Leopard Active in Kadiyam Nurseries of East Godavari District : తూర్పుగోదావరి జిల్లాలో చిరుతపులి సంచారం స్థానిక ప్రజలకు కొన్నిరోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రతిసారి వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ అధికారులకు చుక్కలు చూపిస్తోంది. తాాజాగా మరోసారి రూటు మార్చి కడియం నర్సరీలో పాగా వేసింది. చిరుతను బంధించేందుకు అటవీ శాఖ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కడియం నర్సరీలో పని చేస్తున్న 30 వేల మంది పైగా కూలీలు, నర్సరీల నిర్వహకులతోపాటు స్థానికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. | Read More
ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 26 September 2024
Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Thu Sep 26 2024- చిక్కదు, దొరకదు - రూటు మార్చి చుక్కలు చూపిస్తున్న చిరుత - Leopard Active in Kadiyam Nurseries
By Andhra Pradesh Live News Desk
Published : 20 hours ago
|Updated : 5 hours ago
చిక్కదు, దొరకదు - రూటు మార్చి చుక్కలు చూపిస్తున్న చిరుత - Leopard Active in Kadiyam Nurseries
తిరుపతి జిల్లాలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ - నెల రోజుల పాటు ఆంక్షలు - Section 30 Police Act in Tirupati
Section 30 Police Act Across Tirupati District: తిరుపతి జిల్లావ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తూ తిరుపతి ఎస్పీ ఆదేశారు జారీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నెలపాటు పోలీసు ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. | Read More
మామిడి చెట్లు తొలగిస్తుండగా బయటపడిన భారీ సొరంగం - చూసేందుకు ఎగబడుతున్న స్థానికులు - Huge Tunnel In Mango Farm
Huge Tunnel Discovered in Mango Farm: మామిడి చెట్లు తొలగిస్తుండగా ఓ సొరంగం బయట పడింది. ఈ ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సొరంగాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఆ సొరంగం బెలూం గుహలను పోలి ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. | Read More
తిరుమలలో పెరిగిన శ్రీవారి లడ్డూ విక్రయాలు - వారం రోజుల్లో ఎన్ని కొనుగోలు చేశారంటే? - Tirumala laddu sales increased
Tirumala Laddu Sales Increased: తిరుమలలో శ్రీవారి లడ్డూ విక్రయాలు భారీగా పెరిగాయి. స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడకంతో శ్రీవారి లడ్డూలు రుచికరంగా మారాయి. దీంతో వారం రోజుల్లో 23,13,202 లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. | Read More
యువతను నైపుణ్య శిక్షణ ద్వారా తీర్చిదిద్దాలి : సీఎం చంద్రబాబు - CM Review on Employement and Sports
CM Chandrababu Review on Employement and Sports: నైపుణ్య శిక్షణతో పరిశ్రమలకు అవసరమైన విధంగా యువతను తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. యువతలో నైపుణ్యాలు పెంపొందించే అంశంపై ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఆదేశించారు. యువజన సర్వీసులు, క్రీడల శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం నైపుణ్య గణనపై ఆరా తీశారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై అధికారులతో చర్చించారు. | Read More
ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలు - కాంగ్రెస్ అగ్రనేతలకు ఆహ్వానాలు - APCC State Executive Meeting
APCC State Executive Meeting Conducted in Vijayawada : రాష్ట్రంలో ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయి ఆందోళనలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆందోళన కార్యక్రమాలకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గేను ఆహ్వానించాలని రాష్ట్ర నాయకులు నిర్ణయించారు. | Read More
క్రీడల్లో సత్తా చాటుతున్న అక్కాచెల్లెళ్లు - అడ్డంకిగా మారిన ఆర్థిక ఇబ్బందులు - Vizianagaram Sisters Talent
Vizianagaram Sisters Show Talent in Martial Arts Taekwondo and Fencing : ఇద్దరు కూతుళ్లను కొడుకుల మాదిరిగా అన్నింటా ప్రోత్సహించాడా తండ్రి. దీంతో పాఠశాల స్థాయి నుంచే క్రీడల్లో సాధన చేసి ప్రతిభ కనబరిస్తున్నారు. తైక్వాండో, ఫెన్సింగ్ పోటీల్లో పతకాలే లక్ష్యంగా ప్రయత్నాలు మెుదలు పెట్టారు. ప్యాడ్ కడితే ప్రత్యర్థులపై విజయం తథ్యం అనేలా దూసుకెళ్తున్నారు విజయనగరానికి చెందిన శ్రీరూప్య, రేణుక. | Read More
