ETV Bharat / sports

వేర్వేరు క్రీడలు - ఒకటే లక్ష్యం - ఆఖరి పోరులో ముగ్గురూ పసిడి కొడుతారా? - Paris Olympics 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 26, 2024, 1:48 PM IST

Paris Olympics 2024 : సీనియర్ అథ్లెట్లుగా పారిస్ ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టనున్నారు ఈ ముగ్గురు ప్లేయర్లు. అయితే ఇప్పటివరకూ ఎన్నో టోర్నీల్లో సత్తా చాటిన వీరు, ఒలింపిక్సలో తొలి పతకం నెగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరి ఈ ముగ్గురు తమ గేమ్​లో ఎలా రాణిస్తున్నారంటే?

Paris Olympics 2024
Paris Olympics 2024 (Getty Images)

Paris Olympics 2024 : ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్​లో సత్తా చాటేందుకు ఎంతో మంది భారత ప్లేయర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే పలు ఛాంపియన్​షిప్​లు సాధించిన దిగ్గజాలు కూడా పారిస్​ వేదికగా మరిన్ని ఘనతనలను తమ ఖాతాలో వేసుకోవాలన్న కసితో ఉన్నారు. అయితే అందులో కొందరు మాత్రం తమ సుదీర్ఘ కెరీర్‌లో ఒలింపిక్‌ పతకాన్ని సాధించుకోవాలన్న వెలితిని తీర్చుకోకుండానే కెరీర్లు ముగిస్తారా అన్న బాధలో ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్​లో టెన్నీస్​ స్టార్ రోహన్ బోపన్న, ఆర్చర్ దీపిక కుమారీ, టేబుల్ టెన్నీస్ ప్లేయర్ శరత్‌ కమల్​. ఈ ముగ్గురూ తమ కెరీర్‌లో చివరిసారి ఆ లక్ష్యాన్ని అందుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరీ ఈ ప్లేయర్ల ఫామ్ ఎలా ఉందంటే?

బోపన్న పసిడి పట్టేనా?
పారిస్‌ ఒలింపిక్స్‌లోని పాల్గొంటున్న భారత టీమ్​లో రోహన్‌ బోపన్నే పెద్ద వయస్కుడు. ప్రస్తుతం ఆయనకు 44 ఏళ్లు. అయితే ఈ లేటు వయసులోనే ఆయన మునుపటికంటే జోరుగా ఆడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. తాజాగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌తో పాటు మియామి టైటిల్స్​ను తన ఖాతాలో వేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇప్పుడీ అనుభవంతోనే పారిస్‌ బరిలో దిగుతున్నాడు. అదే ఫామ్​తో తన చివరి ప్రయత్నంలోనూ పతకాన్ని పట్టాలనే సంకల్పంతో ఉన్నాడు.

2016 రియో ఒలింపిక్స్‌లో సానియా మీర్జాతో మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఆడాడు. ఆ గేమ్​లో ఈ జోడీ సెమీఫైనల్‌కు చేరింది. అయితే సెమీస్​లో త్రుటిలో ఓటమిపాలైంది. కాంస్యమైనా దక్కుతుందనుకుంటే అది కూడా జరగలేదు.

మరోవైపు బోపన్నకు తోడుగా శ్రీరామ్‌ బాలాజీ మిక్స్​డ్​ డబుల్స్​లో ఆడనున్నాడు. ఇప్పటివరకు మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) జతగా దూసుకెళ్తున్న బోపన్న, ఈ కొత్త పార్ట్​నర్​తో ఏమేరకు సమన్వయం సాధిస్తాడన్నది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. అన్నీ కలిసొస్తే ఈ ఇద్దరిలోనూ విజయం సాధించగల సత్తా ఉంది.

2004 నుంచే పతకాల వేట
2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌ నుంచి క్రమం తప్పకుండా క్రీడలకు వెళ్తున్నాడు ఆచంట శరత్‌ కమల్‌. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ పతకాన్ని ముద్దాడేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. యంగ్ ప్లేయర్లకు దీటుగా ఆడుతూ ర్యాంకుల్లోనూ మెరుగైన ఈ స్టార్ ప్లేయర్ తన చివరి ప్రయత్నంలో ఎలాగైనా మెడల్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో సత్తా చాటాడు.

