ETV Bharat / state

వైఎస్సార్సీపీ నేతలకు హైకోర్టులో చుక్కెదురు - ముందస్తు బెయిల్ నిరాకరణ - AP HC on YSRCP Bail Petitions

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2024, 11:15 AM IST

Updated : Sep 4, 2024, 12:01 PM IST

High Court Denies YSRCP Leaders Bail Petitions : వైఎస్సార్సీపీ నేతలకు హైకోర్టులో చుక్కెదురైంది. టీడీపీ ఆఫీస్​పై దాడి కేసులో, చంద్రబాబు నివాసంపై దాడి కేసులోనూ ముందస్తు బెయిల్​ను నిరాకరించింది.

AP HC on YSRCP Bail Petitions
AP HC on YSRCP Bail Petitions (ETV Bharat)

AP HC Rejects YSRCP Bail Petitions : వైఎస్సార్సీపీ నేతలకు హైకోర్టులో నిరాశ ఎదురైంది. వారి ముందస్తు బెయిల్ పిటిషన్లను నిరాకరించింది. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో, చంద్రబాబు నివాసంపై దాడి కేసులోనూ వారికి బెయిల్​ను నిరాకరించింది. సుప్రీంకోర్టుకు అప్పీల్‌ చేసుకునేంతవరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలన్న వైఎస్సార్సీపీ నాయకులు న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. రెండు వారాలు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని వారు కోరారు. ఈ క్రమంలోనే అరెస్ట్ నుంచి వారికి మినహాయింపు ఇవ్వొద్దని టీడీపీ తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి వివరించారు. దీనిపై మధ్యాహ్నం తర్వాత హైకోర్టు నిర్ణయాన్ని వెలువరించనుంది.

Mangalagiri TDP Office Attack Case : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో టీడీపీ ఆఫీస్‌పై పట్టపగలే వందలాది మంది దాడి చేశారు. కార్యాలయంలో ఫర్నిచర్‌, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో దేవినేని అవినాశ్, నందిగం సురేశ్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం నిందితులుగా ఉన్నారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేశ్ నిందితుడిగా ఉన్నారు. ఈ రెండు కేసుల్లోనూ సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వీటితో వైఎఎస్సార్సీపీ నేతలకు ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. కానీ ఈ రెండు ఘటనలు జరిగినప్పుడు వైఎస్సార్సీపీ అధికారంలో ఉండటంతో అప్పటి పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

AP HC Rejects YSRCP Bail Petitions : వైఎస్సార్సీపీ నేతలకు హైకోర్టులో నిరాశ ఎదురైంది. వారి ముందస్తు బెయిల్ పిటిషన్లను నిరాకరించింది. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో, చంద్రబాబు నివాసంపై దాడి కేసులోనూ వారికి బెయిల్​ను నిరాకరించింది. సుప్రీంకోర్టుకు అప్పీల్‌ చేసుకునేంతవరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలన్న వైఎస్సార్సీపీ నాయకులు న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. రెండు వారాలు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని వారు కోరారు. ఈ క్రమంలోనే అరెస్ట్ నుంచి వారికి మినహాయింపు ఇవ్వొద్దని టీడీపీ తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి వివరించారు. దీనిపై మధ్యాహ్నం తర్వాత హైకోర్టు నిర్ణయాన్ని వెలువరించనుంది.

Mangalagiri TDP Office Attack Case : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో టీడీపీ ఆఫీస్‌పై పట్టపగలే వందలాది మంది దాడి చేశారు. కార్యాలయంలో ఫర్నిచర్‌, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో దేవినేని అవినాశ్, నందిగం సురేశ్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం నిందితులుగా ఉన్నారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేశ్ నిందితుడిగా ఉన్నారు. ఈ రెండు కేసుల్లోనూ సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వీటితో వైఎఎస్సార్సీపీ నేతలకు ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. కానీ ఈ రెండు ఘటనలు జరిగినప్పుడు వైఎస్సార్సీపీ అధికారంలో ఉండటంతో అప్పటి పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

'దాడిని ఏ విధంగా చూడాలో మీరే చెప్పండి' - వైఎస్సార్సీపీ నేతలను ప్రశ్నించిన హైకోర్టు - Mangalagiri TDP Office Attack Case

Last Updated : Sep 4, 2024, 12:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.