చీటికి మాటికి యాంటీబయాటిక్స్ వాడుతున్నారా? - మితిమీరితే మీ పిల్లలకూ ముప్పేనట - Antibiotics Effects on Kids
Antibiotics Side Effects in Health : ఉబ్బసం వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఏటా పెరుగుతోందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో పిల్లలకు ఉబ్బసం రావడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రి సీనియర్ పీడియాట్రీషియన్ ప్రొఫెసర్ డాక్టర్ తోట ఉషారాణి ఈటీవీ భారత్కు వివరించారు. | Read More
పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్తత - జనసేన నేతల ఆందోళన, అరెస్టు - మళ్లీ రెచ్చిపోయిన నాని - Tension at Perni Nani House
Tension at Perni Nani House in Machilipatnam: తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పేర్ని నాని ఇంటి ముందు జనసేన నేతలు ఆందోళనకు దిగారు. పవన్ కల్యాణ్కు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దీంతో పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టూ వైఎస్సార్సీపీ కార్యకర్తలతో కలిసి జనసేన నేతలను అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనడంతో జనసైనికులను పోలీసులు అరెస్ట్ చేశారు. | Read More
చెరువులో భవనం - బాంబులతో కూల్చేసిన అధికారులు - వీడియో వైరల్ - Illegal Construction Demolition
Demolish in Malkapur : చెరువులో నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని అధికారులు బాంబుల ద్వారా నేలమట్టం చేశారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా మల్కాపూర్లో అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు, గ్రామస్థుల ఫిర్యాదు మేరకు ఇవాళ బహుళ అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు. ఈ క్రమంలో బాంబులు పేలి, శిథిలాలు ఎగిరిపడటంతో ఇద్దరికి గాయాలయ్యాయి. | Read More
తెలంగాణలో మూసీ ప్రక్షాళన - నిర్మాణాల తొలగింపునకు రంగం సిద్ధం - MUSI RIVER RE SURVEY
Musi River Re Survey : తెలంగాణలోని మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నదీ గర్భంలో నిర్మాణాలను తొలగించడానికి అక్కడి అధికారులు రంగంలోకి దిగారు. అర్హులైన నిర్వాసితులకు రెండు పడకల గదుల ఇళ్లను కేటాయించేందుకు మరోసారి క్షేత్ర స్థాయిలో రీ సర్వే చేస్తున్నారు. నదీ గర్భంలో ఉన్న నిర్మాణాలు, నివాసాల యజమానుల నుంచి ఇంటి పత్రాలు, ఆధార్ సహా ఇతర ముఖ్య వివరాలను సేకరిస్తున్నారు. | Read More
కన్నుల పండువగా పోలేరమ్మ జాతర - అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి - Venkatagiri Poleramma Jatara
Venkatagiri Poleramma Jatara in Tirupati District : తిరుపతి జిల్లా వెంకటగిరిలో పోలేరమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారిని లక్షలాది భక్తులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూల రథంలో అమ్మవారిని ఆలయం వరకు భక్తులు తీసుకువెళ్లారు. జాతర నిర్వహణకు రూ.50 లక్షలు ప్రభుత్వం జారీ చేసింది. | Read More
అతివల అస్తిత్వానికి అద్దం బతుకమ్మ - ఈ విషయాలు మీకు తెలుసా? - Bathukamma Festival History
Bathukamma Festival History in Telugu: పూలనే దైవంగా పూజించే ప్రత్యేక పండుగ బతుకమ్మ. మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచి ప్రకృతితో అనుబంధాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. అతివల అస్తిత్వానికి అద్దంపడుతూ వారి సృజనాత్మక శక్తిని ప్రకటిస్తుంది. పూల అమరిక నుంచి పాటల ఆలాపన వరకు ప్రతిదీ మనోహరంగా ఆవిష్కృతమవుతుంది. అక్టోబరు 2న బతుకమ్మ పండుగ ప్రారంభం కానుంది. | Read More
రాష్ట్రంలో నెత్తురోడిన రోడ్లు - ఆరుగురు మృతి - Several People Died in Accidents
Several People Died in Road Accidents Across the State: రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలలో పలువురు మరణించారు. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొనడంతో మంటలు చెలరేగి క్లీనర్ మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. ఉమ్మడి కృష్టా జిల్లాలో రెండు చోట్లు రోడ్డు ప్రమాదాలు జరగగా నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. | Read More
