ETV Bharat / state

మీర్​పేట్​లో బాలుడి మిస్సింగ్ - రైలెక్కి ఏకంగా తిరుపతికి - ఎట్టకేలకు దొరికిన ఆచూకీ - Missing boy Found IN tirupati

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 6, 2024, 9:18 AM IST

Updated : Aug 6, 2024, 10:26 AM IST

Meerpet Boy found In Tirupati : హైదరాబాద్​లో మీర్​పేట్ బాలుడి మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. ఇంటి నుంచి ట్యూషన్ వెళ్లిన బాలుడు మలక్‌పేటలో రైలు ఎక్కి తిరుపతి వెళ్లాడు. తిరుపతిలో బాలుడిని గుర్తించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించి స్థానిక పోలీసులకు బాలుడిని అప్పగించారు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి మీర్​పేట్​ పోలీసులు తిరుపతి బయల్దేరి వెళ్లారు.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

Boy Missing From Meerpet Found In Tirupati : రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలో 8వ తరగతి చదువుతున్న బాలుడి అదృశ్యం ఘటన సుఖాంతమైంది. ఆదివారం సాయంత్రం ట్యూషన్​కు వెళ్లిన బాలుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. ఎంతకీ బాలుడి ఆచూకీ తెలియకపోవడంతో మీర్​పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలుడికోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈలోగా తిరుపతి పోలీసులు బాలుడు తమవద్ద ఉన్నట్లు కుటుంబసభ్యులతో పాటుగా, మీర్​పేట్ పోలీసులకు సమాచారం అందించారు.

మీర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం : జిల్లెలగూడ దాసరినారాయణరావు నగర్‌కు చెందిన బాలుడు మీర్‌పేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఇద్దరు అన్నదమ్ములు ప్రతిరోజు మీర్‌పేటలో ట్యూషన్‌కు వెళ్తుంటారు. ఈనెల 4వ తేదీన సాయంత్రం ఆ బాలుడు తన సోదరుడితో ట్యూషన్‌కు వెళ్లారు. ట్యూషన్‌కు వెళ్లిన ఆ అబ్బాయి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు మొదట చుట్టుపక్కల వెతికారు. ఎంతకీ బాలుడి ఆచూకీ లభించకపోవడంతో మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ట్యాషన్‌కు వెళ్తున్నాని చెప్పి బయటకు వచ్చిన బాలుడు ద్విచక్ర వాహనదారుడిని లిఫ్ట్‌ అడిగి కొంత దూరం వెళ్లిన తర్వాత బైక్ దిగి బస్టాప్‌ వద్దకు చేరుకున్నాడు. మీర్​పేట్ జంక్షన్​లో బస్టాప్​లో దిగాడు. అలా నడుచుకుంటూ మలక్​పేట్ వెళ్లాడు. రైల్వే స్టేషన్​లోకి వెళ్లిన బాలుడు ట్రైన్ ఎక్కి తిరుపతి చేరుకున్నాడు.

తిరుపతి పోలీసుల సహకారంతో : తిరుపతిలో స్కూల్‌ డ్రెస్‌తో తిరుగుతున్న బాలుడిని చూసిన స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో ఆ బాలుడిని ప్రశ్నించారు. తాను హైదరాబాద్‌ నుంచి వచ్చినట్టు తెలిపాడు. బాలుడి వద్ద నుంచి అతని తండ్రి ఫోన్‌ నెంబర్‌ తీసుకొని, ఫోన్‌ చేసి బాబు క్షేమంగా ఉన్నట్టు తెలిపారు. అతడిని తిరుపతిలో పోలీసులకు అప్పగించారు. అతడి క్షేమ సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మీర్‌పేట్‌ పోలీసులతో కలిసి బాలుడి తల్లిదండ్రులు ప్రస్తుతం తిరుపతి వెళ్లారు.

ట్యూషన్​కు వెళ్లిన బాలుడు అదృశ్యం - 4 బృందాలతో పోలీసుల గాలింపు

ఏపీలో యువతి మిస్సింగ్ - రంగంలోకి పవన్ కల్యాణ్ - 9 నెలల మిస్టరీ 10 రోజుల్లో? - Girl missing Case in Vijayawada

Boy Missing From Meerpet Found In Tirupati : రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలో 8వ తరగతి చదువుతున్న బాలుడి అదృశ్యం ఘటన సుఖాంతమైంది. ఆదివారం సాయంత్రం ట్యూషన్​కు వెళ్లిన బాలుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. ఎంతకీ బాలుడి ఆచూకీ తెలియకపోవడంతో మీర్​పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలుడికోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈలోగా తిరుపతి పోలీసులు బాలుడు తమవద్ద ఉన్నట్లు కుటుంబసభ్యులతో పాటుగా, మీర్​పేట్ పోలీసులకు సమాచారం అందించారు.

మీర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం : జిల్లెలగూడ దాసరినారాయణరావు నగర్‌కు చెందిన బాలుడు మీర్‌పేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఇద్దరు అన్నదమ్ములు ప్రతిరోజు మీర్‌పేటలో ట్యూషన్‌కు వెళ్తుంటారు. ఈనెల 4వ తేదీన సాయంత్రం ఆ బాలుడు తన సోదరుడితో ట్యూషన్‌కు వెళ్లారు. ట్యూషన్‌కు వెళ్లిన ఆ అబ్బాయి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు మొదట చుట్టుపక్కల వెతికారు. ఎంతకీ బాలుడి ఆచూకీ లభించకపోవడంతో మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ట్యాషన్‌కు వెళ్తున్నాని చెప్పి బయటకు వచ్చిన బాలుడు ద్విచక్ర వాహనదారుడిని లిఫ్ట్‌ అడిగి కొంత దూరం వెళ్లిన తర్వాత బైక్ దిగి బస్టాప్‌ వద్దకు చేరుకున్నాడు. మీర్​పేట్ జంక్షన్​లో బస్టాప్​లో దిగాడు. అలా నడుచుకుంటూ మలక్​పేట్ వెళ్లాడు. రైల్వే స్టేషన్​లోకి వెళ్లిన బాలుడు ట్రైన్ ఎక్కి తిరుపతి చేరుకున్నాడు.

తిరుపతి పోలీసుల సహకారంతో : తిరుపతిలో స్కూల్‌ డ్రెస్‌తో తిరుగుతున్న బాలుడిని చూసిన స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో ఆ బాలుడిని ప్రశ్నించారు. తాను హైదరాబాద్‌ నుంచి వచ్చినట్టు తెలిపాడు. బాలుడి వద్ద నుంచి అతని తండ్రి ఫోన్‌ నెంబర్‌ తీసుకొని, ఫోన్‌ చేసి బాబు క్షేమంగా ఉన్నట్టు తెలిపారు. అతడిని తిరుపతిలో పోలీసులకు అప్పగించారు. అతడి క్షేమ సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మీర్‌పేట్‌ పోలీసులతో కలిసి బాలుడి తల్లిదండ్రులు ప్రస్తుతం తిరుపతి వెళ్లారు.

ట్యూషన్​కు వెళ్లిన బాలుడు అదృశ్యం - 4 బృందాలతో పోలీసుల గాలింపు

ఏపీలో యువతి మిస్సింగ్ - రంగంలోకి పవన్ కల్యాణ్ - 9 నెలల మిస్టరీ 10 రోజుల్లో? - Girl missing Case in Vijayawada

Last Updated : Aug 6, 2024, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.