ETV Bharat / state

రైతులకు అలర్ట్ - ఈ-పంట నమోదు ప్రక్రియ పూర్తి చేసుకున్నారా? లేకుంటే అంతే సంగతులు! - government on e crop registrations

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 16, 2024, 10:28 AM IST

Government has Expedited the E Crop Registration Process : ప్రభుత్వం ఈ-పంట నమోదు ప్రక్రియను వేగవంతం చేసింది. వ్యవసాయ సహాయకులు, వీఆర్వోలు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ఏ రైతుకు ఎంత భూమి ఉంది, ఏయే పంటలు సాగు చేస్తున్నారు, ఇలా అన్ని వివరాలను నమోదు చేస్తున్నారు. రైతులందరూ అవగాహనతో తమ పంట వివరాలు నమోదు చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు. పంట నష్టం పరిహారంతోపాటు ఉత్పత్తులను విక్రయించాలన్నా ఈ-పంట వివరాలే ఆధారని చెబుతున్నారు.

Government has Expedited the E Crop Registration Process
Government has Expedited the E Crop Registration Process (ETV Bharat)

Government has Expedited the E Crop Registration Process : రైతులకు ప్రభుత్వపరంగా ఎలాంటి సేవలు, సాయం అందాలన్న ఈ-పంట నమోదు తప్పని సరి. ఇటీవల కురిసిన వర్షాలు, వచ్చిన వరద కారణంగా జిల్లా వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటివరకు 3,60,658 ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 28,538 ఎకరాల్లో ఉద్యాన పంటలు కలిపి మొత్తం 3,89,197 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇటీవల వరకు పంట నమోదు ప్రక్రియ ఆశించినస్థాయిలో సాగలేదు. ప్రస్తుతం పంటలు దెబ్బతిన్న కారణంగా ప్రభుత్వ ఆదేశాలతో ప్రక్రియను వేగవంతం చేశారు. వ్యవసాయ సహాయకులు, వీఆర్వోలు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ఏ రైతుకు ఎంత భూమి ఉంది , ఏయే పంటలు సాగు చేస్తున్నారు, ఇలా అన్ని వివరాలను నమోదు చేస్తున్నారు.

ఎక్కడెక్కడ ఎంతంటే : ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటివరకు పెడన, పెనమలూరు, నందివాడ మండలాల్లో నూరు శాతం పంట నమోదు పూర్తి చేయగా బాపులపాడు, గన్నవరం మండలాల్లో 99 శాతం పూర్తయ్యింది. బందరు సౌత్‌ 63.4, అవనిగడ్డ 63.9, బందరు నార్త్‌లో 65.1 శాతంతో వెనుకబడి ఉన్నాయి. కోడూరు 88, నాగాయలంక 87, కృత్తివెన్ను 86, పమిడిముక్కల 84.9 మోపిదేవి మండలం 70 శాతంతో ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇంకా 29,846 ఎకరాలు ఈ పంటలో నమోదు చేయాల్సి ఉంది.

పీఎం కిసాన్​, పంట నమోదుకు ఈ కేవైసీ తప్పనిసరి- లేదంటే నష్టపోక తప్పదు - PM Kisan E KYC

అవగాహన అవసరం : పంట నమోదుకు గానూ రైతులు తమ ఆధార్, చరవాణి సంఖ్య, సర్వే నంబరు, పంట వివరాలను అధికారులకు చెప్పడంతోపాటు పొలం వద్దకు తీసుకెళ్తే వేసిన పంటతోపాటు రైతు ఫొటో కూడా నమోదు చేస్తారు. కొందరు రైతులు అందుబాటులో లేక పోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. రైతులు అందరూ అవగాహనతో తమ పంట వివరాలు నమోదు చేయించుకోవాలని కోరుతున్నారు. పంట నష్టం పరిహారంతోపాటు ఉత్పత్తులను విక్రయించాలన్నా ఈ-పంట వివరాలే ఆధారం.

అన్నదాతల అగచాట్లు - శీతల గోదాములు లేక పంటను నిల్వ చేసేందుకు విలవిల - FARMERS SUFFERING IN GUNTUR

బుడమేరు వరదతో పత్తి పంట నాశనం - ఆత్మహత్యే శరణ్యమంటున్న రైతులు - COTTON CROP DAMAGE DUE TO FLOODS

Government has Expedited the E Crop Registration Process : రైతులకు ప్రభుత్వపరంగా ఎలాంటి సేవలు, సాయం అందాలన్న ఈ-పంట నమోదు తప్పని సరి. ఇటీవల కురిసిన వర్షాలు, వచ్చిన వరద కారణంగా జిల్లా వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటివరకు 3,60,658 ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 28,538 ఎకరాల్లో ఉద్యాన పంటలు కలిపి మొత్తం 3,89,197 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇటీవల వరకు పంట నమోదు ప్రక్రియ ఆశించినస్థాయిలో సాగలేదు. ప్రస్తుతం పంటలు దెబ్బతిన్న కారణంగా ప్రభుత్వ ఆదేశాలతో ప్రక్రియను వేగవంతం చేశారు. వ్యవసాయ సహాయకులు, వీఆర్వోలు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ఏ రైతుకు ఎంత భూమి ఉంది , ఏయే పంటలు సాగు చేస్తున్నారు, ఇలా అన్ని వివరాలను నమోదు చేస్తున్నారు.

ఎక్కడెక్కడ ఎంతంటే : ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటివరకు పెడన, పెనమలూరు, నందివాడ మండలాల్లో నూరు శాతం పంట నమోదు పూర్తి చేయగా బాపులపాడు, గన్నవరం మండలాల్లో 99 శాతం పూర్తయ్యింది. బందరు సౌత్‌ 63.4, అవనిగడ్డ 63.9, బందరు నార్త్‌లో 65.1 శాతంతో వెనుకబడి ఉన్నాయి. కోడూరు 88, నాగాయలంక 87, కృత్తివెన్ను 86, పమిడిముక్కల 84.9 మోపిదేవి మండలం 70 శాతంతో ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇంకా 29,846 ఎకరాలు ఈ పంటలో నమోదు చేయాల్సి ఉంది.

పీఎం కిసాన్​, పంట నమోదుకు ఈ కేవైసీ తప్పనిసరి- లేదంటే నష్టపోక తప్పదు - PM Kisan E KYC

అవగాహన అవసరం : పంట నమోదుకు గానూ రైతులు తమ ఆధార్, చరవాణి సంఖ్య, సర్వే నంబరు, పంట వివరాలను అధికారులకు చెప్పడంతోపాటు పొలం వద్దకు తీసుకెళ్తే వేసిన పంటతోపాటు రైతు ఫొటో కూడా నమోదు చేస్తారు. కొందరు రైతులు అందుబాటులో లేక పోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. రైతులు అందరూ అవగాహనతో తమ పంట వివరాలు నమోదు చేయించుకోవాలని కోరుతున్నారు. పంట నష్టం పరిహారంతోపాటు ఉత్పత్తులను విక్రయించాలన్నా ఈ-పంట వివరాలే ఆధారం.

అన్నదాతల అగచాట్లు - శీతల గోదాములు లేక పంటను నిల్వ చేసేందుకు విలవిల - FARMERS SUFFERING IN GUNTUR

బుడమేరు వరదతో పత్తి పంట నాశనం - ఆత్మహత్యే శరణ్యమంటున్న రైతులు - COTTON CROP DAMAGE DUE TO FLOODS

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.