ఇకపై విజయ నెయ్యితోనే ప్రసాదాల తయారీ - దేవాలయాలకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశం - Telangana Govt on Vijaya Dairy Ghee
Telangana Govt on Temples about Ghee: రాష్ట్రంలోని ఆలయాల్లో లడ్డూలు, ఇతర ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిని ఇకపై విజయ డెయిరీ నుంచే కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇన్నాళ్లూ అన్ని దేవాలయాలు ప్రైవేటుకే ప్రాధాన్యమివ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ప్రభుత్వ డెయిరీ నుంచి కొనుగోలు చేయాలని కోరినా ఒక్క ఆలయం కూడా కొనలేదని గుర్తించింది. | Read More
ఈటీవీ బ్యూరో చీఫ్ ఆదినారాయణ మృతి - తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం - Senior ETV Journalist Adinarayana
ETV Hyderabad Bureau Chief Adinarayana Passed Away: సీనియర్ జర్నలిస్ట్, ఈటీవీ బ్యూరో చీఫ్ టి.ఆదినారాయణ కన్నుమూశారు. అపార్ట్మెంట్పై వాకింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడగా, కుటుంబసభ్యులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. | Read More
కూటమి ప్రభుత్వానికి అరుదైన విరాళం - రూ.6కోట్ల ఆస్తిని అప్పగించిన తెనాలి మహిళామండలి - Tenali Women Donated Property
Tenali Women Donated Property Worth Six Crores To The Government : ప్రభుత్వం మాకు పథకాలు అందించాలి. మా ప్రాంతంలో మౌలిక సదుపాయులు కల్పించాలని ప్రజలు ఆలోచిస్తుంటారు. కానీ గుంటూరు జిల్లా తెనాలి మహిళలు మాత్రం ప్రభుత్వానికే రూ.6 కోట్ల ఆస్తిని ఎదురిచ్చారు. అతివల అభ్యున్నతి కోసం విరాళాలు పోగేసి ఏర్పాటు చేసుకున్న భవనాన్ని సర్కారుకి అప్పగించారు. | Read More
టీడీపీ కార్యాలయంపై అటాక్ కేసు - దాడి చేసిన వారికి డబ్బులు - TDP Central Office Attack Case
TDP Central Office Attack Case Updates : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్సీపీ నాయకుల అక్రమాలు ఒక్కోక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఇన్నాళ్లు దాడికి సంబంధించిన విషయాలు తమకేమి తెలియదని బుకాయించిన ఆ పార్టీ నేతల బండారాన్ని పోలీసులు వెలుగులోకి తీసుకొస్తున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన వారికి వైఎస్సార్సీపీ నేతల ఖాతా నుంచి డబ్బులు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వారి ఖాతాల వివరాలు ఇవ్వాలని అడగగా వారు నిరాకరించినట్లు తెలిసింది. | Read More
'రాష్ట్రంలో బీర్లు పుష్కలం - కొరతేమీ లేదు!' - No Shortage Of Liquor Stocks
No Shortage Of Liquor Stocks: మందుబాబులకు అబ్కారీ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తీపి కబురు చెప్పారు. రాష్ట్రంలో భారతీయ తయారీ విదేశీ మద్యం(ఐఎంఎఫ్ఎల్) ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న నిల్వలు కనీసం 20 రోజుల వరకు సరిపోతాయని తెలిపారు. | Read More
మెరిసేదంతా బంగారం కాదు - ఎర్రగా ఉండేదంతా కారం కాదు - Adulteration Chilli Powder
Adulterated in Guntur Kaaram : కాదేది కల్తీకి అనర్హం అన్నట్లు ఆహార పదార్థాలన్నింటిని కల్తీ చేసి ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు అక్రమార్కులు. డబ్బులకు కక్కుర్తి పడి పండంటి జీవితాలను ఎండుటాకుల్లా మార్చేస్తున్నారు. మెరిసేదంతా బంగారం కాదన్నట్టు ఎర్రగా ఉన్నంత మాత్రాన అది అసలైన కారమే కాదు. మరీ అదెంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. | Read More
శ్రీశైలం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం - ఏళ్లుగా ఉద్యోగాల కోసం బాధితుల ఎదురుచూపులు - Srisailam victims waiting for jobs
Srisailam Project Solve Their Victims Problems : ఏళ్లు గడుస్తున్నా తమకు న్యాయం జరగడం లేదని శ్రీశైలం బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అప్పటి టీడీపీ ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సర్వం త్యాగం చేశారు. ఆ ఉద్యోగాల కోసం ఏళ్లుగా శ్రీశైలం బాధితులు ఏళ్లు తరబడి ఎదురుచూస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో జాబితా సిద్ధం చేసి బాధితులను ఊరించి ఊసురుమనిపించింది. కూటమి సర్కార్ అయిన ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేసుకుంటున్నారు. | Read More