ముఖ్యంగా 2022 కామన్వెల్త్​లో సింగిల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్, పురుషుల టీమ్‌ ఇలా మూడు విభాగాల్లో పసిడి పతకాన్ని అందుకున్నాడు. ఇప్పుడీ పారిస్ ఒలింపిక్స్‌లో అదరగొట్టి పతకం పట్టేయాలన్నే అతడి చిరకాల కోరిక. టీటీలో ఇప్పటివరకు ఒక్క ఒలింపిక్‌ పతకం రానందున శరత్ మెడల్ సాధిస్తే అది చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఈ క్రీడల్లో సింగిల్స్, డబుల్స్‌లో, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శరత్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

కష్టాల కడలి దాటి పారిస్​కు
ప్రపంచ ఛాంపియ్‌షిప్, ప్రపంచకప్‌ల్లో ఎన్నో పతకాలు కొల్లగొట్టింది ఆర్చరీ స్టార్ దీపిక కుమారి. అయితే ఒలింపిక్స్‌లో మాత్రం ఆమె ప్రతిసారీ నిరాశగానే వెనుతిరిగింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌ మొదలుపెట్టి ఆమెకు ప్రతిసారీ నిరాశే ఎదురైంది. ఇప్పటివరకూ క్వార్టర్‌ ఫైనల్‌కు వెళ్లిన ఆమె, 2020 ఒలింపిక్స్‌ తర్వాత లైమ్​లైట్​ను క్రమంగా వీడుతూ వచ్చింది. పెళ్లి, పిల్లలు ఇలా పలు బాధ్యతల నడుమ ఆమె ఆటలో కొనసాగదని అందరూ అనుకున్నారు. అనారోగ్య సమస్యల వల్ల కూడా ఆమె ఆర్చరీకి దూరమైంది.

అయితే ఎన్నో అవాంతరాల నడుమ, భర్త అతానుదాస్‌ అండతో ఆటలో మళ్లీ సూపర్​ కమ్​బ్యాక్ ఇచ్చింది. 2024లో షాంగై ప్రపంచకప్‌లో రజతంతో సత్తా చాటింది. ఇదే జోష్​తో పారిస్‌ ఒలింపిక్స్​లోనూ ఈ సారి పతకం తన వెంట భారత్​కు తెచ్చుకునేందుకు సిద్ధమవుతోంది.

పారిస్ ఒలింపిక్స్: ఇండియన్ అథ్లెట్లు ఈవెంట్లు- పూర్తి షెడ్యూల్ ఇదే! - Paris Olympics 2024

ఈ ఒలింపిక్ టార్జాన్, ఓ రియల్ లైఫ్​ హీరో- స్విమ్మింగ్ స్టార్ వీజ్‌ముల్లర్‌ గురించి తెలుసా? - Paris Olympics 2024

Paris Olympics 2024 : ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్​లో సత్తా చాటేందుకు ఎంతో మంది భారత ప్లేయర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే పలు ఛాంపియన్​షిప్​లు సాధించిన దిగ్గజాలు కూడా పారిస్​ వేదికగా మరిన్ని ఘనతనలను తమ ఖాతాలో వేసుకోవాలన్న కసితో ఉన్నారు. అయితే అందులో కొందరు మాత్రం తమ సుదీర్ఘ కెరీర్‌లో ఒలింపిక్‌ పతకాన్ని సాధించుకోవాలన్న వెలితిని తీర్చుకోకుండానే కెరీర్లు ముగిస్తారా అన్న బాధలో ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్​లో టెన్నీస్​ స్టార్ రోహన్ బోపన్న, ఆర్చర్ దీపిక కుమారీ, టేబుల్ టెన్నీస్ ప్లేయర్ శరత్‌ కమల్​. ఈ ముగ్గురూ తమ కెరీర్‌లో చివరిసారి ఆ లక్ష్యాన్ని అందుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరీ ఈ ప్లేయర్ల ఫామ్ ఎలా ఉందంటే?

బోపన్న పసిడి పట్టేనా?
పారిస్‌ ఒలింపిక్స్‌లోని పాల్గొంటున్న భారత టీమ్​లో రోహన్‌ బోపన్నే పెద్ద వయస్కుడు. ప్రస్తుతం ఆయనకు 44 ఏళ్లు. అయితే ఈ లేటు వయసులోనే ఆయన మునుపటికంటే జోరుగా ఆడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. తాజాగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌తో పాటు మియామి టైటిల్స్​ను తన ఖాతాలో వేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇప్పుడీ అనుభవంతోనే పారిస్‌ బరిలో దిగుతున్నాడు. అదే ఫామ్​తో తన చివరి ప్రయత్నంలోనూ పతకాన్ని పట్టాలనే సంకల్పంతో ఉన్నాడు.

