ETV Bharat / state

సైబర్‌ నేరగాళ్లకు సిమ్‌కార్డులు చేరవేస్తున్న ముఠా అరెస్ట్ - Cyber Fraud Helping Gang Arrested

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 19, 2024, 10:19 PM IST

Cyber Fraud Helping Gang Arrested : సైబర్‌ నేరగాళ్లకు సిమ్‌ కార్డులు, బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ముగ్గురు సభ్యుల ముఠా సైబర్‌ సెక్యురిటీ బ్యూరో పోలీసులకు చిక్కింది. ఈ కేటుగాళ్ల ముఠా సమకూరుస్తున్న సిమ్‌కార్డులు, బ్యాంకు అకౌంట్​లను దుబాయికు పంపుతున్నారు. అక్కడ నుంచి మరో నేరగాడు వీటిని చైనాకు పంపుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే విషయంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Cyber Fraud Helping Gang Arrested
Cyber Fraud Helping Gang Arrested (ETV Bharat)

Cyber Fraud Helping Gang Arrested at Hyderabad : సైబర్‌ నేరగాళ్లకు సిమ్‌ కార్డులు, బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న కేటుగాళ్ల ముఠాను తెలంగాణ సైబర్‌ సెక్యురిటీ బ్యూరో పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌ జీడిమెట్ల జగద్గిరిగుట్టకు చెందిన షేక్‌ సుబానీ, చింతల్‌ నివాసి నవీన్‌, ప్రేమ్‌కుమార్​లను అరెస్ట్ చేసిన సైబర్ క్రైం పోలీసులు వారినుంచి 113 సిమ్ కార్డులు, 3 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.

ఇలా దేశంలోని పలు ముఠాల నుంచి సిమ్‌ కార్డులు, బ్యాంకు ఖాతాలను దుబాయ్​లోని విజయ్ అనే కీలక నిందితుడు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ నేరాలకు పాల్పడేందుకు దుబాయ్​లో చైనీయులు ఏర్పాటు చేసిన కాల్‌ సెంటర్​లో విజయ్ పనిచేస్తున్నట్లు గుర్తించారు. భారత్ నుంచి ఒక్క సిమ్‌ కార్డును రూ.500 కొని చైనీయుల కాల్‌ సెంటర్​కు రూ.1,500-3,000 వరకూ విక్రయిస్తునట్లు గుర్తించారు.

ఇండియా టూ దుబాయ్​ సిమ్​ కార్డులు కొరియర్​ : హైదరాబాద్‌కు చెందిన విజయ్‌ పదో తరగతి వరకు చదివాడు, ఉద్యోగం కోసం దుబాయ్‌ వెళ్లాడు. అక్కడ సైబర్‌ నేరాలు చేసేందుకు చైనా దేశస్థులు ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌లో చేరాడు. అందులో పనిచేసేందుకు అర్హత లేకపోయినా సిమ్‌ కార్డులు సమకూర్చడంలో విజయ్‌ దిట్ట. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న సిమ్‌కార్డు సరఫరా చేసే ముఠాతో పరిచయం ఏర్పర్చుకున్న విజయ్‌ అక్కడ నుంచి సిమ్‌ కార్డులు కొరియర్ ద్వారా దుబాయ్​కు తెప్పించుకుంటున్నాడు.

దీంతో పాటు సిమ్ కార్డు, బ్యాంకు ఖాతాలు సేల్ అంటూ టెలిగ్రామ్​లో గ్రూపులు క్రియేట్ చేసిన విజయ్, అతన్ని సంప్రదించిన ఏజెంట్ల నుంచి కూడా అధిక మొత్తంలో సిమ్‌ కార్డులు కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ సిమ్‌ కార్డుల ద్వారా కాల్‌ సెంటర్‌లో ఉన్న ఉద్యోగులు వాట్సప్ అకౌంట్​లు తెరిచి వాటి నుంచి భారతీయులపై సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

Cyber Threat For India From Sim Cards : తాజాగా అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులు సిమ్ కార్డులను నగరంలోని విజయ్ సోదరుడి వద్దకు చేరవేస్తున్నారు. విజయ్ సోదరుడు వాటిని దుబాయ్​కు కొరియర్ చేస్తున్నాడు. కాగా విజయ్ ద్వారా చైనీయులు సేకరించిన సిమ్ కార్డులను సైబర్ నేరగాళ్లు దుబాయ్, థాయిలాండ్​తో పాటు కాంబోడియాలో ఉన్న కాల్‌ సెంటర్​లు కూడా చేరవేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దుబాయ్​లో ఉన్న విజయ్​ను అరెస్ట్ చేస్తేనే, కీలక సమాచారం వచ్చే అవకాశం ఉంది.