కల్తీ నెయ్యిలో లేదు - ఆవులోనే ఏదో జరిగిందండీ: తమ్మినేని వివాదాస్పద వ్యాఖ్యలు - Tammineni Sitaram on Tirupati laddu
Tammineni Sitaram on Tirupati laddu Controversy: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీపై వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. నెయ్యిలో కల్తీ లేదని, పోషకాహార లోపంతో ఉన్న ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి కావొచ్చని అన్నారు. సీఎం చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో హిందువుల మనోభావాలు దెబ్బతినే దుస్థితి వచ్చిందని విమర్శించారు. | Read More
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం - ఏఆర్ డెయిరీ ఫుడ్స్పై కేసు - Case File on AR Foods
TTD Case File on AR Foods: శ్రీవారి లడ్డూ తయారీకి అపవిత్ర పదార్థాలు కలిపిన నెయ్యిని సరఫరా చేసిన గుత్తేదారుపై చర్యలకు ఉపక్రమించింది. టెండర్ నిబంధనలను అతిక్రమించి నాణ్యతలేని, కల్తీనెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్పై తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్వార్థపూరిత శక్తులతో కలసి కుట్రపూరితంగా వ్యవహరించడంతో పాటు ఆహార నాణ్యత, విలువలను పాటించని సంస్థపై విచారణ నిర్వహించాలని కోరింది. టీటీడీ ఫిర్యాదుతో ఆహార భద్రతా చట్టంలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. | Read More
దసరా పండుగకు ఇంటికి వెళ్తున్నారా? - అయితే మీకో శుభవార్త - dasara Special Buses
APSRTC SPECIAL BUSES FOR DUSSEHRA : దసరా పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. అందుకోసం వచ్చే నెల 3 నుంచి 12 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది. హైదరాబాద్లో విద్య, ఉద్యోగాల నిమిత్తం ఉంటున్న పలు జిల్లావాసుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నాన్నట్లు వెల్లడించారు. | Read More
వరద నీటిలో తిరిగిన బాలుడు - కుడి కాలు తొలగింపు - ఎందుకో తెలుసా? - Necrotizing Fasciitis Disease
Necrotizing Fasciitis Disease :అత్యంత అరుదుగా వచ్చే 'నెక్రోటైజింగ్ ఫాసియైటిస్' వ్యాధితో 12 ఏళ్ల భవదీప్ బాధపడుతుండటంతో ఆ చిన్నారి కుటుంబం తల్లడిల్లిపోతోంది. భవదీప్ శరీరంలోకి ప్రమాదకర బ్యాక్టీరియా చొచ్చుకుపోయి తినేయడంవల్ల కుడి కాలును తొడ భాగం వరకు తొలగించారు. ఎడమ మోకాలి కింద భాగంలో ముప్పై శాతం మేర కండను కూడా సూక్ష్మక్రిములు తినేశాయి. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే? | Read More
వైఎస్సార్సీపీ లిక్కర్ స్కాం అప్డేట్ - అస్మదీయులకే మద్యం ఆర్డర్లు - CID Inquiry on YSRCP Liquor Scam
CID Investigation on YSRCP Liquor Scam : జగన్ హయాంలో మద్యం కొనుగోలులో దోపిడీపై సీఐడీకి కీలక ఆధారాలు లభించాయి. వరుసగా రెండో రోజు ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన సీఐడీ కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. వైఎస్సార్సీపీలో నంబర్ టూ గా చలామణీ అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ఎంపీ మిథున్రెడ్డి గుప్పెట్లో ఉన్న కంపెనీకే అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చినట్లు గుర్తించింది. విజయసాయిరెడ్డి అల్లుడి బినామీ సంస్థ ఆదాన్ డిస్టిలరీస్కూ ఎక్కువ ఆర్డర్లు ఇచ్చారని దర్యాప్తులో తేల్చింది. కేవలం అస్మదీయ, కమీషన్లు చెల్లించిన కంపెనీలకే 90 శాతం ఆర్డర్లు ఇచ్చారని బేసిక్ ప్రైస్ పెంచేసి అనుచిత లబ్ధి పొందారని నిర్ధారించింది. ఈ నేపథ్యంలో మిథున్రెడ్డి సహా మరికొందరిని నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. | Read More
శ్రీవారి లడ్డూలో నెయ్యితో పాటు మరెన్నో పదార్థాలు కల్తీ! - విజిలెన్స్ విచారణలో విస్తుపోయే అంశాలు - Srivari Prasadam Controversy
Inferior Ingredients in Srivari Prasadam: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని గత కొంత కాలంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. నెయ్యి కల్తీ మాత్రమే కాదని స్వామివారి ప్రసాదాల్లో జీడి పప్పు, యాలకులు, కిస్మిస్ వంటివన్నీ నాసిరకమే వాడేవారని, చాలా వస్తువుల కొనుగోళ్లలో గోల్మాల్ జరిగిందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దర్యాప్తులో వెల్లడైనట్టు సమాచారం. ఈ దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగు చూసినట్టు సమాచారం. | Read More
