ETV Bharat / sports

భారత్ అందుకే ఆతిథ్యం ఇవ్వట్లేదు - టీ20 మహిళా ప్రపంచకప్​ విషయంలో జై షా క్లారిటీ ఇదే! - T20 Womens World Cup 2024

author img

By ETV Bharat Sports Team

Published : Aug 15, 2024, 10:45 PM IST

T20 Womens World Cup 2024 : మహిళల టీ20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వబోదని బీసీసీఐ సెక్రటరీ జై షా తాజాగా తెలిపారు. అయితే దీనికి గల కారణాలు ఏంటంటే?

T20 Womens World Cup 2024
T20 Womens World Cup 2024 (Getty Images, IANS)

T20 Womens World Cup 2024 : బంగ్లాదేశ్‌లో మొదలైన సంక్షోభంతో 2024 మహిళల టీ20 ప్రపంచ కప్‌ నిర్వహణకు సమస్యలు ఎదురయ్యాయి. ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వాలని ఐసీసీ చేసిన ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించింది. ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి 20 టోర్నీ నిర్వహించాలని భారత బోర్డుని ఐసీసీ సంప్రదించినట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా పేర్కొన్నారు. కొన్ని ప్రధాన కారణాల వల్ల టోర్నీ నిర్వహణకు బీసీసీఐ ఆసక్తి చూపలేదని ఆయన అన్నారు.

ప్రస్తుతం భారత్​లో వర్షాకాలం నడుస్తోంది. ఈ సమయంలో టోర్నీని నిర్వహించడం చాలా కష్టం. ముఖ్యంగా ప్లేయర్‌ల ట్రావెలింగ్‌కి ఇబ్బందులు ఎదురవుతాయి. అలానే భారతదేశం వచ్చే ఏడాది మహిళల వన్డే ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. వెంట వెంటనే రెండు వరల్డ్‌ కప్‌లు నిర్వహించడం అసాధ్యం. ఈ రెండు ప్రధాన కారణాలతో టీ20 మహిళల ప్రపంచ కప్‌ నిర్వహణకు ముందుకు రాలేదని జై షా స్పష్టం చేశారు.

టీ20 వరల్డ్‌ కప్‌ ఎక్కడ జరుగుతుంది?
భారతదేశం బయటకు రావడంతో ఇప్పుడు శ్రీలంక, యూఏఈ రేస్‌లో ఉన్నాయి. ఆతిథ్య దేశంపై ఆగస్టు 20న ఐసీసీ తుది నిర్ణయం తీసుకోనుంది.

బంగ్లాదేశ్‌లో నిరసనలు
వాస్తవంగా టీ20 మహిళల వరల్డ్‌ కప్‌ బంగ్లాదేశ్‌లో జరగాల్సి ఉంది. అక్కడ మొదలైన రాజకీయ సంక్షోభం, నిరసనల నేపథ్యంలో ఐసీసీకి ప్రత్యామ్నాయం అవసరమైంది. టోర్నమెంట్‌ని సజావుగా నిర్వహించేందుకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఆటగాళ్ల శ్రేయస్సు దృష్ట్యా ICC ఈవెంట్‌ను మరో చోటుకు మార్చాలని నిర్ణయించింది.

ప్రయాణ పరిమితులు
భారతదేశం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే (ఇంగ్లాండ్, స్కాట్లాండ్) సహా అనేక దేశాల ప్రభుత్వాలు విధించిన ప్రయాణ పరిమితుల వల్ల పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. ఈ పరిమితులు దాటి ఆయా దేశాలు బంగ్లాదేశ్‌లో ప్రపంచ కప్‌ కోసం అడుగు పెట్టలేవు. ఈ పరిమితులు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)కి అదనపు సవాళ్లను కలిగిస్తాయి.

మేము వారితో మాట్లాడలేదు
బంగ్లాదేశ్ జట్టు ప్రస్తుతం పాకిస్థాన్‌ పర్యటనలో ఉంది. సెప్టెంబర్‌లో భారత్‌లో అడుగు పెడుతుంది. మొత్తం రెండు టెస్ట్‌లు, మూడు టీ20లు ఆడనుంది. సెప్టెంబర్ 19న చెన్నైలో మొదటి టెస్ట్‌ ప్రారంభమవుతుంది. దీనిపై జై షా స్పందిస్తూ, 'బంగ్లాదేశ్‌ సిరీస్‌ మాకు చాలా కీలకం. మేము వారితో (బంగ్లాదేశ్ అధికారులతో) మాట్లాడలేదు. అక్కడ కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టింది. త్వరలో వారు మమ్మల్ని సంప్రదించవచ్చు. లేదా నేను వారిని సంప్రదిస్తాను.' అన్నాడు.

