ETV Bharat / sports

ఫ్రాంచైజీకి లక్ తెచ్చిన ప్రీతీ జింటా - ఆ తప్పు వరంగా మారింది! - Preity Zinta IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 26, 2024, 1:51 PM IST

Preity Zinta IPL 2024 : ఐపీఎల్ మినీ వేలంలో పంజాబ్ జట్టు కో ఓనర్ ప్రీతీ జింటా చేసిన ఓ తప్పిదం ఇప్పుడు వారికి ఎంతో సాయం చేస్తోంది. ఇంతకీ ఆమె ఏం చేశారంటే ?

Preity Zinta IPL 2024
Preity Zinta IPL 2024

Preity Zinta IPL 2024 : అది 2023 డిసెంబర్. ఐపీఎల్ 17వ సీజన్ కోసం మినీ వేలం జరుగుతున్న సమయం. ఎంతో ఇంట్రెస్టింగ్​గా జరుగుతున్న ఈ వేలంలో పోటా పోటీగా ఫ్రాంచైజీలు ప్లేయర్లను ఎంచుకుంటోంది. అయితే ఇదే సమయంలో పంజాబ్ కింగ్స్​ కో ఓనర్ బాలీవుడ్ బ్యూటీ ప్రీతీ జింటా ఓ తప్పిదం చేశారు. ఒకే పేరుతో ఇద్దరు ఆటగాళ్లు ఉండటంతో వల్ల ఓ యంగ్​ ప్లేయర్​కు బదులుగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 32 ఏళ్ల శశాంక్ సింగ్‌ను ఎంచుకున్నారు. అతడ్ని రూ. 20 లక్షలకు పంజాబ్ కొనుగోలు చేసింది. అయితే ఇదంతా జరిగిన కొద్ది సేపటి తర్వాత పంజాబ్ ఫ్రాంచైజీ ఆ తప్పిదాన్ని గుర్తించింది. కానీ చేసేదేం లేక దాన్ని కప్పిపుచ్చుకుంది.

అయితే అప్పుడు వాళ్లు చేసిన తప్పిదం ఇప్పుడు వాళ్లకు ఓ వరంలా మారింది. ఏ ప్లేయర్​ను అయితే వద్దనుకున్నారో అతడే మ్యాచ్​లో దుమ్మురేపుతున్నాడు. మెరుగైన పెర్ఫామెన్స్​తో అదరగొడుతున్నాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా సోమవారం (మార్చి 25)న ఆర్సీబీతో జరిగిన పోరులో శశాంక్ తన భారీ ఇన్నింగ్స్​తో జట్టును ఆదుకున్నాడు. 19 ఓవర్లకే 6 వికెట్స్ కోల్పోయిన పంజాబ్ జట్టుకు అండగా నిలిచాడు. ఫోర్లు, సిక్సర్లు బాది ఒకే ఓవర్​లో 20 పరుగులు సాధించాడు. అయితే అతడి పోరాటం వృథా అయిపోయింది. హోరా హోరీగా జరిగిన పోరులో ఆర్సీబీదే పై చేయిగా నిలిచింది. అయినప్పటికీ ఇప్పుడు అందరి దృష్టి శశాంక్​పై పడింది. అతడి ఆట తీరును కొనియాడుతున్నారు. పంజాబ్ జట్టుకు మంచి ప్లేయర్​ దొరికాడంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే - తొలుత టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన పంజాబ్‌ 6 వికెట్ల నష్టానికి 176 రన్స్ చేసింది. తొలి బాల్​ నుంచే ఆచీతూచీ ఆడింది. ప్రత్యర్థులు వేసిన బంతులను చాకచక్యంగా ఎదుర్కొని మంచి స్కోర్ చేసింది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (37 బంతుల్లో 5×4, 1×6 సాయంతో 45 పరుగులు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. జితేశ్‌ శర్మ (20 బంతుల్లో 1×4, 2×6 సాయంతో 27 పరుగులు), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (17 బంతుల్లో 2×4, 2×6 సాయంతో 25 పరుగులు), సామ్‌ కరన్‌ (17 బంతుల్లో 3×4 సాయంతో 23 పరుగులు) చేశారు. చివరి ఓవర్​లో వచ్చిన శశాంక్‌ సింగ్ (21) కూడా కీలక ఇన్నింగ్స్ అందించాడు. సిరాజ్‌, మ్యాక్స్‌వెల్‌ తలో రెండు వికెట్లు తీశారు. అల్జారీ జోసెఫ్‌,యశ్ దయాల్ చెరో వికెట్ పడగొట్టారు.