చిక్కదు, దొరకదు - రూటు మార్చి చుక్కలు చూపిస్తున్న చిరుత - Leopard Active in Kadiyam Nurseries
Leopard Active in Kadiyam Nurseries of East Godavari District : తూర్పుగోదావరి జిల్లాలో చిరుతపులి సంచారం స్థానిక ప్రజలకు కొన్నిరోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రతిసారి వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ అధికారులకు చుక్కలు చూపిస్తోంది. తాాజాగా మరోసారి రూటు మార్చి కడియం నర్సరీలో పాగా వేసింది. చిరుతను బంధించేందుకు అటవీ శాఖ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కడియం నర్సరీలో పని చేస్తున్న 30 వేల మంది పైగా కూలీలు, నర్సరీల నిర్వహకులతోపాటు స్థానికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. | Read More
తిరుపతి జిల్లాలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ - నెల రోజుల పాటు ఆంక్షలు - Section 30 Police Act in Tirupati
Section 30 Police Act Across Tirupati District: తిరుపతి జిల్లావ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తూ తిరుపతి ఎస్పీ ఆదేశారు జారీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నెలపాటు పోలీసు ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. | Read More
మామిడి చెట్లు తొలగిస్తుండగా బయటపడిన భారీ సొరంగం - చూసేందుకు ఎగబడుతున్న స్థానికులు - Huge Tunnel In Mango Farm
Huge Tunnel Discovered in Mango Farm: మామిడి చెట్లు తొలగిస్తుండగా ఓ సొరంగం బయట పడింది. ఈ ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సొరంగాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఆ సొరంగం బెలూం గుహలను పోలి ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. | Read More
తిరుమలలో పెరిగిన శ్రీవారి లడ్డూ విక్రయాలు - వారం రోజుల్లో ఎన్ని కొనుగోలు చేశారంటే? - Tirumala laddu sales increased
Tirumala Laddu Sales Increased: తిరుమలలో శ్రీవారి లడ్డూ విక్రయాలు భారీగా పెరిగాయి. స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడకంతో శ్రీవారి లడ్డూలు రుచికరంగా మారాయి. దీంతో వారం రోజుల్లో 23,13,202 లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. | Read More
యువతను నైపుణ్య శిక్షణ ద్వారా తీర్చిదిద్దాలి : సీఎం చంద్రబాబు - CM Review on Employement and Sports
CM Chandrababu Review on Employement and Sports: నైపుణ్య శిక్షణతో పరిశ్రమలకు అవసరమైన విధంగా యువతను తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. యువతలో నైపుణ్యాలు పెంపొందించే అంశంపై ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఆదేశించారు. యువజన సర్వీసులు, క్రీడల శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం నైపుణ్య గణనపై ఆరా తీశారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై అధికారులతో చర్చించారు. | Read More
ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలు - కాంగ్రెస్ అగ్రనేతలకు ఆహ్వానాలు - APCC State Executive Meeting
APCC State Executive Meeting Conducted in Vijayawada : రాష్ట్రంలో ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయి ఆందోళనలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆందోళన కార్యక్రమాలకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గేను ఆహ్వానించాలని రాష్ట్ర నాయకులు నిర్ణయించారు. | Read More
క్రీడల్లో సత్తా చాటుతున్న అక్కాచెల్లెళ్లు - అడ్డంకిగా మారిన ఆర్థిక ఇబ్బందులు - Vizianagaram Sisters Talent
Vizianagaram Sisters Show Talent in Martial Arts Taekwondo and Fencing : ఇద్దరు కూతుళ్లను కొడుకుల మాదిరిగా అన్నింటా ప్రోత్సహించాడా తండ్రి. దీంతో పాఠశాల స్థాయి నుంచే క్రీడల్లో సాధన చేసి ప్రతిభ కనబరిస్తున్నారు. తైక్వాండో, ఫెన్సింగ్ పోటీల్లో పతకాలే లక్ష్యంగా ప్రయత్నాలు మెుదలు పెట్టారు. ప్యాడ్ కడితే ప్రత్యర్థులపై విజయం తథ్యం అనేలా దూసుకెళ్తున్నారు విజయనగరానికి చెందిన శ్రీరూప్య, రేణుక. | Read More
