ETV Bharat / state

కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్​న్యూస్ - ఫిజికల్ టెస్ట్ తేదీలు విడుదల - ఎప్పటినుంచంటే? - CONSTABLE PHYSICAL TEST DATES

ఈనెల(డిసెంబర్) 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు కానిస్టేబుల్‌ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు - ఈనెల 18న మధ్యాహ్నం 3 గంటల నుంచి దేహదారుఢ్య పరీక్షల కాల్‌లెటర్ల డౌన్‌లోడ్‌

AP Police Constable Recruitment on December 30 To February 1st
AP Police Constable Recruitment on December 30 To February 1st (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 12, 2024, 10:13 PM IST

AP Police Constable Recruitment on December 30 To February 1st : కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్​ న్యూస్ చెప్పింది. గత ప్రభుత్వంలో నిలిచిన పోలీసు కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ చేపడుతున్నట్లు పోలీసు రిక్రూట్ మెంట్ ఛైర్మన్ రవి ప్రకాష్ తెలిపారు. అర్హులైన అభ్యర్ధులకు ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫిజికల్ టెస్ట్​లు నిర్వహిస్తామని వెల్లడించారు. అభ్యర్ధులు ఈనెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు కాల్ లెటర్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఫిజికల్ టెస్ట్ కు హాజరయ్యే అభ్యర్థులు slprb.ap.gov.in వెబ్ సైట్ నుంచి కాల్ లెటర్లు డౌన్ లోడ్ చేసుకోవాలని రవిప్రకాష్ తెలిపారు.

ప్రాథమిక రాత పరీక్షలో 95,208 మంది అర్హత : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ కోసం 2022లో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. అనంతరం జనవరి 22న నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షకు 4,58,219 మంది హాజరయ్యారు. వారిలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఫిబ్రవరి 5న ఈ ఫలితాలు విడుదలయ్యాయి. వీరందరికీ ఆ వెంటనే రెండో దశలో దేహదారుఢ్య, శారీరక సామర్థ్య (పీఎంటీ, పీఈటీ) పరీక్షలు నిర్వహించాలి. గతేడాది మార్చి 13 నుంచి 20వ తేదీ వరకూ నిర్వహిస్తామంటూ మొదట షెడ్యూల్‌ విడుదల చేసి హాల్‌టికెట్లూ జారీ చేశారు. చివరికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సాకుతో దానిని వాయిదా వేశారు.

కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త - నియామక ప్రక్రియపై హోంమంత్రి ఏమన్నారంటే - POLICE CONSTABLE RECRUITMENT 2024

ఆ ఎన్నికలైపోయాక కూడా నియామక ప్రక్రియ కొనసాగించకుండా వైఎస్సార్సీపీ సర్కార్ ఆపేసింది. దీంతో అసలు ఈ పరీక్షలు నిర్వహిస్తారో లేదో తెలియక అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నోటిఫికేషన్‌ జారీ కంటే రెండు సంవత్సరాల ముందు నుంచే అభ్యర్థులు ఈ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. వేరే పనులు చేసుకోలేక, ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో అర్థం కాక వారు మనోవేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే వారికి ఊరట కలిగించేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

మూడు నెలల్లోనే నియామక ప్రక్రియ పూర్తి : అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ పాలనలో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ కోసం 2018 నవంబర్, డిసెంబర్ నెలల్లో నోటిఫికేషన్లు ఇచ్చారు. వాటికి సంబంధించిన ప్రాథమిక రాత పరీక్ష, దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలు, తుది రాత పరీక్ష అన్ని కేవలం మూడు నెలల్లోనే పూర్తి చేశారు. అంటే 2019 ఫిబ్రవరి నాటికే ఇవన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు కూడా అదే వేగంతో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

కానిస్టేబుల్​కు నిప్పంటించి హత్య చేసిన ప్రేయసి- వాంగ్మూలం మార్చి మరీ చనిపోయిన పోలీస్!

ఏపీలో కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్​ న్యూస్ - త్వరలోనే నియామక ప్రక్రియ స్టార్ట్ - CONSTABLE RECRUITMENT 2024

AP Police Constable Recruitment on December 30 To February 1st : కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్​ న్యూస్ చెప్పింది. గత ప్రభుత్వంలో నిలిచిన పోలీసు కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ చేపడుతున్నట్లు పోలీసు రిక్రూట్ మెంట్ ఛైర్మన్ రవి ప్రకాష్ తెలిపారు. అర్హులైన అభ్యర్ధులకు ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫిజికల్ టెస్ట్​లు నిర్వహిస్తామని వెల్లడించారు. అభ్యర్ధులు ఈనెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు కాల్ లెటర్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఫిజికల్ టెస్ట్ కు హాజరయ్యే అభ్యర్థులు slprb.ap.gov.in వెబ్ సైట్ నుంచి కాల్ లెటర్లు డౌన్ లోడ్ చేసుకోవాలని రవిప్రకాష్ తెలిపారు.

ప్రాథమిక రాత పరీక్షలో 95,208 మంది అర్హత : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ కోసం 2022లో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. అనంతరం జనవరి 22న నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షకు 4,58,219 మంది హాజరయ్యారు. వారిలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఫిబ్రవరి 5న ఈ ఫలితాలు విడుదలయ్యాయి. వీరందరికీ ఆ వెంటనే రెండో దశలో దేహదారుఢ్య, శారీరక సామర్థ్య (పీఎంటీ, పీఈటీ) పరీక్షలు నిర్వహించాలి. గతేడాది మార్చి 13 నుంచి 20వ తేదీ వరకూ నిర్వహిస్తామంటూ మొదట షెడ్యూల్‌ విడుదల చేసి హాల్‌టికెట్లూ జారీ చేశారు. చివరికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సాకుతో దానిని వాయిదా వేశారు.

కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త - నియామక ప్రక్రియపై హోంమంత్రి ఏమన్నారంటే - POLICE CONSTABLE RECRUITMENT 2024

ఆ ఎన్నికలైపోయాక కూడా నియామక ప్రక్రియ కొనసాగించకుండా వైఎస్సార్సీపీ సర్కార్ ఆపేసింది. దీంతో అసలు ఈ పరీక్షలు నిర్వహిస్తారో లేదో తెలియక అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నోటిఫికేషన్‌ జారీ కంటే రెండు సంవత్సరాల ముందు నుంచే అభ్యర్థులు ఈ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. వేరే పనులు చేసుకోలేక, ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో అర్థం కాక వారు మనోవేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే వారికి ఊరట కలిగించేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

మూడు నెలల్లోనే నియామక ప్రక్రియ పూర్తి : అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ పాలనలో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ కోసం 2018 నవంబర్, డిసెంబర్ నెలల్లో నోటిఫికేషన్లు ఇచ్చారు. వాటికి సంబంధించిన ప్రాథమిక రాత పరీక్ష, దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలు, తుది రాత పరీక్ష అన్ని కేవలం మూడు నెలల్లోనే పూర్తి చేశారు. అంటే 2019 ఫిబ్రవరి నాటికే ఇవన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు కూడా అదే వేగంతో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

కానిస్టేబుల్​కు నిప్పంటించి హత్య చేసిన ప్రేయసి- వాంగ్మూలం మార్చి మరీ చనిపోయిన పోలీస్!

ఏపీలో కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్​ న్యూస్ - త్వరలోనే నియామక ప్రక్రియ స్టార్ట్ - CONSTABLE RECRUITMENT 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.