చైనా హ్యాకర్ల చేతిలో భారత డేటా- మరో 19 దేశాలపైనా సైబర్​ దాడి!

Search Engine Cyber Security : సెర్చ్‌లో ఈ పొరపాట్లు చేస్తున్నారా?.. ఈ టిప్స్​ ఫాలో అవ్వకపోతే మీ బ్యాంక్‌ ఖాతా ఖాళీ!

Cyber Fraud Helping Gang Arrested at Hyderabad : సైబర్‌ నేరగాళ్లకు సిమ్‌ కార్డులు, బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న కేటుగాళ్ల ముఠాను తెలంగాణ సైబర్‌ సెక్యురిటీ బ్యూరో పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌ జీడిమెట్ల జగద్గిరిగుట్టకు చెందిన షేక్‌ సుబానీ, చింతల్‌ నివాసి నవీన్‌, ప్రేమ్‌కుమార్​లను అరెస్ట్ చేసిన సైబర్ క్రైం పోలీసులు వారినుంచి 113 సిమ్ కార్డులు, 3 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.

ఇలా దేశంలోని పలు ముఠాల నుంచి సిమ్‌ కార్డులు, బ్యాంకు ఖాతాలను దుబాయ్​లోని విజయ్ అనే కీలక నిందితుడు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ నేరాలకు పాల్పడేందుకు దుబాయ్​లో చైనీయులు ఏర్పాటు చేసిన కాల్‌ సెంటర్​లో విజయ్ పనిచేస్తున్నట్లు గుర్తించారు. భారత్ నుంచి ఒక్క సిమ్‌ కార్డును రూ.500 కొని చైనీయుల కాల్‌ సెంటర్​కు రూ.1,500-3,000 వరకూ విక్రయిస్తునట్లు గుర్తించారు.

ఇండియా టూ దుబాయ్​ సిమ్​ కార్డులు కొరియర్​ : హైదరాబాద్‌కు చెందిన విజయ్‌ పదో తరగతి వరకు చదివాడు, ఉద్యోగం కోసం దుబాయ్‌ వెళ్లాడు. అక్కడ సైబర్‌ నేరాలు చేసేందుకు చైనా దేశస్థులు ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌లో చేరాడు. అందులో పనిచేసేందుకు అర్హత లేకపోయినా సిమ్‌ కార్డులు సమకూర్చడంలో విజయ్‌ దిట్ట. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న సిమ్‌కార్డు సరఫరా చేసే ముఠాతో పరిచయం ఏర్పర్చుకున్న విజయ్‌ అక్కడ నుంచి సిమ్‌ కార్డులు కొరియర్ ద్వారా దుబాయ్​కు తెప్పించుకుంటున్నాడు.

దీంతో పాటు సిమ్ కార్డు, బ్యాంకు ఖాతాలు సేల్ అంటూ టెలిగ్రామ్​లో గ్రూపులు క్రియేట్ చేసిన విజయ్, అతన్ని సంప్రదించిన ఏజెంట్ల నుంచి కూడా అధిక మొత్తంలో సిమ్‌ కార్డులు కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ సిమ్‌ కార్డుల ద్వారా కాల్‌ సెంటర్‌లో ఉన్న ఉద్యోగులు వాట్సప్ అకౌంట్​లు తెరిచి వాటి నుంచి భారతీయులపై సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

Cyber Threat For India From Sim Cards : తాజాగా అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులు సిమ్ కార్డులను నగరంలోని విజయ్ సోదరుడి వద్దకు చేరవేస్తున్నారు. విజయ్ సోదరుడు వాటిని దుబాయ్​కు కొరియర్ చేస్తున్నాడు. కాగా విజయ్ ద్వారా చైనీయులు సేకరించిన సిమ్ కార్డులను సైబర్ నేరగాళ్లు దుబాయ్, థాయిలాండ్​తో పాటు కాంబోడియాలో ఉన్న కాల్‌ సెంటర్​లు కూడా చేరవేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దుబాయ్​లో ఉన్న విజయ్​ను అరెస్ట్ చేస్తేనే, కీలక సమాచారం వచ్చే అవకాశం ఉంది.

చైనా హ్యాకర్ల చేతిలో భారత డేటా- మరో 19 దేశాలపైనా సైబర్​ దాడి!

Search Engine Cyber Security : సెర్చ్‌లో ఈ పొరపాట్లు చేస్తున్నారా?.. ఈ టిప్స్​ ఫాలో అవ్వకపోతే మీ బ్యాంక్‌ ఖాతా ఖాళీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.