Preity Zinta IPL 2024 : అది 2023 డిసెంబర్. ఐపీఎల్ 17వ సీజన్ కోసం మినీ వేలం జరుగుతున్న సమయం. ఎంతో ఇంట్రెస్టింగ్​గా జరుగుతున్న ఈ వేలంలో పోటా పోటీగా ఫ్రాంచైజీలు ప్లేయర్లను ఎంచుకుంటోంది. అయితే ఇదే సమయంలో పంజాబ్ కింగ్స్​ కో ఓనర్ బాలీవుడ్ బ్యూటీ ప్రీతీ జింటా ఓ తప్పిదం చేశారు. ఒకే పేరుతో ఇద్దరు ఆటగాళ్లు ఉండటంతో వల్ల ఓ యంగ్​ ప్లేయర్​కు బదులుగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 32 ఏళ్ల శశాంక్ సింగ్‌ను ఎంచుకున్నారు. అతడ్ని రూ. 20 లక్షలకు పంజాబ్ కొనుగోలు చేసింది. అయితే ఇదంతా జరిగిన కొద్ది సేపటి తర్వాత పంజాబ్ ఫ్రాంచైజీ ఆ తప్పిదాన్ని గుర్తించింది. కానీ చేసేదేం లేక దాన్ని కప్పిపుచ్చుకుంది.

అయితే అప్పుడు వాళ్లు చేసిన తప్పిదం ఇప్పుడు వాళ్లకు ఓ వరంలా మారింది. ఏ ప్లేయర్​ను అయితే వద్దనుకున్నారో అతడే మ్యాచ్​లో దుమ్మురేపుతున్నాడు. మెరుగైన పెర్ఫామెన్స్​తో అదరగొడుతున్నాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా సోమవారం (మార్చి 25)న ఆర్సీబీతో జరిగిన పోరులో శశాంక్ తన భారీ ఇన్నింగ్స్​తో జట్టును ఆదుకున్నాడు. 19 ఓవర్లకే 6 వికెట్స్ కోల్పోయిన పంజాబ్ జట్టుకు అండగా నిలిచాడు. ఫోర్లు, సిక్సర్లు బాది ఒకే ఓవర్​లో 20 పరుగులు సాధించాడు. అయితే అతడి పోరాటం వృథా అయిపోయింది. హోరా హోరీగా జరిగిన పోరులో ఆర్సీబీదే పై చేయిగా నిలిచింది. అయినప్పటికీ ఇప్పుడు అందరి దృష్టి శశాంక్​పై పడింది. అతడి ఆట తీరును కొనియాడుతున్నారు. పంజాబ్ జట్టుకు మంచి ప్లేయర్​ దొరికాడంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే - తొలుత టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన పంజాబ్‌ 6 వికెట్ల నష్టానికి 176 రన్స్ చేసింది. తొలి బాల్​ నుంచే ఆచీతూచీ ఆడింది. ప్రత్యర్థులు వేసిన బంతులను చాకచక్యంగా ఎదుర్కొని మంచి స్కోర్ చేసింది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (37 బంతుల్లో 5×4, 1×6 సాయంతో 45 పరుగులు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. జితేశ్‌ శర్మ (20 బంతుల్లో 1×4, 2×6 సాయంతో 27 పరుగులు), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (17 బంతుల్లో 2×4, 2×6 సాయంతో 25 పరుగులు), సామ్‌ కరన్‌ (17 బంతుల్లో 3×4 సాయంతో 23 పరుగులు) చేశారు. చివరి ఓవర్​లో వచ్చిన శశాంక్‌ సింగ్ (21) కూడా కీలక ఇన్నింగ్స్ అందించాడు. సిరాజ్‌, మ్యాక్స్‌వెల్‌ తలో రెండు వికెట్లు తీశారు. అల్జారీ జోసెఫ్‌,యశ్ దయాల్ చెరో వికెట్ పడగొట్టారు.

కింగ్ దంచేశాడు - విజయం బెంగళూరుదే - RCB Vs PBKS IPL 2024

రంగుల్లో తడిసి ముద్దయిన క్రికెటర్లు - చిన్నపిల్లాడిలా మారిపోయిన రోహిత్​ - Cricketers Holi Celebrations

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.