T20 వరల్డ్​కప్​పై బంగ్లా అల్లర్ల ఎఫెక్ట్- టోర్నమెంట్ ఆ దేశానికి షిఫ్ట్​! - Womens T20 World Cup 2024

ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది? క్రికెట్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా? - First International Cricket Match

T20 Womens World Cup 2024 : బంగ్లాదేశ్‌లో మొదలైన సంక్షోభంతో 2024 మహిళల టీ20 ప్రపంచ కప్‌ నిర్వహణకు సమస్యలు ఎదురయ్యాయి. ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వాలని ఐసీసీ చేసిన ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించింది. ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి 20 టోర్నీ నిర్వహించాలని భారత బోర్డుని ఐసీసీ సంప్రదించినట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా పేర్కొన్నారు. కొన్ని ప్రధాన కారణాల వల్ల టోర్నీ నిర్వహణకు బీసీసీఐ ఆసక్తి చూపలేదని ఆయన అన్నారు.

ప్రస్తుతం భారత్​లో వర్షాకాలం నడుస్తోంది. ఈ సమయంలో టోర్నీని నిర్వహించడం చాలా కష్టం. ముఖ్యంగా ప్లేయర్‌ల ట్రావెలింగ్‌కి ఇబ్బందులు ఎదురవుతాయి. అలానే భారతదేశం వచ్చే ఏడాది మహిళల వన్డే ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. వెంట వెంటనే రెండు వరల్డ్‌ కప్‌లు నిర్వహించడం అసాధ్యం. ఈ రెండు ప్రధాన కారణాలతో టీ20 మహిళల ప్రపంచ కప్‌ నిర్వహణకు ముందుకు రాలేదని జై షా స్పష్టం చేశారు.

టీ20 వరల్డ్‌ కప్‌ ఎక్కడ జరుగుతుంది?
భారతదేశం బయటకు రావడంతో ఇప్పుడు శ్రీలంక, యూఏఈ రేస్‌లో ఉన్నాయి. ఆతిథ్య దేశంపై ఆగస్టు 20న ఐసీసీ తుది నిర్ణయం తీసుకోనుంది.

బంగ్లాదేశ్‌లో నిరసనలు
వాస్తవంగా టీ20 మహిళల వరల్డ్‌ కప్‌ బంగ్లాదేశ్‌లో జరగాల్సి ఉంది. అక్కడ మొదలైన రాజకీయ సంక్షోభం, నిరసనల నేపథ్యంలో ఐసీసీకి ప్రత్యామ్నాయం అవసరమైంది. టోర్నమెంట్‌ని సజావుగా నిర్వహించేందుకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఆటగాళ్ల శ్రేయస్సు దృష్ట్యా ICC ఈవెంట్‌ను మరో చోటుకు మార్చాలని నిర్ణయించింది.

ప్రయాణ పరిమితులు
భారతదేశం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే (ఇంగ్లాండ్, స్కాట్లాండ్) సహా అనేక దేశాల ప్రభుత్వాలు విధించిన ప్రయాణ పరిమితుల వల్ల పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. ఈ పరిమితులు దాటి ఆయా దేశాలు బంగ్లాదేశ్‌లో ప్రపంచ కప్‌ కోసం అడుగు పెట్టలేవు. ఈ పరిమితులు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)కి అదనపు సవాళ్లను కలిగిస్తాయి.

మేము వారితో మాట్లాడలేదు
బంగ్లాదేశ్ జట్టు ప్రస్తుతం పాకిస్థాన్‌ పర్యటనలో ఉంది. సెప్టెంబర్‌లో భారత్‌లో అడుగు పెడుతుంది. మొత్తం రెండు టెస్ట్‌లు, మూడు టీ20లు ఆడనుంది. సెప్టెంబర్ 19న చెన్నైలో మొదటి టెస్ట్‌ ప్రారంభమవుతుంది. దీనిపై జై షా స్పందిస్తూ, 'బంగ్లాదేశ్‌ సిరీస్‌ మాకు చాలా కీలకం. మేము వారితో (బంగ్లాదేశ్ అధికారులతో) మాట్లాడలేదు. అక్కడ కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టింది. త్వరలో వారు మమ్మల్ని సంప్రదించవచ్చు. లేదా నేను వారిని సంప్రదిస్తాను.' అన్నాడు.

T20 వరల్డ్​కప్​పై బంగ్లా అల్లర్ల ఎఫెక్ట్- టోర్నమెంట్ ఆ దేశానికి షిఫ్ట్​! - Womens T20 World Cup 2024

ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది? క్రికెట్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా? - First International Cricket Match

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.