చీటికి మాటికి యాంటీబయాటిక్స్ వాడుతున్నారా? - మితిమీరితే మీ పిల్లలకూ ముప్పేనట - Antibiotics Effects on Kids
Antibiotics Side Effects in Health : ఉబ్బసం వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఏటా పెరుగుతోందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో పిల్లలకు ఉబ్బసం రావడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రి సీనియర్ పీడియాట్రీషియన్ ప్రొఫెసర్ డాక్టర్ తోట ఉషారాణి ఈటీవీ భారత్కు వివరించారు. | Read More
పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్తత - జనసేన నేతల ఆందోళన, అరెస్టు - మళ్లీ రెచ్చిపోయిన నాని - Tension at Perni Nani House
Tension at Perni Nani House in Machilipatnam: తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పేర్ని నాని ఇంటి ముందు జనసేన నేతలు ఆందోళనకు దిగారు. పవన్ కల్యాణ్కు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దీంతో పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టూ వైఎస్సార్సీపీ కార్యకర్తలతో కలిసి జనసేన నేతలను అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనడంతో జనసైనికులను పోలీసులు అరెస్ట్ చేశారు. | Read More
చెరువులో భవనం - బాంబులతో కూల్చేసిన అధికారులు - వీడియో వైరల్ - Illegal Construction Demolition
Demolish in Malkapur : చెరువులో నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని అధికారులు బాంబుల ద్వారా నేలమట్టం చేశారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా మల్కాపూర్లో అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు, గ్రామస్థుల ఫిర్యాదు మేరకు ఇవాళ బహుళ అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు. ఈ క్రమంలో బాంబులు పేలి, శిథిలాలు ఎగిరిపడటంతో ఇద్దరికి గాయాలయ్యాయి. | Read More
తెలంగాణలో మూసీ ప్రక్షాళన - నిర్మాణాల తొలగింపునకు రంగం సిద్ధం - MUSI RIVER RE SURVEY
Musi River Re Survey : తెలంగాణలోని మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నదీ గర్భంలో నిర్మాణాలను తొలగించడానికి అక్కడి అధికారులు రంగంలోకి దిగారు. అర్హులైన నిర్వాసితులకు రెండు పడకల గదుల ఇళ్లను కేటాయించేందుకు మరోసారి క్షేత్ర స్థాయిలో రీ సర్వే చేస్తున్నారు. నదీ గర్భంలో ఉన్న నిర్మాణాలు, నివాసాల యజమానుల నుంచి ఇంటి పత్రాలు, ఆధార్ సహా ఇతర ముఖ్య వివరాలను సేకరిస్తున్నారు. | Read More
కన్నుల పండువగా పోలేరమ్మ జాతర - అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి - Venkatagiri Poleramma Jatara
Venkatagiri Poleramma Jatara in Tirupati District : తిరుపతి జిల్లా వెంకటగిరిలో పోలేరమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారిని లక్షలాది భక్తులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూల రథంలో అమ్మవారిని ఆలయం వరకు భక్తులు తీసుకువెళ్లారు. జాతర నిర్వహణకు రూ.50 లక్షలు ప్రభుత్వం జారీ చేసింది. | Read More
అతివల అస్తిత్వానికి అద్దం బతుకమ్మ - ఈ విషయాలు మీకు తెలుసా? - Bathukamma Festival History
Bathukamma Festival History in Telugu: పూలనే దైవంగా పూజించే ప్రత్యేక పండుగ బతుకమ్మ. మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచి ప్రకృతితో అనుబంధాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. అతివల అస్తిత్వానికి అద్దంపడుతూ వారి సృజనాత్మక శక్తిని ప్రకటిస్తుంది. పూల అమరిక నుంచి పాటల ఆలాపన వరకు ప్రతిదీ మనోహరంగా ఆవిష్కృతమవుతుంది. అక్టోబరు 2న బతుకమ్మ పండుగ ప్రారంభం కానుంది. | Read More
రాష్ట్రంలో నెత్తురోడిన రోడ్లు - ఆరుగురు మృతి - Several People Died in Accidents
Several People Died in Road Accidents Across the State: రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలలో పలువురు మరణించారు. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొనడంతో మంటలు చెలరేగి క్లీనర్ మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. ఉమ్మడి కృష్టా జిల్లాలో రెండు చోట్లు రోడ్డు ప్రమాదాలు జరగగా నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. | Read More
ఇకపై విజయ నెయ్యితోనే ప్రసాదాల తయారీ - దేవాలయాలకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశం - Telangana Govt on Vijaya Dairy Ghee