2016 రియో ఒలింపిక్స్‌లో సానియా మీర్జాతో మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఆడాడు. ఆ గేమ్​లో ఈ జోడీ సెమీఫైనల్‌కు చేరింది. అయితే సెమీస్​లో త్రుటిలో ఓటమిపాలైంది. కాంస్యమైనా దక్కుతుందనుకుంటే అది కూడా జరగలేదు.

మరోవైపు బోపన్నకు తోడుగా శ్రీరామ్‌ బాలాజీ మిక్స్​డ్​ డబుల్స్​లో ఆడనున్నాడు. ఇప్పటివరకు మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) జతగా దూసుకెళ్తున్న బోపన్న, ఈ కొత్త పార్ట్​నర్​తో ఏమేరకు సమన్వయం సాధిస్తాడన్నది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. అన్నీ కలిసొస్తే ఈ ఇద్దరిలోనూ విజయం సాధించగల సత్తా ఉంది.

2004 నుంచే పతకాల వేట
2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌ నుంచి క్రమం తప్పకుండా క్రీడలకు వెళ్తున్నాడు ఆచంట శరత్‌ కమల్‌. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ పతకాన్ని ముద్దాడేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. యంగ్ ప్లేయర్లకు దీటుగా ఆడుతూ ర్యాంకుల్లోనూ మెరుగైన ఈ స్టార్ ప్లేయర్ తన చివరి ప్రయత్నంలో ఎలాగైనా మెడల్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో సత్తా చాటాడు.

ముఖ్యంగా 2022 కామన్వెల్త్​లో సింగిల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్, పురుషుల టీమ్‌ ఇలా మూడు విభాగాల్లో పసిడి పతకాన్ని అందుకున్నాడు. ఇప్పుడీ పారిస్ ఒలింపిక్స్‌లో అదరగొట్టి పతకం పట్టేయాలన్నే అతడి చిరకాల కోరిక. టీటీలో ఇప్పటివరకు ఒక్క ఒలింపిక్‌ పతకం రానందున శరత్ మెడల్ సాధిస్తే అది చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఈ క్రీడల్లో సింగిల్స్, డబుల్స్‌లో, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శరత్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

కష్టాల కడలి దాటి పారిస్​కు
ప్రపంచ ఛాంపియ్‌షిప్, ప్రపంచకప్‌ల్లో ఎన్నో పతకాలు కొల్లగొట్టింది ఆర్చరీ స్టార్ దీపిక కుమారి. అయితే ఒలింపిక్స్‌లో మాత్రం ఆమె ప్రతిసారీ నిరాశగానే వెనుతిరిగింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌ మొదలుపెట్టి ఆమెకు ప్రతిసారీ నిరాశే ఎదురైంది. ఇప్పటివరకూ క్వార్టర్‌ ఫైనల్‌కు వెళ్లిన ఆమె, 2020 ఒలింపిక్స్‌ తర్వాత లైమ్​లైట్​ను క్రమంగా వీడుతూ వచ్చింది. పెళ్లి, పిల్లలు ఇలా పలు బాధ్యతల నడుమ ఆమె ఆటలో కొనసాగదని అందరూ అనుకున్నారు. అనారోగ్య సమస్యల వల్ల కూడా ఆమె ఆర్చరీకి దూరమైంది.

అయితే ఎన్నో అవాంతరాల నడుమ, భర్త అతానుదాస్‌ అండతో ఆటలో మళ్లీ సూపర్​ కమ్​బ్యాక్ ఇచ్చింది. 2024లో షాంగై ప్రపంచకప్‌లో రజతంతో సత్తా చాటింది. ఇదే జోష్​తో పారిస్‌ ఒలింపిక్స్​లోనూ ఈ సారి పతకం తన వెంట భారత్​కు తెచ్చుకునేందుకు సిద్ధమవుతోంది.

పారిస్ ఒలింపిక్స్: ఇండియన్ అథ్లెట్లు ఈవెంట్లు- పూర్తి షెడ్యూల్ ఇదే! - Paris Olympics 2024

ఈ ఒలింపిక్ టార్జాన్, ఓ రియల్ లైఫ్​ హీరో- స్విమ్మింగ్ స్టార్ వీజ్‌ముల్లర్‌ గురించి తెలుసా? - Paris Olympics 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.