' - TDP Leader Srinu Murder in Kurnool

నంద్యాల జిల్లాలో దారుణం - కర్రలతో దాడి చేసి టీడీపీ నేత హత్య - TDP ACTIVIST BRUTAL MURDER

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.