Telangana Govt on Temples about Ghee: రాష్ట్రంలోని ఆలయాల్లో లడ్డూలు, ఇతర ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిని ఇకపై విజయ డెయిరీ నుంచే కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇన్నాళ్లూ అన్ని దేవాలయాలు ప్రైవేటుకే ప్రాధాన్యమివ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ప్రభుత్వ డెయిరీ నుంచి కొనుగోలు చేయాలని కోరినా ఒక్క ఆలయం కూడా కొనలేదని గుర్తించింది. | Read More
ఈటీవీ బ్యూరో చీఫ్ ఆదినారాయణ మృతి - తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం - Senior ETV Journalist Adinarayana
ETV Hyderabad Bureau Chief Adinarayana Passed Away: సీనియర్ జర్నలిస్ట్, ఈటీవీ బ్యూరో చీఫ్ టి.ఆదినారాయణ కన్నుమూశారు. అపార్ట్మెంట్పై వాకింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడగా, కుటుంబసభ్యులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. | Read More
కూటమి ప్రభుత్వానికి అరుదైన విరాళం - రూ.6కోట్ల ఆస్తిని అప్పగించిన తెనాలి మహిళామండలి - Tenali Women Donated Property
Tenali Women Donated Property Worth Six Crores To The Government : ప్రభుత్వం మాకు పథకాలు అందించాలి. మా ప్రాంతంలో మౌలిక సదుపాయులు కల్పించాలని ప్రజలు ఆలోచిస్తుంటారు. కానీ గుంటూరు జిల్లా తెనాలి మహిళలు మాత్రం ప్రభుత్వానికే రూ.6 కోట్ల ఆస్తిని ఎదురిచ్చారు. అతివల అభ్యున్నతి కోసం విరాళాలు పోగేసి ఏర్పాటు చేసుకున్న భవనాన్ని సర్కారుకి అప్పగించారు. | Read More
టీడీపీ కార్యాలయంపై అటాక్ కేసు - దాడి చేసిన వారికి డబ్బులు - TDP Central Office Attack Case
TDP Central Office Attack Case Updates : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్సీపీ నాయకుల అక్రమాలు ఒక్కోక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఇన్నాళ్లు దాడికి సంబంధించిన విషయాలు తమకేమి తెలియదని బుకాయించిన ఆ పార్టీ నేతల బండారాన్ని పోలీసులు వెలుగులోకి తీసుకొస్తున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన వారికి వైఎస్సార్సీపీ నేతల ఖాతా నుంచి డబ్బులు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వారి ఖాతాల వివరాలు ఇవ్వాలని అడగగా వారు నిరాకరించినట్లు తెలిసింది. | Read More
'రాష్ట్రంలో బీర్లు పుష్కలం - కొరతేమీ లేదు!' - No Shortage Of Liquor Stocks
No Shortage Of Liquor Stocks: మందుబాబులకు అబ్కారీ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తీపి కబురు చెప్పారు. రాష్ట్రంలో భారతీయ తయారీ విదేశీ మద్యం(ఐఎంఎఫ్ఎల్) ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న నిల్వలు కనీసం 20 రోజుల వరకు సరిపోతాయని తెలిపారు. | Read More
మెరిసేదంతా బంగారం కాదు - ఎర్రగా ఉండేదంతా కారం కాదు - Adulteration Chilli Powder
Adulterated in Guntur Kaaram : కాదేది కల్తీకి అనర్హం అన్నట్లు ఆహార పదార్థాలన్నింటిని కల్తీ చేసి ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు అక్రమార్కులు. డబ్బులకు కక్కుర్తి పడి పండంటి జీవితాలను ఎండుటాకుల్లా మార్చేస్తున్నారు. మెరిసేదంతా బంగారం కాదన్నట్టు ఎర్రగా ఉన్నంత మాత్రాన అది అసలైన కారమే కాదు. మరీ అదెంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. | Read More
శ్రీశైలం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం - ఏళ్లుగా ఉద్యోగాల కోసం బాధితుల ఎదురుచూపులు - Srisailam victims waiting for jobs
Srisailam Project Solve Their Victims Problems : ఏళ్లు గడుస్తున్నా తమకు న్యాయం జరగడం లేదని శ్రీశైలం బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అప్పటి టీడీపీ ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సర్వం త్యాగం చేశారు. ఆ ఉద్యోగాల కోసం ఏళ్లుగా శ్రీశైలం బాధితులు ఏళ్లు తరబడి ఎదురుచూస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో జాబితా సిద్ధం చేసి బాధితులను ఊరించి ఊసురుమనిపించింది. కూటమి సర్కార్ అయిన ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేసుకుంటున్నారు. | Read More
కల్తీ నెయ్యిలో లేదు - ఆవులోనే ఏదో జరిగిందండీ: తమ్మినేని వివాదాస్పద వ్యాఖ్యలు - Tammineni Sitaram on Tirupati laddu
Tammineni Sitaram on Tirupati laddu Controversy: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీపై వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. నెయ్యిలో కల్తీ లేదని, పోషకాహార లోపంతో ఉన్న ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి కావొచ్చని అన్నారు. సీఎం చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో హిందువుల మనోభావాలు దెబ్బతినే దుస్థితి వచ్చిందని విమర్శించారు. | Read More
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం - ఏఆర్ డెయిరీ ఫుడ్స్పై కేసు - Case File on AR Foods
TTD Case File on AR Foods: శ్రీవారి లడ్డూ తయారీకి అపవిత్ర పదార్థాలు కలిపిన నెయ్యిని సరఫరా చేసిన గుత్తేదారుపై చర్యలకు ఉపక్రమించింది. టెండర్ నిబంధనలను అతిక్రమించి నాణ్యతలేని, కల్తీనెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్పై తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్వార్థపూరిత శక్తులతో కలసి కుట్రపూరితంగా వ్యవహరించడంతో పాటు ఆహార నాణ్యత, విలువలను పాటించని సంస్థపై విచారణ నిర్వహించాలని కోరింది. టీటీడీ ఫిర్యాదుతో ఆహార భద్రతా చట్టంలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. | Read More
దసరా పండుగకు ఇంటికి వెళ్తున్నారా? - అయితే మీకో శుభవార్త - dasara Special Buses
APSRTC SPECIAL BUSES FOR DUSSEHRA : దసరా పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. అందుకోసం వచ్చే నెల 3 నుంచి 12 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది. హైదరాబాద్లో విద్య, ఉద్యోగాల నిమిత్తం ఉంటున్న పలు జిల్లావాసుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నాన్నట్లు వెల్లడించారు. | Read More
వరద నీటిలో తిరిగిన బాలుడు - కుడి కాలు తొలగింపు - ఎందుకో తెలుసా? - Necrotizing Fasciitis Disease
Necrotizing Fasciitis Disease :అత్యంత అరుదుగా వచ్చే 'నెక్రోటైజింగ్ ఫాసియైటిస్' వ్యాధితో 12 ఏళ్ల భవదీప్ బాధపడుతుండటంతో ఆ చిన్నారి కుటుంబం తల్లడిల్లిపోతోంది. భవదీప్ శరీరంలోకి ప్రమాదకర బ్యాక్టీరియా చొచ్చుకుపోయి తినేయడంవల్ల కుడి కాలును తొడ భాగం వరకు తొలగించారు. ఎడమ మోకాలి కింద భాగంలో ముప్పై శాతం మేర కండను కూడా సూక్ష్మక్రిములు తినేశాయి. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే? | Read More
వైఎస్సార్సీపీ లిక్కర్ స్కాం అప్డేట్ - అస్మదీయులకే మద్యం ఆర్డర్లు - CID Inquiry on YSRCP Liquor Scam
CID Investigation on YSRCP Liquor Scam : జగన్ హయాంలో మద్యం కొనుగోలులో దోపిడీపై సీఐడీకి కీలక ఆధారాలు లభించాయి. వరుసగా రెండో రోజు ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన సీఐడీ కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. వైఎస్సార్సీపీలో నంబర్ టూ గా చలామణీ అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ఎంపీ మిథున్రెడ్డి గుప్పెట్లో ఉన్న కంపెనీకే అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చినట్లు గుర్తించింది. విజయసాయిరెడ్డి అల్లుడి బినామీ సంస్థ ఆదాన్ డిస్టిలరీస్కూ ఎక్కువ ఆర్డర్లు ఇచ్చారని దర్యాప్తులో తేల్చింది. కేవలం అస్మదీయ, కమీషన్లు చెల్లించిన కంపెనీలకే 90 శాతం ఆర్డర్లు ఇచ్చారని బేసిక్ ప్రైస్ పెంచేసి అనుచిత లబ్ధి పొందారని నిర్ధారించింది. ఈ నేపథ్యంలో మిథున్రెడ్డి సహా మరికొందరిని నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. | Read More
శ్రీవారి లడ్డూలో నెయ్యితో పాటు మరెన్నో పదార్థాలు కల్తీ! - విజిలెన్స్ విచారణలో విస్తుపోయే అంశాలు - Srivari Prasadam Controversy
Inferior Ingredients in Srivari Prasadam: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని గత కొంత కాలంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. నెయ్యి కల్తీ మాత్రమే కాదని స్వామివారి ప్రసాదాల్లో జీడి పప్పు, యాలకులు, కిస్మిస్ వంటివన్నీ నాసిరకమే వాడేవారని, చాలా వస్తువుల కొనుగోళ్లలో గోల్మాల్ జరిగిందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దర్యాప్తులో వెల్లడైనట్టు సమాచారం. ఈ దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగు చూసినట్టు సమాచారం. | Read More